టీమిండియా కింగ్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి తప్పుకోబోతున్నారనే పుకార్లు ఈమధ్య క్రికెట్ ప్రపంచాన్ని ఉపేశాయి. ఈ రూమర్లకు కారణం, కోహ్లీ తన ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ఉన్న ఒక కమర్షియల్ డీల్ను రిన్యూ చేయడానికి నిరాకరించడమే. ఈ వార్త రాగానే 2008 నుంచి ఆర్సీబీకి ఆడుతున్న ఈ లెజెండ్ ఐపీఎల్కు వీడ్కోలు చెబుతున్నారేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇక ఆకాష్ చోప్రా వంటి క్రికెట్ నిపుణులు మాత్రం ఈ వార్తలను తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు. కోహ్లీ రిజెక్ట్ చేసింది ఆటగాడిగా ఉన్న కాంట్రాక్ట్ను కాదు, కేవలం కమర్షియల్ ప్రమోషన్స్కు సంబంధించిన ఒప్పందాన్ని మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ఈమద్యే కదా ఆర్సీబీకి ట్రోఫీ అంధించారు. ఇప్పుడెందుకు జట్టును వదిలేస్తారు? అని చోప్రా ప్రశ్నించారు. ఆటగాడిగా కోహ్లీ ఆర్సీబీకి కమిట్మెంట్ ఇచ్చారని, వ్యాపార లావాదేవీల నుంచే ఆయన దూరం అవుతున్నారని వివరించారు.
అయితే, కోహ్లీ ఇప్పటికే టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం, 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ20 ఇంటర్నేషనల్స్కు కూడా గుడ్బై చెప్పడం చూస్తే, ఆయన కెరీర్ ముగింపు దశకు చేరుకుందనే వాదన బలంగా ఉంది. 36 ఏళ్ల వయసులో ఉన్న కోహ్లీ తన వర్క్లోడ్ను తగ్గించుకోవాలని, కుటుంబంపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నారని, అందుకే ఐపీఎల్ నుంచి కూడా త్వరలో తప్పుకోవచ్చని చాలా మంది నమ్ముతున్నారు.
మరోవైపు, ఆర్సీబీకి 2025 సీజన్లో చారిత్రక టైటిల్ గెలిచిన తర్వాత, కోహ్లీ స్వయంగా “ఐపీఎల్లో నా చివరి రోజు వరకు ఆర్సీబీ కోసమే ఆడతాను” అని చెప్పడం ఈ పుకార్లకు కొంత విరుద్ధంగా ఉంది. ఈ వ్యాఖ్యను బట్టి చూస్తే, ఆయన వెంటనే రిటైర్ అవ్వట్లేదని, కానీ రాబోయే రోజుల్లో ఆర్సీబీ తన ప్రమోషనల్ ప్లాన్స్లో తనపై ఆధారపడకుండా ఉండటానికి సూచన మాత్రమే ఇచ్చారని అర్థమవుతోంది. అంటే కమర్షియల్ గా విరాట్ ఫొటోను RCB ఎక్కడ వాడుకోకూడదు అనేలా కోహ్లీ టీమ్ మేనేజ్మెంట్కు చెప్పినట్లు తెలుస్తోంది.
This post was last modified on October 16, 2025 6:47 am
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…