యావత్ ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు టీకా మనదేశానికీ వచ్చేస్తోంది. వచ్చే వారంలో కరోనా వైరస్ టీకాను బ్రిటన్ లో జనాలకు అందుబాటులోకి తేవటానికి బ్రిటన్ దేశంలోని ఫార్మా కంపెనీ ఫైజర్ ఏర్పాట్లు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఇంగ్లాండ్ లోని జనాలకు టీకా వేయటానికి అక్కడి ప్రభుత్వం ఫైజర్ కంపెనీకి అనుమతులు ఇచ్చిందో వెంటనే అందరి దృష్టి ఫైజర్ డెవలప్ చేసిన టీకా పై పడింది.
ఇందులో భాంగంగానే మనదేశంలోని సంపన్నులు బ్రిటన్ వెళ్ళటానికి రెడీ అయిపోతున్న విషయం ట్రావెట్ ఏజెంట్ల ద్వారా బయటపడింది. కేవలం కరోనా వైరస్ టీకా వేయించుకోవటానికే బాగా డబ్బున్నవాళ్ళు బ్రిటన్ వెళ్ళటానికి రెడీ అయిపోతున్నారన్న విషయం బయటపడగానే దేశంలో సంచలనమైంది. డిసెంబర్ 15 తర్వాత బ్రిటన్ వచ్చే విదేశీయులంతా కచ్చితంగా వారం రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాల్సిందే అనే నిబందన పెట్టింది.
ఐసొలేషన్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని బ్రిటన్ వెళ్ళాలని అనుకున్న మనదేశంలోని సంపన్నులు హోటళ్ళల్లో ఉండటానికి కూడా రెడీ అయిపోయారు. అంటే ఎంత డబ్బులు ఖర్చయినా సరే వెంటనే టీకా వేయించేసుకోవాలనే ఆతృత బయటపడుతోంది. ఈ నేపధ్యంలోనే ఫైజర్ కంపెనీ మనదేశంలో కూడా టీకాను అందుబాటులోకి తెవటానికి రెడీ అయ్యిందన్న వార్త చాలామంది హ్యాపీగా ఫీలవుతున్నారు. కరోనా వైరస్ టీకా ఇండియాలోకే వచ్చేస్తుంటే ఇక తాము బ్రిటన్ వెళ్ళాల్సిన అవసరం లేదని సంపన్నులు డిసైడ్ చేసుకోవచ్చు.
సరే ఎవరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మనదేశంలోని ఫైజర్ డెవలప్ చేసిన టీకా వచ్చేస్తోందంటే అందరు సంతోషించాల్సిందే. కాకపోతే బ్రిటన్ దేశం విస్తార్ణానికి, జనాభాకు మన దేశం విస్తీర్ణానికి, జనాభాకు చాలా వ్యత్యాసముందన్న విషయం గుర్తుంచుకోవాలి. అలాగే అన్నింటికన్నా ముఖ్యంగా వాతావరణంలో చాలా తేడా ఉంది. అందుకనే ఇండియాలో తమ టీకాను -70 డిగ్రీల ఉష్టోగ్రతలో మాత్రమే నిల్వ చేసుకోవాలని కంపెనీ హెచ్చరించింది. సరే ముందంటు టీకా వచ్చేస్తే మిగిలిన విషయాలు పెద్ద లెక్కలోవి కావు. మరి ఎప్పటిలోగా టీకా మనదేశంలోకి వచ్చేస్తుందో చూడాల్సిందే.
This post was last modified on December 4, 2020 11:16 am
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…