భారత క్రికెట్ జట్టు చాలా కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోందని.. అందులోనూ అగ్ర జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతోందని అభిమానులు తెగ ఉత్సాహం చూపించారు. గత ఆస్ట్రేలియా పర్యటనలో మన జట్టు చారిత్రక విజయాలు సాధించిన నేపథ్యంలో ఈసారి కూడా అలాంటి ప్రదర్శనే ఆశించారు ఫ్యాన్స్. కానీ వారి అంచనాలు, ఆశలకు భిన్నమైన ప్రదర్శన చేస్తోంది కోహ్లీసేన.
తొలి మ్యాచ్ కాబట్టి ఇంకా పరిస్థితులకు అలవాటు పడక ఓడిపోయారేమో అనుకుంటే.. రెండో మ్యాచ్లో ఇంకా పేలవమైన ప్రదర్శన చేశారు. రెండో వన్డేలో కూడా పేలవమైన బౌలింగ్, ఫీల్డింగ్తో మ్యాచ్ తొలి అర్ధ భాగంలోనే ఓటమి ఖాయం చేసుకున్నారు. తర్వాత బ్యాట్స్మెన్ పోరాడినా లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఫలితం లేకపోయింది.
ఐతే ఈ మ్యాచ్లో భారత్ పరాజయం పాలైనా ఒక దృశ్యం మాత్రం మ్యాచ్ను ప్రత్యక్షంగా స్టేడియంలో, పరోక్షంగా టీవీల ద్వారా చూస్తున్న వాళ్లందరికీ అమితానందాన్ని కలిగించింది. ఈ మ్యాచ్కు హాజరైన ఒక భారతీయుడు.. స్టేడియంలో అందరి ముందు తన ఆస్ట్రేలియన్ ప్రేయసికి పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఆమె ముందు ఆశ్చర్యపోయి, తర్వాత అతడి ప్రపోజల్కు అంగీకరించింది. తర్వాత ఇద్దరూ కౌగిలించుకున్నారు. చాలా ఆహ్లాదంగా కనిపించిన ఈ దృశ్యం కామెంటేటర్లనే కాదు.. మైదానంలో ఉన్న ఆటగాళ్లను సైతం ఆకర్షించింది. కాసేపు మ్యాచ్ కామెంట్రీ ఆపేసి వీళ్ల గురించి వ్యాఖ్యాతలు మాట్లాడారు.
బౌండరీల దగ్గరున్న ఆటగాళ్లు కొందరు ఈ దృశ్యం చూశారు. మ్యాక్స్వెల్ అయితే చప్పట్లు కొట్టి ఆ జంటను అభినందించాడు. సోషల్ మీడియాలో సంబంధిత ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…