దైవ కార్యక్రమాలు భక్తి, శ్రద్ధలకు ప్రతీకలు కావాలి. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది సంప్రదాయబద్ధంగా, ఆచార నియమాలకు అనుగుణంగా నిర్వహించే పవిత్ర కార్యక్రమం. అలాంటి వేడుకల్లో రాజకీయాలు, వ్యక్తిగత విభేదాలు చోటుచేసుకోవడం భక్తుల్లో ఆవేదన కలిగిస్తోంది. ఆలయ ప్రాంగణంలో దైవనామ స్మరణ తప్ప మరే వివాదానికీ స్థానం ఉండకూడదని పెద్దలు చెప్పే మాటలు తాజాగా ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో జరిగిన ఘటనతో మరోసారి చర్చకు వచ్చాయి.
నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన కల్యాణోత్సవ వేడుకల్లో పట్టు వస్త్రాల సమర్పణ సమయంలో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య ఇప్పటికే నెలకొన్న విభేదాలు ఈ సందర్భంలో బహిర్గతమయ్యాయి.
సోమవారం రాత్రి జరిగిన వేణుగోపాలస్వామి కల్యాణోత్సవానికి ఎంపీ సతీసమేతంగా హాజరయ్యారు. ఎమ్మెల్యే కూడా దంపతులతో కలిసి కార్యక్రమానికి విచ్చేశారు. స్వామి కల్యాణ మండపానికి ఎదురుగా రుక్మిణి, సత్యభామ విగ్రహాల సమీపంలో పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు స్వామికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలను ఎంపీ దంపతులకు అందజేశారు. అదే సమయంలో మరో వైపున ఉన్న ఎమ్మెల్యే తనకూ పట్టు వస్త్రాలు ఇవ్వాలని కోరుతూ చేతులు చాచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఒకరికే పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉండటంతో పురోహితులు అసౌకర్యానికి గురయ్యారు. ఎమ్మెల్యే దంపతులకు ప్రత్యామ్నాయంగా తలంబ్రాలు అందజేశారు. అయితే ఎంపీకి పట్టు వస్త్రాలు అందజేయడం ఎమ్మెల్యేకు నచ్చలేదు. వెంటనే ఎంపీ చేతిలోని వస్త్రాలను లాక్కుని తన తలపై ఉంచుకుని కల్యాణ మండపం వైపు నడిచారు. ఈ చర్యతో అక్కడికక్కడే ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ అనుచరులు తిరిగి వస్త్రాలు తీసుకునేందుకు ప్రయత్నించగా కొంతసేపు గందరగోళం ఏర్పడింది.
ఎంపీ, ఎమ్మెల్యే మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. అధిష్టానం జోక్యం చేసుకొని సర్ది చెప్పినప్పటికీ కొలిక్కి రావడం లేదు. ఇప్పుడు తాజాగా జరిగిన సంఘటన రాజకీయ విభేదాలను బయటపెట్టింది.
This post was last modified on March 3, 2026 11:19 am
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్గా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్…