Trends

కొత్త కారుతో నిమ్మకాయ తొక్కించబోయి…

ఇదొక అరుదైన సంఘటన.. భారీ ధర పెట్టి ఒక కొత్త కారు కొని శుభప్రదమనే ఉద్దేశంతో షోరూంలో నిమ్మకాయల్ని తొక్కించబోయిన ఓ మహిళ.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కారుతో సహా వచ్చి రోడ్డు మీద పడింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా.. అదృష్టవశాత్తూ సమయానికి ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు షోరూం సిబ్బంది ఒకరు గాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే..?

29 ఏళ్ల మాని పవార్, ఆమె భర్త ప్రదీప్ కలిసి..  ఢిల్లీలోని నిర్మాన్ విహార్‌లో ఉన్న మహీంద్రా షోరూం నుంచి థార్ కారును కొనుగోలు చేశారు. దాని ధర రూ.27 లక్షలు. కారు తాళాలు అందుకున్నాక ఆమె అక్కడే చిన్న పూజా కార్యక్రమం లాంటిది చేసుకున్నారు. అనంతరం కారు టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి తొక్కించాలని భావించారు. వీళ్లు కొన్న కారు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అక్కడే ఈ నిమ్మకాయల్ని తొక్కించే పని పెట్టుకున్నారు. మాన్వినే కారును డ్రైవ్ చేసింది. షోరూం సిబ్బంది ఒకరు ఆమెతో పాటు కారులోకి ఎక్కారు. ఐతే నిమ్మకాయల్ని తొక్కించేందుకు కొంచెం నెమ్మదిగా కారును ముందుకు పోనిచ్చిన మాని.. అనుకోకుండా ఎక్సలేటర్‌ మీద కాలు వేసింది. కంగారులో కారును కంట్రోల్ చేయలేకపోయింది. 

దీంతో అద్దాలను బద్దలు కొట్టుకుని కారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూసుకొచ్చి రోడ్డు మీద బోర్లా పడింది. కారు కింద పడడానికి ముందే అందులో ఉన్న షోరూం ఉద్యోగి కిందికి దూకేశాడు. అతడికి గాయాలయ్యాయి. సమయానికి ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో మానికి తీవ్ర గాయాలేమీ కాలేదు. కానీ 27 లక్షలు పెట్టి కొన్ని కొత్త కారు మాత్రం ధ్వంసమైంది. ఈ వార్త, దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

This post was last modified on September 10, 2025 4:13 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Thar Car

Recent Posts

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

21 minutes ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

30 minutes ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

2 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

2 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

3 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago