Trends

బస్సు ప్రమాదం.. పసిపాప పక్కనే ఆమె తల్లి!

కొద్ది రోజుల క్రితం కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన మరువక తెలంగాణలోని చేవెళ్ల దగ్గర మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ అతి వేగంతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన దుర్ఘటనలో 25 మంది దుర్మరణం పాలయ్యారు. మృతులలో ఏడాది వయసున్న చిన్నారి ఉండడం, ఆ పసిపాప పక్కనే ఆమె తల్లి విగత జీవిగా పడి ఉండడం కలచివేస్తోంది.

టిప్పర్ లారీలోని కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడడంతో చాలామంది కంకర కింద చిక్కుకున్నారు. ఎక్కువ మంది ప్రాణాలు పోవడానికి అదే కారణం. దాదాపు 10 మంది ప్రయాణికులు కంకర కిందే సమాధి అయ్యారు. ఈ ఘటనలో బస్సు, టిప్పర్‌ డ్రైవర్లు కూడా చనిపోయారు. ఈ ఘటనలో 24 మందికి గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.

తాండూర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్ లో ఓవర్ స్పీడ్ తో వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అయితే, ఈ రోడ్డుపై అనేక ప్రమాదాలు జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on November 3, 2025 11:17 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

9 hours ago