భారత క్రికెట్ జట్టు సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ మరోసారి తన ఫిట్నెస్తో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. తాజాగా బీసీసీఐ పరిచయం చేసిన కొత్త బ్రోంకో టెస్ట్లో పాల్గొన్న ఆయన ఫలితం బయటకు వచ్చింది. ఈ టెస్ట్లో రోహిత్ కేవలం పాస్ అవ్వడమే కాకుండా, తన ప్రదర్శనతో అక్కడి కోచింగ్ స్టాఫ్ను కూడా మెప్పించాడని సమాచారం.
బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఆగస్టు 30, 31 తేదీల్లో ఆటగాళ్లందరికీ యో-యో టెస్ట్తో పాటు కొత్త బ్రోంకో టెస్ట్ కూడా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఆటగాడు విజయవంతంగా పూర్తి చేశారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా 38 ఏళ్ల రోహిత్ తన శారీరక ఆకృతి, స్టామినాతో అందరినీ ఆకట్టుకున్నాడట. ఈ టెస్ట్లో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణా కూడా అద్భుతంగా ప్రదర్శించినట్లు సమాచారం.
గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు చెప్పాడు. దాదాపు సంవత్సరం తర్వాత టెస్టుల నుంచీ కూడా రిటైర్ అయ్యాడు. కానీ వన్డే ఫార్మాట్లో మాత్రం కొనసాగుతున్నాడు. తాజాగా ఆయన ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ 2025లో కూడా ఆడాడు. అయితే రోహిత్ భవిష్యత్పై అనేక రకాల ఊహాగానాలు వస్తుండగా, ఈ టెస్ట్లో వచ్చిన ఫలితం ఆయనకే కాదు అభిమానులకు కూడా ఊరటనిచ్చేలా ఉంది.
అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరిగే వన్డే సిరీస్లో రోహిత్ పాల్గొననున్నాడు. కానీ సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 5 మధ్య కన్పూర్లో జరిగే ఇండియా-ఎ వర్సెస్ ఆస్ట్రేలియా-ఎ వన్డేల్లో ఆయన ఆడతారో లేదో స్పష్టత రాలేదు. మొత్తానికి, రోహిత్ శర్మ తన వయసును మించి ఫిట్నెస్తో మరోసారి నిరూపించుకున్నాడు. ఏదేమైనా రాబోయే సిరీస్ల్లో రోహిత్ ఆటను చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
This post was last modified on September 1, 2025 12:48 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…