యావత్ ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు టీకా మనదేశానికీ వచ్చేస్తోంది. వచ్చే వారంలో కరోనా వైరస్ టీకాను బ్రిటన్ లో జనాలకు అందుబాటులోకి తేవటానికి బ్రిటన్ దేశంలోని ఫార్మా కంపెనీ ఫైజర్ ఏర్పాట్లు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఇంగ్లాండ్ లోని జనాలకు టీకా వేయటానికి అక్కడి ప్రభుత్వం ఫైజర్ కంపెనీకి అనుమతులు ఇచ్చిందో వెంటనే అందరి దృష్టి ఫైజర్ డెవలప్ చేసిన టీకా పై పడింది.
ఇందులో భాంగంగానే మనదేశంలోని సంపన్నులు బ్రిటన్ వెళ్ళటానికి రెడీ అయిపోతున్న విషయం ట్రావెట్ ఏజెంట్ల ద్వారా బయటపడింది. కేవలం కరోనా వైరస్ టీకా వేయించుకోవటానికే బాగా డబ్బున్నవాళ్ళు బ్రిటన్ వెళ్ళటానికి రెడీ అయిపోతున్నారన్న విషయం బయటపడగానే దేశంలో సంచలనమైంది. డిసెంబర్ 15 తర్వాత బ్రిటన్ వచ్చే విదేశీయులంతా కచ్చితంగా వారం రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాల్సిందే అనే నిబందన పెట్టింది.
ఐసొలేషన్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని బ్రిటన్ వెళ్ళాలని అనుకున్న మనదేశంలోని సంపన్నులు హోటళ్ళల్లో ఉండటానికి కూడా రెడీ అయిపోయారు. అంటే ఎంత డబ్బులు ఖర్చయినా సరే వెంటనే టీకా వేయించేసుకోవాలనే ఆతృత బయటపడుతోంది. ఈ నేపధ్యంలోనే ఫైజర్ కంపెనీ మనదేశంలో కూడా టీకాను అందుబాటులోకి తెవటానికి రెడీ అయ్యిందన్న వార్త చాలామంది హ్యాపీగా ఫీలవుతున్నారు. కరోనా వైరస్ టీకా ఇండియాలోకే వచ్చేస్తుంటే ఇక తాము బ్రిటన్ వెళ్ళాల్సిన అవసరం లేదని సంపన్నులు డిసైడ్ చేసుకోవచ్చు.
సరే ఎవరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మనదేశంలోని ఫైజర్ డెవలప్ చేసిన టీకా వచ్చేస్తోందంటే అందరు సంతోషించాల్సిందే. కాకపోతే బ్రిటన్ దేశం విస్తార్ణానికి, జనాభాకు మన దేశం విస్తీర్ణానికి, జనాభాకు చాలా వ్యత్యాసముందన్న విషయం గుర్తుంచుకోవాలి. అలాగే అన్నింటికన్నా ముఖ్యంగా వాతావరణంలో చాలా తేడా ఉంది. అందుకనే ఇండియాలో తమ టీకాను -70 డిగ్రీల ఉష్టోగ్రతలో మాత్రమే నిల్వ చేసుకోవాలని కంపెనీ హెచ్చరించింది. సరే ముందంటు టీకా వచ్చేస్తే మిగిలిన విషయాలు పెద్ద లెక్కలోవి కావు. మరి ఎప్పటిలోగా టీకా మనదేశంలోకి వచ్చేస్తుందో చూడాల్సిందే.
This post was last modified on December 4, 2020 11:16 am
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…