యావత్ ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు టీకా మనదేశానికీ వచ్చేస్తోంది. వచ్చే వారంలో కరోనా వైరస్ టీకాను బ్రిటన్ లో జనాలకు అందుబాటులోకి తేవటానికి బ్రిటన్ దేశంలోని ఫార్మా కంపెనీ ఫైజర్ ఏర్పాట్లు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఇంగ్లాండ్ లోని జనాలకు టీకా వేయటానికి అక్కడి ప్రభుత్వం ఫైజర్ కంపెనీకి అనుమతులు ఇచ్చిందో వెంటనే అందరి దృష్టి ఫైజర్ డెవలప్ చేసిన టీకా పై పడింది.
ఇందులో భాంగంగానే మనదేశంలోని సంపన్నులు బ్రిటన్ వెళ్ళటానికి రెడీ అయిపోతున్న విషయం ట్రావెట్ ఏజెంట్ల ద్వారా బయటపడింది. కేవలం కరోనా వైరస్ టీకా వేయించుకోవటానికే బాగా డబ్బున్నవాళ్ళు బ్రిటన్ వెళ్ళటానికి రెడీ అయిపోతున్నారన్న విషయం బయటపడగానే దేశంలో సంచలనమైంది. డిసెంబర్ 15 తర్వాత బ్రిటన్ వచ్చే విదేశీయులంతా కచ్చితంగా వారం రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాల్సిందే అనే నిబందన పెట్టింది.
ఐసొలేషన్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని బ్రిటన్ వెళ్ళాలని అనుకున్న మనదేశంలోని సంపన్నులు హోటళ్ళల్లో ఉండటానికి కూడా రెడీ అయిపోయారు. అంటే ఎంత డబ్బులు ఖర్చయినా సరే వెంటనే టీకా వేయించేసుకోవాలనే ఆతృత బయటపడుతోంది. ఈ నేపధ్యంలోనే ఫైజర్ కంపెనీ మనదేశంలో కూడా టీకాను అందుబాటులోకి తెవటానికి రెడీ అయ్యిందన్న వార్త చాలామంది హ్యాపీగా ఫీలవుతున్నారు. కరోనా వైరస్ టీకా ఇండియాలోకే వచ్చేస్తుంటే ఇక తాము బ్రిటన్ వెళ్ళాల్సిన అవసరం లేదని సంపన్నులు డిసైడ్ చేసుకోవచ్చు.
సరే ఎవరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మనదేశంలోని ఫైజర్ డెవలప్ చేసిన టీకా వచ్చేస్తోందంటే అందరు సంతోషించాల్సిందే. కాకపోతే బ్రిటన్ దేశం విస్తార్ణానికి, జనాభాకు మన దేశం విస్తీర్ణానికి, జనాభాకు చాలా వ్యత్యాసముందన్న విషయం గుర్తుంచుకోవాలి. అలాగే అన్నింటికన్నా ముఖ్యంగా వాతావరణంలో చాలా తేడా ఉంది. అందుకనే ఇండియాలో తమ టీకాను -70 డిగ్రీల ఉష్టోగ్రతలో మాత్రమే నిల్వ చేసుకోవాలని కంపెనీ హెచ్చరించింది. సరే ముందంటు టీకా వచ్చేస్తే మిగిలిన విషయాలు పెద్ద లెక్కలోవి కావు. మరి ఎప్పటిలోగా టీకా మనదేశంలోకి వచ్చేస్తుందో చూడాల్సిందే.
This post was last modified on December 4, 2020 11:16 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…