Trends

ఇప్పుడు 51 కోట్లు.. అప్పుడు 8 వేలు

భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలవడంపై దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో సంబరాలు జరిగాయో చూస్తూనే ఉన్నాం. గత ఏడాది పురుషుల జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచినపుడు ఏ స్థాయిలో సెలబ్రేషన్ ఉందో.. ఇప్పుడు అదే స్థాయిలో సంబరాలు చేసుకున్నారు. ఇండియన్ టీం ఆడిన ప్రతి మ్యాచ్‌కూ స్టేడియాలు కిక్కిరిసిపోయాయి. ఫైనల్‌ టికెట్ల కోసం అయితే డిమాండ్ మామూలుగా లేదు. ఒక రోజు ముందే టికెట్లన్నీ సోల్డ్ ఔట్ అయిపోయాయి. 

మహిళల క్రికెట్‌‌కు దేశంలో ఈ స్థాయి ఆదరణ వస్తుందని ఓ పదేళ్ల ముందు ఎవ్వరూ ఊహించి ఉండరు. కొన్నేళ్ల నుంచి మహిళల జట్టును గొప్పగా ప్రోత్సహిస్తున్న బీసీసీఐ.. కప్పు గెలిచిన టీంకి రూ.51 కోట్ల భారీ నజరానాను కూడా ప్రకటించింది. మరోవైపు ఐసీసీ నుంచి ట్రోఫీతో పాటుగా రూ.37 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఇవి కాక ప్రభుత్వ, ప్రైవేటు వర్గాల నుంచి రకరకాల నజరానాలు అందబోతున్నాయి భారత జట్టుకు. మొత్తంగా చూస్తే పురుష క్రికెటర్లతో సమానంగా అమ్మాయిలపై కోట్ల వర్షం కురుస్తోంది. 

ఇలా ఇప్పుడు మహిళల జట్టు స్వర్ణయుగమే చూస్తోంది. కానీ 2005లో మహిళల వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో ఒక్కొక్కరికి కేవలం వెయ్యి రూపాయల నజరానా దక్కిందట. ఈ విషయాన్ని అప్పటి కెప్టెన్ మిథాలీ రాజ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అప్పటికి భారత మహిళల జట్టు బీసీసీఐ పరిధిలో లేదు. ఉమన్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.. జట్టును నడిపించేది. వాళ్ల దగ్గర నిధులుండేవి కావు. ప్రపంచకప్ రన్నరప్ అయిన టైంలో అసోసియేషన్ దగ్గర కేవలం రూ.8 వేల నిధులున్నాయని.. ఎలాగోలా సర్దుబాటు చేసి ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున నజరానా అందించారని ఆమె తెలిపింది. 

దీన్ని బట్టి అప్పట్లో మిథాలి బృందం ఎంత కష్టపడి క్రికెట్ ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో జట్టు మొత్తానికి కేవలం మూడు బ్యాట్లు ఉండేవట. ఎక్కువగా రైళ్లలోనే ప్రయాణాలు చేసేవాళ్లు. కొన్నిసార్లు జనరల్ బోగీల్లోనూ వెళ్లేవాళ్లు. ఒక విదేశీ పర్యటనకు డబ్బులు లేక చందాలు వేసుకుని వెళ్లిన రోజులనూ మిథాలి చూసింది. ఐతే 2006లో మహిళల జట్టు బీసీసీఐ పరిధిలోకి వచ్చాక అంతా మారింది. ఇప్పుడు పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజులు, నజరానాలు అందుతున్నాయి మహిళల జట్టుకు.

This post was last modified on November 4, 2025 6:29 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

4 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

5 hours ago

మిస్సింగ్ కేసులు.. లండన్, అమెరికా కంటే మనమే బెటర్ అంట!

సాధారణంగా ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో మనుషులు కనిపించకుండా పోవడం గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఇటీవల…

8 hours ago

జగన్ పర్యటనలు: క్యాడర్‌కు జోష్.. జనాలకు ట్రాఫిక్ కష్టాలు

పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో బైక్‌లు.. కాన్వాయ్ నడుస్తుండగా చుట్టూ జనాలు.. పార్టీ జెండాలు.. పూల వర్షాలు.. సందర్భం…

9 hours ago

‘ఆ నెయ్యి’లో బాత్‌రూం క్లీన్ చేసే రసాయనాలు: చంద్రబాబు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆ లడ్డూలో…

9 hours ago

‘ఏపీలో కల్తీ రిక్రూట్‌మెంట్ బోర్డు’…అసలేంటిది?

'ఏపీలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు లాగా జగన్ "కల్తీ రిక్రూట్‌మెంట్ బోర్డు" అనే వ్యవస్థను స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా…

11 hours ago