భారత క్రికెట్ జట్టు చాలా కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోందని.. అందులోనూ అగ్ర జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతోందని అభిమానులు తెగ ఉత్సాహం చూపించారు. గత ఆస్ట్రేలియా పర్యటనలో మన జట్టు చారిత్రక విజయాలు సాధించిన నేపథ్యంలో ఈసారి కూడా అలాంటి ప్రదర్శనే ఆశించారు ఫ్యాన్స్. కానీ వారి అంచనాలు, ఆశలకు భిన్నమైన ప్రదర్శన చేస్తోంది కోహ్లీసేన.
తొలి మ్యాచ్ కాబట్టి ఇంకా పరిస్థితులకు అలవాటు పడక ఓడిపోయారేమో అనుకుంటే.. రెండో మ్యాచ్లో ఇంకా పేలవమైన ప్రదర్శన చేశారు. రెండో వన్డేలో కూడా పేలవమైన బౌలింగ్, ఫీల్డింగ్తో మ్యాచ్ తొలి అర్ధ భాగంలోనే ఓటమి ఖాయం చేసుకున్నారు. తర్వాత బ్యాట్స్మెన్ పోరాడినా లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఫలితం లేకపోయింది.
ఐతే ఈ మ్యాచ్లో భారత్ పరాజయం పాలైనా ఒక దృశ్యం మాత్రం మ్యాచ్ను ప్రత్యక్షంగా స్టేడియంలో, పరోక్షంగా టీవీల ద్వారా చూస్తున్న వాళ్లందరికీ అమితానందాన్ని కలిగించింది. ఈ మ్యాచ్కు హాజరైన ఒక భారతీయుడు.. స్టేడియంలో అందరి ముందు తన ఆస్ట్రేలియన్ ప్రేయసికి పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఆమె ముందు ఆశ్చర్యపోయి, తర్వాత అతడి ప్రపోజల్కు అంగీకరించింది. తర్వాత ఇద్దరూ కౌగిలించుకున్నారు. చాలా ఆహ్లాదంగా కనిపించిన ఈ దృశ్యం కామెంటేటర్లనే కాదు.. మైదానంలో ఉన్న ఆటగాళ్లను సైతం ఆకర్షించింది. కాసేపు మ్యాచ్ కామెంట్రీ ఆపేసి వీళ్ల గురించి వ్యాఖ్యాతలు మాట్లాడారు.
బౌండరీల దగ్గరున్న ఆటగాళ్లు కొందరు ఈ దృశ్యం చూశారు. మ్యాక్స్వెల్ అయితే చప్పట్లు కొట్టి ఆ జంటను అభినందించాడు. సోషల్ మీడియాలో సంబంధిత ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
This post was last modified on November 30, 2020 7:13 am
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…