Trends

పాక్ క్షేమం కోరి భారత్ హెచ్చరిక

భారత్‌ – పాక్‌ సంబంధాలు కఠినంగానే ఉన్నా, సహజ విపత్తుల సమయంలో మానవత్వం ముందు నిలబడుతుందని తాజా పరిణామం స్పష్టమైంది. జమ్మూకశ్మీర్‌లోని తావి నది ఉప్పొంగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయగా, ఆ వరద ముప్పు పాకిస్థాన్‌పై పడే అవకాశాన్ని గుర్తించి భారత్‌ ముందుగానే సమాచారం అందించింది. సింధూ నది జలాల ఒప్పందం నిలిచిపోయిన పరిస్థితుల్లోనూ, ఈ చర్య మానవతా దృష్టిలో ఒక సానుకూల సంకేతంగా కనిపిస్తోంది.

దిల్లీలోని భారత హైకమిషన్‌ అధికారులు ఇస్లామాబాద్‌కు ఈ విషయాన్ని చేరవేయడంతో పాక్‌ ప్రభుత్వం వెంటనే తమ ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా ఇలాంటి సమాచారం సింధూ నది జలాల ఒప్పంద కమిషనర్‌ ద్వారా పంచుకునే పద్ధతి ఉన్నప్పటికీ, ఒప్పందం నిలిపివేయబడిన తర్వాత ఇప్పుడు నేరుగా దౌత్య కార్యాలయం ద్వారా సమాచారం చేరడం విశేషం. ఈ చర్య పాక్‌కు మానవత్వ పరిరక్షణలో భారత్‌ తీసుకున్న ముందడుగుగా భావించవచ్చు.

ఇక పాకిస్థాన్‌లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఇప్పటికే తీవ్ర నష్టాన్ని కలిగించాయి. జూన్‌ 26 నుంచి ఇప్పటి వరకు 780 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. అనేక ప్రాంతాల్లో ఇళ్లు, పంటలు నాశనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌ ఇచ్చిన తాజా హెచ్చరిక పాక్‌ అధికారులకు సహాయపడే అవకాశముంది.

గమనించదగ్గ విషయం ఏంటంటే, ఏప్రిల్‌లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ సమయంలో సంబంధాలు మరింత కఠినమయ్యాయి. అయినా కూడా ఈసారి వరదల ముప్పు నేపథ్యంలో ముందుగా పాక్‌ను అలర్ట్‌ చేయడం, “భేదాభిప్రాయాలు పక్కన పెట్టి మానవ ప్రాణాలను కాపాడాలి” అనే సందేశాన్ని ఇస్తోంది.

This post was last modified on August 25, 2025 4:34 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

4 minutes ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

29 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

31 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

60 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago