భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడిన అయ్యర్కు, ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా సిడ్నీ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో చికిత్స అందిస్తున్నారు. అయ్యర్ పరిస్థితిని చూసిన వైద్యులు, ఈ గాయం ప్రాణాలకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.
శనివారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కారీ ఇచ్చిన క్యాచ్ను పట్టుకోవడానికి అయ్యర్ వెనక్కి పరిగెత్తి, డైవ్ చేశాడు. ఈ క్రమంలోనే అతని ఎడమ పక్కటెముకల భాగంలో గట్టిగా దెబ్బ తగిలింది. డ్రెస్సింగ్ రూమ్కి తిరిగి వచ్చిన తర్వాత అయ్యర్ పరిస్థితిలో తేడా కనిపించడంతో, టీమ్ మేనేజ్మెంట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించింది.
ఆసుపత్రిలో రిపోర్టులు చూసిన తర్వాత, లోపల రక్తస్రావం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు వ్యాపించకుండా ఆపడానికి వెంటనే చికిత్స ప్రారంభించారు. అందుకే గత కొన్ని రోజులుగా అయ్యర్ ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉన్నారు. “పరిస్థితి నిలకడగా ఉంది, కానీ ఆలస్యం జరిగి ఉంటే ఇది ప్రాణాలకే ప్రమాదంగా మారేది” అని బీసీసీఐకి సంబంధించిన వర్గాలు తెలిపాయి.
టీమ్ డాక్టర్, ఫిజియో ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా వెంటనే స్పందించడం వల్లే ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చిందని వారు చెప్పారు. అయ్యర్ చాలా ధైర్యవంతుడని, త్వరలోనే కోలుకుంటారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మొదట్లో అయ్యర్ మూడు వారాల్లో కోలుకుంటాడని అనుకున్నారు. అయితే, లోపల రక్తస్రావం జరగడం వల్ల అతను మైదానంలోకి తిరిగి రావడానికి మరింత ఎక్కువ సమయం పడుతుందని తెలుస్తోంది.
కాంపిటీటివ్ క్రికెట్లోకి ఎప్పుడు తిరిగి వస్తారో ఇప్పుడే కచ్చితమైన టైమ్లైన్ చెప్పడం కష్టమని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం టీ20 స్క్వాడ్లో అయ్యర్ లేరు. 31 ఏళ్ల అయ్యర్ ఇప్పుడప్పుడే భారత్కు తిరిగే అవకాశం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఫిట్గా ప్రకటించే అవకాశం ఉంది. కనీసం ఒక వారం పాటు ఆయన సిడ్నీ ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. శ్రేయాస్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
This post was last modified on October 27, 2025 1:57 pm
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…