ముంబైలోని ఓ కార్పొరేట్ ఆఫీసులో జరిగిన ఘటన వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. పదిమంది పని చేసే ఆఫీసు, ఒక మహిళ పాలిట నరకకూపంగా మారింది. 51 ఏళ్ల మహిళా బిజినెస్ ఉమెన్పై ఒక ప్రముఖ ఫార్మా కంపెనీకి చెందిన సీనియర్ అధికారులు చేసిన అఘాయిత్యం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఓ వివాదం విషయంలో తుపాకీతో బెదిరించి, కొట్టి, బలవంతంగా బట్టలు విప్పించి వీడియోలు తీశారనే ఆరోపణలు పోలీసులను కూడా షాక్కు గురిచేస్తున్నాయి.
బాధితురాలు ఫోటో ఫ్రేమ్స్, గిఫ్టింగ్ బిజినెస్ చేస్తున్నారు. పని మీద మహాలక్ష్మి ఏరియాలోని ఆ ఫార్మా కంపెనీ ఆఫీసుకి వెళ్లారు. అక్కడే అసలు దారుణం జరిగింది. ఆఫీసులోని ఒక క్యాబిన్లో ఆరుగురు సీనియర్ ఆఫీసర్లు ఆమెను టార్గెట్ చేశారు. ఒక వ్యక్తి రివాల్వర్ వెనుక భాగంతో ఆమె భుజంపై, వీపుపై బలంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా, ఆమె వేసుకున్న డ్రెస్ ని బలవంతంగా లాగేసి, తలకు తుపాకీ గురిపెట్టి చంపేస్తామని బెదిరించారని బాధితురాలు తెలిపారు.
ప్రాణభయంతో వణికిపోతున్న ఆ మహిళను, బట్టలు విప్పాలంటూ తుపాకీ చూపించి ఫోర్స్ చేశారట. ఆమె ఒంటిపై కేవలం లోదుస్తులు మాత్రమే ఉండేలా చేసి, ఆ దృశ్యాలను తమ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీశారు. తమ మాట వినకపోతే, ఈ అశ్లీల వీడియోలను ఆన్లైన్లో పెట్టి పరువు తీస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. ఒక బిజినెస్ ఉమెన్ని ఆఫీస్ గదిలో బంధించి ఇంత పైశాచికంగా ప్రవర్తించడం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.
కేవలం వీడియోలు తీయడమే కాదు, తమకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. లేదంటే దొంగ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. గతంలో కూడా ఆ కంపెనీకి చెందిన మరో ఆఫీసర్ తనపై నిరాధారమైన ఫిర్యాదులు చేశారని, అప్పటి నుంచి తనను మానసికంగా వేధిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వేధింపుల పర్వం తట్టుకోలేకే ఇప్పుడు ఆమె ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది.
ఎన్.ఎం. జోషి మార్గ్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. లైంగిక వేధింపులు, దాడి, బెదిరింపులు, ఐటీ చట్టం కింద పలు కఠిన సెక్షన్లు నమోదు చేశారు. 2023 జనవరిలో జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనపై ఇప్పుడు పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోంది.
This post was last modified on December 1, 2025 6:46 pm
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…