కొద్ది రోజుల క్రితం కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన మరువక తెలంగాణలోని చేవెళ్ల దగ్గర మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ అతి వేగంతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన దుర్ఘటనలో 25 మంది దుర్మరణం పాలయ్యారు. మృతులలో ఏడాది వయసున్న చిన్నారి ఉండడం, ఆ పసిపాప పక్కనే ఆమె తల్లి విగత జీవిగా పడి ఉండడం కలచివేస్తోంది.
టిప్పర్ లారీలోని కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడడంతో చాలామంది కంకర కింద చిక్కుకున్నారు. ఎక్కువ మంది ప్రాణాలు పోవడానికి అదే కారణం. దాదాపు 10 మంది ప్రయాణికులు కంకర కిందే సమాధి అయ్యారు. ఈ ఘటనలో బస్సు, టిప్పర్ డ్రైవర్లు కూడా చనిపోయారు. ఈ ఘటనలో 24 మందికి గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
తాండూర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్ లో ఓవర్ స్పీడ్ తో వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అయితే, ఈ రోడ్డుపై అనేక ప్రమాదాలు జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on November 3, 2025 11:17 am
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…