ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో స్టార్ పర్ఫార్మర్ వాషింగ్టన్ సుందర్. అయితే, ఈ మ్యాచ్లో సుందర్ ఆడిన విధానం చూస్తే, బౌలింగ్ ఇవ్వలేదన్న కోపాన్ని బ్యాటింగ్పై చూపించాడా అని ఫ్యాన్స్ గట్టిగా మాట్లాడుకుంటున్నారు. సుందర్ ఒక ఆఫ్ స్పిన్నర్ అయినప్పటికీ, అతనికి ఈ మ్యాచ్లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు.
సాధారణంగా ఆల్రౌండర్ అయిన సుందర్కు కనీసం ఒకట్రెండు ఓవర్లు ఇవ్వడం మామూలే. ఈ మ్యాచ్లో అయితే, బ్యాటర్ అయిన అభిషేక్ శర్మకు (1 ఓవర్, 13 పరుగులు) కూడా బౌలింగ్ ఇచ్చారు. అలాంటిది, సుందర్ను అసలు పక్కన పెట్టడం ఫ్యాన్స్కే కాదు, ఆటగాళ్లకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఈ మ్యాచ్కు ముందు జరిగిన రెండు టీ20లలో కూడా సుందర్ను ఆడించలేదు. బౌలింగ్లో పట్టించుకోని కోపాన్ని, సుందర్ బ్యాట్తో ఆసీస్పై చూపించాడని అభిమానులు అనుకుంటున్నారు.
సుందర్ తన అద్భుతమైన ఫామ్తో ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. 187 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా 111 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు, సుందర్ క్రీజ్లోకి వచ్చాడు. అక్కడ నుంచి కేవలం 23 బంతుల్లో 49 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతని బ్యాటింగ్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ మెరుపు ఇన్నింగ్స్ స్ట్రైక్ రేట్ ఏకంగా 213.04గా నమోదైంది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, టిమ్ డేవిడ్ (74) మరియు మార్కస్ స్టాయినిస్ (64) హాఫ్ సెంచరీల సాయంతో 186 పరుగులు చేసింది. టీమ్ ఇండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసి ఆసీస్ను కట్టడి చేశారు.
భారత ఛేజింగ్లో సూర్యకుమార్ (24), తిలక్ వర్మ (29) రాణించినా, సుందర్ ప్రదర్శనే హైలైట్గా నిలిచింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3 వికెట్లు తీశాడు. సుందర్ ఆడిన ఈ ఇన్నింగ్స్ కేవలం స్కోర్ కోసం కాదు, తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఆడాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అంటే, సుందర్కు బౌలింగ్ ఇవ్వకపోయినా, తన బ్యాటింగ్ మెరుపుతోనే సిరీస్ను నిలబెట్టాడు. ఈ ఇన్నింగ్స్తో సెలెక్టర్లకు, టీమ్ మేనేజ్మెంట్కు తన గురించి మరోసారి గట్టిగా గుర్తు చేశాడని చెప్పొచ్చు.
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…