కలం హాలికులుగా సమాజ చైతన్యానికి నిరంతరం చెమటోడుస్తున్న జర్నలిస్టులకు ఏ చిన్న సమస్య వచ్చినా.. నేనున్నానంటూ ముందుకు వచ్చే వారే ఆపన్నులు. నేనున్నానంటూ.. అండగా నిలిచేవారే.. పాత్రికేయులకు ఆపత్బాంధవులు. అలాంటి వారిలో మిన్నగా.. ముందుండే.. జర్నలిస్టు.. వరికుప్పల రమేష్(ఈనాడు). సుదీర్ఘ కాలంగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న రమేష్.. జర్నలిస్టు మిత్రులకు తల్లో నాలుక అనడంలో సందేహం లేదు.
ఎవరికి ఎక్కడ ఆపద వాటిల్లినా.. నేనున్నానంటూ ఆయన స్పందిస్తారు. ఆపన్నహస్తం అందిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్యానల్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి(జనరల్ సెక్రటరీ) పదవికి వరికుప్పల రమేష్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పదవుల కోసం కాకుండా.. పనిచేయడం కోసమే బరిలో నిలిచిన రమేష్వంటి వారిని గెలిపించుకోవడం.. ప్రతిపాత్రికేయుడి ధర్మం. ` చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం.. నినాదంతో పాత్రికేయుల కోసం పనిచేసేందుకు ముందుకు వచ్చిన రమేష్ను మన ఓటుతో గెలిపిద్దాం.. మనకోసం సేవ చేసే అవకాశం కల్పిద్దాం.
ఈ నెల 26న జరగనున్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఫ్రండ్స్ ప్యానెల్పై సీరియస్ నెంబరు 4లో పోటీలో ఉన్న ఈనాడు పాత్రికేయుడు వరికుప్పల రమేష్కు ఓటు వేయడం అంటే.. మనల్ని మనం గౌరవించుకోవడమే, మన కోసం నిరంతరం పనిచేసే వారిని, ఆలోచించే వారిని ఎంచుకోవడమేనన్న విషయాన్ని ప్రతి పాత్రికేయుడు గుర్తుంచుకోవాలి. సీరియస్ నెంబరు 4కు ఓటు వేయడం అంటే.. మన జర్నలిస్టుగా పేరు తెచ్చుకుని.. అందరిలోనూ కలిసిపోయే రమేష్ ను గెలిపించడంతోపాటు.. ప్రతి పాత్రికేయుడు తనను తాను గెలిపించుకోవడమే అవుతుంది. ఆలోచించండి.. రమేష్కు మద్దతుగా నిలవండి!. మన అందరి కోసం రమేష్ ప్రయత్నాన్ని సమర్థించే రమేష్ మిత్రమండలి ప్రత్యేక వినతి ఇది.
పోలింగ్ తేదీ: ఈ నెల 26
రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న సీరియల్ నెంబరు : 4
This post was last modified on October 24, 2025 1:43 pm
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…