భారత క్రికెట్ జట్టు చాలా కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోందని.. అందులోనూ అగ్ర జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతోందని అభిమానులు తెగ ఉత్సాహం చూపించారు. గత ఆస్ట్రేలియా పర్యటనలో మన జట్టు చారిత్రక విజయాలు సాధించిన నేపథ్యంలో ఈసారి కూడా అలాంటి ప్రదర్శనే ఆశించారు ఫ్యాన్స్. కానీ వారి అంచనాలు, ఆశలకు భిన్నమైన ప్రదర్శన చేస్తోంది కోహ్లీసేన.
తొలి మ్యాచ్ కాబట్టి ఇంకా పరిస్థితులకు అలవాటు పడక ఓడిపోయారేమో అనుకుంటే.. రెండో మ్యాచ్లో ఇంకా పేలవమైన ప్రదర్శన చేశారు. రెండో వన్డేలో కూడా పేలవమైన బౌలింగ్, ఫీల్డింగ్తో మ్యాచ్ తొలి అర్ధ భాగంలోనే ఓటమి ఖాయం చేసుకున్నారు. తర్వాత బ్యాట్స్మెన్ పోరాడినా లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఫలితం లేకపోయింది.
ఐతే ఈ మ్యాచ్లో భారత్ పరాజయం పాలైనా ఒక దృశ్యం మాత్రం మ్యాచ్ను ప్రత్యక్షంగా స్టేడియంలో, పరోక్షంగా టీవీల ద్వారా చూస్తున్న వాళ్లందరికీ అమితానందాన్ని కలిగించింది. ఈ మ్యాచ్కు హాజరైన ఒక భారతీయుడు.. స్టేడియంలో అందరి ముందు తన ఆస్ట్రేలియన్ ప్రేయసికి పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఆమె ముందు ఆశ్చర్యపోయి, తర్వాత అతడి ప్రపోజల్కు అంగీకరించింది. తర్వాత ఇద్దరూ కౌగిలించుకున్నారు. చాలా ఆహ్లాదంగా కనిపించిన ఈ దృశ్యం కామెంటేటర్లనే కాదు.. మైదానంలో ఉన్న ఆటగాళ్లను సైతం ఆకర్షించింది. కాసేపు మ్యాచ్ కామెంట్రీ ఆపేసి వీళ్ల గురించి వ్యాఖ్యాతలు మాట్లాడారు.
బౌండరీల దగ్గరున్న ఆటగాళ్లు కొందరు ఈ దృశ్యం చూశారు. మ్యాక్స్వెల్ అయితే చప్పట్లు కొట్టి ఆ జంటను అభినందించాడు. సోషల్ మీడియాలో సంబంధిత ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
This post was last modified on November 30, 2020 7:13 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…