Trends

కొత్త కారుతో నిమ్మకాయ తొక్కించబోయి…

ఇదొక అరుదైన సంఘటన.. భారీ ధర పెట్టి ఒక కొత్త కారు కొని శుభప్రదమనే ఉద్దేశంతో షోరూంలో నిమ్మకాయల్ని తొక్కించబోయిన ఓ మహిళ.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కారుతో సహా వచ్చి రోడ్డు మీద పడింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా.. అదృష్టవశాత్తూ సమయానికి ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు షోరూం సిబ్బంది ఒకరు గాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే..?

29 ఏళ్ల మాని పవార్, ఆమె భర్త ప్రదీప్ కలిసి..  ఢిల్లీలోని నిర్మాన్ విహార్‌లో ఉన్న మహీంద్రా షోరూం నుంచి థార్ కారును కొనుగోలు చేశారు. దాని ధర రూ.27 లక్షలు. కారు తాళాలు అందుకున్నాక ఆమె అక్కడే చిన్న పూజా కార్యక్రమం లాంటిది చేసుకున్నారు. అనంతరం కారు టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి తొక్కించాలని భావించారు. వీళ్లు కొన్న కారు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అక్కడే ఈ నిమ్మకాయల్ని తొక్కించే పని పెట్టుకున్నారు. మాన్వినే కారును డ్రైవ్ చేసింది. షోరూం సిబ్బంది ఒకరు ఆమెతో పాటు కారులోకి ఎక్కారు. ఐతే నిమ్మకాయల్ని తొక్కించేందుకు కొంచెం నెమ్మదిగా కారును ముందుకు పోనిచ్చిన మాని.. అనుకోకుండా ఎక్సలేటర్‌ మీద కాలు వేసింది. కంగారులో కారును కంట్రోల్ చేయలేకపోయింది. 

దీంతో అద్దాలను బద్దలు కొట్టుకుని కారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూసుకొచ్చి రోడ్డు మీద బోర్లా పడింది. కారు కింద పడడానికి ముందే అందులో ఉన్న షోరూం ఉద్యోగి కిందికి దూకేశాడు. అతడికి గాయాలయ్యాయి. సమయానికి ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో మానికి తీవ్ర గాయాలేమీ కాలేదు. కానీ 27 లక్షలు పెట్టి కొన్ని కొత్త కారు మాత్రం ధ్వంసమైంది. ఈ వార్త, దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

This post was last modified on September 10, 2025 4:13 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Thar Car

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

9 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

10 hours ago