చీమలంటే ఆమెకు భయం.. ఆ భయమే ఆమెను ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పింది. నమ్మడానికి ఇది కొంచెం ఆశ్చర్యం అనిపించినా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశం అయింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లాలో చీమలంటే భయంతో పాతికేళ్ల మనీషా సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. కూతురిని ఒంటరిని చేసి తనువు చాలించింది. నన్ను క్షమించండి.. ఈ చీమలతో బతకడం నావల్ల కావట్లేదు.. అంటూ ఆమె తన చివరి లేఖలో పేర్కొంది. మానసిక ఆరోగ్యం, ఫోబియాలకు చికిత్స ఎంత అవసరమో ఈ విషాదకర ఘటన మరోసారి గుర్తు చేసింది.
కొందరికి చీమలంటే భయం.. మరికొందరికి బల్లులు, బొద్దింకలు, సాలీడులు అంటే వణుకు. ఇవన్నీ సహజంగా ఉండేవే. దాదాపు ఇటువంటివి 300 వరకు ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఆత్మహత్య చేసుకునేంతగా ఈ ఫోబియా ఉంటుందా అంటే అవుననే అంటున్నారు సైకాలజిస్టులు. చిన్న భయం సరైన కౌన్సిలింగ్ తీసుకోకపోతే ఎటువంటి పర్యవసానాలకు దారి తీస్తుందే ఈ ఘటన నిరూపిస్తుంది. చీమల ఫోబియాను మైర్మెకోఫోబియా అని కూడా పిలుస్తారు. ఇది పుట్టుకతో వచ్చే అవకాశం లేదు. వారి జీవితంలో జరిగే సంఘటనల కారణంగా రావచ్చని చెబుతున్నారు. ఎటువంటి ఫోబియా అయినా రావడానికి బాల్యంలో ఎదురయ్యే ఘటనలు కారణం కావచ్చు. ముందుగానే దీనిని గుర్తించి కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చని ప్రముఖ సైకాలజిస్ట్ కృష్ణభరత్ తెలిపారు.
మన కంటికి చీమ చిన్నదిగా కనిపించవచ్చును కానీ అటువంటి ఫోబియా ఉన్నవారి మైండ్పై ఆ తీవ్రత ప్రభావం కనిపిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఫోబియా పబ్లిక్లో మాట్లాడడం. ఆ తర్వాత చీకటి అంటే భయపడడం, ఎత్తు ప్రదేశాలు అంటే భయపపడం వంటి ఉన్నాయని తెలిపారు. ప్రారంభ దశలోనే ఇటువంటి ఫోబియాలను తగ్గించవచ్చు అని సైకాలజిస్టులు చెబుతున్నారు.
This post was last modified on November 6, 2025 11:28 pm
డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు లోక్ సభలో వీగిపోయిన నేపథ్యంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ విశ్లేషణలన్నింటిలో ఒకటి మాత్రం…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు.. తమపై చేస్తున్న యుద్ధం నేపథ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ…
దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులకు పార్లమెంటులో చుక్కెదురైంది. డీలిమిటేషన్, మహిళా బిల్లులకు ఆమోదం…
మతపరంగా రిజర్వేషన్లను కల్పించేది లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో తెగేసి చెప్పారు. మహిళా బిల్లు…
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ సంబరాల ఏటిగట్టు ఇప్పటిదాకా విడుదల తేదీ ఖరారు చేసుకోలేదు. ఫిలిం…
మలయాళ హీరో టొవినో థామస్ ఈ మధ్య తెలుగు మీడియాలో బాగానే నానాడు. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ అవకాశాన్ని వదులుకున్నానని,…