దైవ కార్యక్రమాలు భక్తి, శ్రద్ధలకు ప్రతీకలు కావాలి. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది సంప్రదాయబద్ధంగా, ఆచార నియమాలకు అనుగుణంగా నిర్వహించే పవిత్ర కార్యక్రమం. అలాంటి వేడుకల్లో రాజకీయాలు, వ్యక్తిగత విభేదాలు చోటుచేసుకోవడం భక్తుల్లో ఆవేదన కలిగిస్తోంది. ఆలయ ప్రాంగణంలో దైవనామ స్మరణ తప్ప మరే వివాదానికీ స్థానం ఉండకూడదని పెద్దలు చెప్పే మాటలు తాజాగా ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో జరిగిన ఘటనతో మరోసారి చర్చకు వచ్చాయి.
నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన కల్యాణోత్సవ వేడుకల్లో పట్టు వస్త్రాల సమర్పణ సమయంలో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య ఇప్పటికే నెలకొన్న విభేదాలు ఈ సందర్భంలో బహిర్గతమయ్యాయి.
సోమవారం రాత్రి జరిగిన వేణుగోపాలస్వామి కల్యాణోత్సవానికి ఎంపీ సతీసమేతంగా హాజరయ్యారు. ఎమ్మెల్యే కూడా దంపతులతో కలిసి కార్యక్రమానికి విచ్చేశారు. స్వామి కల్యాణ మండపానికి ఎదురుగా రుక్మిణి, సత్యభామ విగ్రహాల సమీపంలో పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు స్వామికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలను ఎంపీ దంపతులకు అందజేశారు. అదే సమయంలో మరో వైపున ఉన్న ఎమ్మెల్యే తనకూ పట్టు వస్త్రాలు ఇవ్వాలని కోరుతూ చేతులు చాచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఒకరికే పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉండటంతో పురోహితులు అసౌకర్యానికి గురయ్యారు. ఎమ్మెల్యే దంపతులకు ప్రత్యామ్నాయంగా తలంబ్రాలు అందజేశారు. అయితే ఎంపీకి పట్టు వస్త్రాలు అందజేయడం ఎమ్మెల్యేకు నచ్చలేదు. వెంటనే ఎంపీ చేతిలోని వస్త్రాలను లాక్కుని తన తలపై ఉంచుకుని కల్యాణ మండపం వైపు నడిచారు. ఈ చర్యతో అక్కడికక్కడే ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ అనుచరులు తిరిగి వస్త్రాలు తీసుకునేందుకు ప్రయత్నించగా కొంతసేపు గందరగోళం ఏర్పడింది.
ఎంపీ, ఎమ్మెల్యే మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. అధిష్టానం జోక్యం చేసుకొని సర్ది చెప్పినప్పటికీ కొలిక్కి రావడం లేదు. ఇప్పుడు తాజాగా జరిగిన సంఘటన రాజకీయ విభేదాలను బయటపెట్టింది.
This post was last modified on March 3, 2026 11:19 am
టాలీవుడ్లో ఒక వెరైటీ కామెడీ టైమింగ్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అనుదీప్ కేవీ. 'జాతిరత్నాలు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద…
భారతదేశంలో డాక్టర్ వృత్తికి ఉన్న గౌరవం అందరికీ తెలిసిందే, కానీ ఇప్పుడు అదే వృత్తిలో ఉన్నవారు తమ పిల్లలను డాక్టర్లుగా…
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడేందుకు టీమ్ ఇండియా సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే…
తమిళనాట త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు రాష్ట్రంలోని అధికార పార్టీ డీఎంకేకు.. అత్యంత కీలకంగా మారున్నాయి. ఒకవైపు…
అదును చూసుకుని వ్యాపార సంస్థలు తమ నైజాన్ని బయట పెట్టుకుంటాయి. పది రూపాయలు పోగేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు చమురు విషయంలోనూ…
రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి, ‘మాస్ రాజా’ అనే ట్యాగ్ను కూడా పక్కన పెట్టి చేసిన సినిమా..…