తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన ఓ మహిళ.. ఏకంగా 7.3 అడుగుల హైట్ ఉండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఈమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఏడు అడుగుల పైన హైట్ ఉన్న ఈమె.. శ్రీలంక దేశానికి చెందిన ప్రముఖ క్రీడాకారిణి. పేరు తర్జిని శివలింగం. నెట్ బాల్ క్రీడలో శ్రీలంకకు అనేక పతకాలు కూడా తీసుకువచ్చారట. ప్రస్తుతం ఆ క్రీడ నుంచి రిటైరై.. ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్నారు. ఈమె అనూహ్యంగా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు.
శ్రీవారి పరమ భక్తుడైన వానమామలై వరదాచార్యుల పేరుతో వానమామలై పీఠం ఏర్పాటైంది. దీనిని ఆయన వంశీకులు నడిపిస్తున్నారు. దీనికి శ్రీలంకలోనూ.. మఠం ఉంది. ఈ మఠం తరఫున.. తర్జిని శివలింగం.. తిరుమలలో పర్యటించారు. మఠాధి పతులు, మరికొందరు భక్తులతో కలిసి.. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆమె.. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
చిత్రం ఏంటంటే.. ఆమె కన్నా.. ఎక్కువ హైట్ ఎవరూ లేకపోవడం.. ఎత్తయిన గుమ్మాలు, మండపాలను కూడా తలవంచుకుని దాటి వెళ్తున్న వైనం.. వంటివి భక్తులను అమితంగా ఆకర్షించాయి. తర్జిని శివలింగానికి సంబంధించిన ఫొటోలు.. వీడియోలు జోరుగా వైరల్ అవుతుండడంతో వీటికి నెటిజన్ల నుంచి కూడా భారీ లైకులు పడుతున్నాయి. ఈమె.. ఏడడుగుల ఉమెన్ బుల్లెట్! అంటూ కామెంట్లు కురుస్తున్నాయి.
This post was last modified on November 3, 2025 10:59 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…