Trends

బౌలింగ్ ఇవ్వలేదని బ్యాట్ తో కోపాన్ని చూపించాడా?

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో స్టార్ పర్ఫార్మర్ వాషింగ్టన్ సుందర్. అయితే, ఈ మ్యాచ్‌లో సుందర్ ఆడిన విధానం చూస్తే, బౌలింగ్ ఇవ్వలేదన్న కోపాన్ని బ్యాటింగ్‌పై చూపించాడా అని ఫ్యాన్స్ గట్టిగా మాట్లాడుకుంటున్నారు. సుందర్ ఒక ఆఫ్ స్పిన్నర్ అయినప్పటికీ, అతనికి ఈ మ్యాచ్‌లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు.

సాధారణంగా ఆల్‌రౌండర్‌ అయిన సుందర్‌కు కనీసం ఒకట్రెండు ఓవర్లు ఇవ్వడం మామూలే. ఈ మ్యాచ్‌లో అయితే, బ్యాటర్‌ అయిన అభిషేక్ శర్మకు (1 ఓవర్, 13 పరుగులు) కూడా బౌలింగ్ ఇచ్చారు. అలాంటిది, సుందర్‌ను అసలు పక్కన పెట్టడం ఫ్యాన్స్‌కే కాదు, ఆటగాళ్లకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన రెండు టీ20లలో కూడా సుందర్‌ను ఆడించలేదు. బౌలింగ్‌లో పట్టించుకోని కోపాన్ని, సుందర్ బ్యాట్‌తో ఆసీస్‌పై చూపించాడని అభిమానులు అనుకుంటున్నారు.

సుందర్ తన అద్భుతమైన ఫామ్‌తో ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. 187 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా 111 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు, సుందర్ క్రీజ్‌లోకి వచ్చాడు. అక్కడ నుంచి కేవలం 23 బంతుల్లో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని బ్యాటింగ్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ మెరుపు ఇన్నింగ్స్ స్ట్రైక్ రేట్ ఏకంగా 213.04గా నమోదైంది.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, టిమ్ డేవిడ్ (74) మరియు మార్కస్ స్టాయినిస్ (64) హాఫ్ సెంచరీల సాయంతో 186 పరుగులు చేసింది. టీమ్ ఇండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసి ఆసీస్‌ను కట్టడి చేశారు.

భారత ఛేజింగ్‌లో సూర్యకుమార్ (24), తిలక్ వర్మ (29) రాణించినా, సుందర్ ప్రదర్శనే హైలైట్‌గా నిలిచింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3 వికెట్లు తీశాడు. సుందర్ ఆడిన ఈ ఇన్నింగ్స్ కేవలం స్కోర్ కోసం కాదు, తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఆడాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అంటే, సుందర్‌కు బౌలింగ్ ఇవ్వకపోయినా, తన బ్యాటింగ్ మెరుపుతోనే సిరీస్‌ను నిలబెట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో సెలెక్టర్లకు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు తన గురించి మరోసారి గట్టిగా గుర్తు చేశాడని చెప్పొచ్చు.

This post was last modified on November 2, 2025 8:21 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

24 minutes ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

37 minutes ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

4 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

6 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

7 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

7 hours ago