భారత్ – పాక్ సంబంధాలు కఠినంగానే ఉన్నా, సహజ విపత్తుల సమయంలో మానవత్వం ముందు నిలబడుతుందని తాజా పరిణామం స్పష్టమైంది. జమ్మూకశ్మీర్లోని తావి నది ఉప్పొంగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయగా, ఆ వరద ముప్పు పాకిస్థాన్పై పడే అవకాశాన్ని గుర్తించి భారత్ ముందుగానే సమాచారం అందించింది. సింధూ నది జలాల ఒప్పందం నిలిచిపోయిన పరిస్థితుల్లోనూ, ఈ చర్య మానవతా దృష్టిలో ఒక సానుకూల సంకేతంగా కనిపిస్తోంది.
దిల్లీలోని భారత హైకమిషన్ అధికారులు ఇస్లామాబాద్కు ఈ విషయాన్ని చేరవేయడంతో పాక్ ప్రభుత్వం వెంటనే తమ ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా ఇలాంటి సమాచారం సింధూ నది జలాల ఒప్పంద కమిషనర్ ద్వారా పంచుకునే పద్ధతి ఉన్నప్పటికీ, ఒప్పందం నిలిపివేయబడిన తర్వాత ఇప్పుడు నేరుగా దౌత్య కార్యాలయం ద్వారా సమాచారం చేరడం విశేషం. ఈ చర్య పాక్కు మానవత్వ పరిరక్షణలో భారత్ తీసుకున్న ముందడుగుగా భావించవచ్చు.
ఇక పాకిస్థాన్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఇప్పటికే తీవ్ర నష్టాన్ని కలిగించాయి. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు 780 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. అనేక ప్రాంతాల్లో ఇళ్లు, పంటలు నాశనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో భారత్ ఇచ్చిన తాజా హెచ్చరిక పాక్ అధికారులకు సహాయపడే అవకాశముంది.
గమనించదగ్గ విషయం ఏంటంటే, ఏప్రిల్లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ సమయంలో సంబంధాలు మరింత కఠినమయ్యాయి. అయినా కూడా ఈసారి వరదల ముప్పు నేపథ్యంలో ముందుగా పాక్ను అలర్ట్ చేయడం, “భేదాభిప్రాయాలు పక్కన పెట్టి మానవ ప్రాణాలను కాపాడాలి” అనే సందేశాన్ని ఇస్తోంది.
This post was last modified on August 25, 2025 4:34 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…