ఐపీఎల్ ట్రోఫీని గెలవాలని తొలి సీజన్ నుంచి ఎంతో ప్రయత్నించినా.. 16 సంవత్సరాల పాటు ఆ కలను నెరవేర్చుకోలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐదేసి కప్పులు సాధించగా.. బలం, ఆకర్షణ పరంగా ఆ రెండు జట్లకూ ఏమాత్రం తీసిపోనట్లు కనిపించే ఆర్సీబీకి మాత్రం ఒక్క కప్పూ దక్కలేదు. ప్రతిసారీ భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. ఏదో ఒక దశలో నిష్క్రమించడం.. ఇదీ వరస.
ఆర్సీబీ కప్పు గెలవకపోవడంపై ఎన్నో ఏళ్ల నుంచి ఎంత ట్రోలింగ్ జరుగుతూ వచ్చిందో తెలిసిందే. కోహ్లి సారథ్యంలో పుష్కర కాలం పాటు ప్రయత్నించి ఫెయిలైన ఆర్సీబీ.. ఎట్టకేలకు ఈ ఏడాది రజత్ పటిదార్ నాయకత్వంలో కలను నెరవేర్చుకుంది. కోహ్లి కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గెలిచిన అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు, యాజమాన్యం, అభిమానుల ఆనందానికి అవధులే లేకపోయాయి.
కానీ ఇంత సాధించి ఏం లాభం? వాళ్ల ఆనందం కొన్ని రోజులు కూడా నిలవలేదు. ఆర్సీబీ విజయోత్సవ సంబరాల సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని 11 మంది చనిపోవడంతో ఆనందం ఆవిరైపోయింది. ఆ విషాదం వల్ల ఆర్సీబీ చుట్టూ తీవ్రమైన నెగెటివిటీ ముసురుకుంది. విమర్శలు, ఆరోపణలు, కేసులతో ఆర్సీబీ ప్రతిష్ట మసకబారింది. ఇది ఆర్సీబీ బ్రాండ్ వాల్యూను కూడా దెబ్బ తీసింది. చివరికి ఇప్పుడు ఆర్సీబీ యాజమాన్యం జట్టును అమ్మడానికి రెడీ అయిపోయింది.
ఒక టీం కప్పు గెలిస్తే బ్రాండ్ వాల్యూ పెరగడం.. యజమానుల్లో ఇంకా ఉత్సాహం రావడం చూస్తుంటాం. కానీ ‘ఆర్సీబీ’ విషయంలో దీనికి భిన్నంగా జరగబోతోంది. ఆర్సీబీ సేల్ పూర్తయితే.. వచ్చే ఏడాది జట్టు పేరే మారిపోతుంది. అంటే డిఫెండింగ్ ఛాంపియన్ అని చెప్పుకోవడానికి ఆర్సీబీనే ఉండదన్నమాట. ఇలా కప్పు గెలవగానే తర్వాతి ఏడాదికి ఆ పేరే లేకుండా పోవడం ఎప్పుడూ జరగలేదు. డెక్కన్ ఛార్జర్స్ విషయంలో కొన్నేళ్ల తర్వాత జరిగింది. ఆర్సీబీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న కోహ్లి లాంటి ఆటగాళ్లకు, అభిమానులకు ఇది తీవ్ర నిరాశ కలిగించే విషయమే.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…