Trends

బౌలింగ్ ఇవ్వలేదని బ్యాట్ తో కోపాన్ని చూపించాడా?

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో స్టార్ పర్ఫార్మర్ వాషింగ్టన్ సుందర్. అయితే, ఈ మ్యాచ్‌లో సుందర్ ఆడిన విధానం చూస్తే, బౌలింగ్ ఇవ్వలేదన్న కోపాన్ని బ్యాటింగ్‌పై చూపించాడా అని ఫ్యాన్స్ గట్టిగా మాట్లాడుకుంటున్నారు. సుందర్ ఒక ఆఫ్ స్పిన్నర్ అయినప్పటికీ, అతనికి ఈ మ్యాచ్‌లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు.

సాధారణంగా ఆల్‌రౌండర్‌ అయిన సుందర్‌కు కనీసం ఒకట్రెండు ఓవర్లు ఇవ్వడం మామూలే. ఈ మ్యాచ్‌లో అయితే, బ్యాటర్‌ అయిన అభిషేక్ శర్మకు (1 ఓవర్, 13 పరుగులు) కూడా బౌలింగ్ ఇచ్చారు. అలాంటిది, సుందర్‌ను అసలు పక్కన పెట్టడం ఫ్యాన్స్‌కే కాదు, ఆటగాళ్లకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన రెండు టీ20లలో కూడా సుందర్‌ను ఆడించలేదు. బౌలింగ్‌లో పట్టించుకోని కోపాన్ని, సుందర్ బ్యాట్‌తో ఆసీస్‌పై చూపించాడని అభిమానులు అనుకుంటున్నారు.

సుందర్ తన అద్భుతమైన ఫామ్‌తో ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. 187 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా 111 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు, సుందర్ క్రీజ్‌లోకి వచ్చాడు. అక్కడ నుంచి కేవలం 23 బంతుల్లో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని బ్యాటింగ్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ మెరుపు ఇన్నింగ్స్ స్ట్రైక్ రేట్ ఏకంగా 213.04గా నమోదైంది.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, టిమ్ డేవిడ్ (74) మరియు మార్కస్ స్టాయినిస్ (64) హాఫ్ సెంచరీల సాయంతో 186 పరుగులు చేసింది. టీమ్ ఇండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసి ఆసీస్‌ను కట్టడి చేశారు.

భారత ఛేజింగ్‌లో సూర్యకుమార్ (24), తిలక్ వర్మ (29) రాణించినా, సుందర్ ప్రదర్శనే హైలైట్‌గా నిలిచింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3 వికెట్లు తీశాడు. సుందర్ ఆడిన ఈ ఇన్నింగ్స్ కేవలం స్కోర్ కోసం కాదు, తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఆడాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అంటే, సుందర్‌కు బౌలింగ్ ఇవ్వకపోయినా, తన బ్యాటింగ్ మెరుపుతోనే సిరీస్‌ను నిలబెట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో సెలెక్టర్లకు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు తన గురించి మరోసారి గట్టిగా గుర్తు చేశాడని చెప్పొచ్చు.

This post was last modified on November 2, 2025 8:21 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…

14 seconds ago

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…

22 minutes ago

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

2 hours ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

2 hours ago

ధైర్యం అనుమానం మధ్య ‘పెద్ది’ సందిగ్ధం

రేపు ప్రారంభం కావాల్సిన పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏప్రిల్ 8కి వాయిదా వేయడం అభిమానుల్లో ఖంగారు పుట్టిస్తోంది.…

2 hours ago

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

4 hours ago