భారత్ – పాక్ సంబంధాలు కఠినంగానే ఉన్నా, సహజ విపత్తుల సమయంలో మానవత్వం ముందు నిలబడుతుందని తాజా పరిణామం స్పష్టమైంది. జమ్మూకశ్మీర్లోని తావి నది ఉప్పొంగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయగా, ఆ వరద ముప్పు పాకిస్థాన్పై పడే అవకాశాన్ని గుర్తించి భారత్ ముందుగానే సమాచారం అందించింది. సింధూ నది జలాల ఒప్పందం నిలిచిపోయిన పరిస్థితుల్లోనూ, ఈ చర్య మానవతా దృష్టిలో ఒక సానుకూల సంకేతంగా కనిపిస్తోంది.
దిల్లీలోని భారత హైకమిషన్ అధికారులు ఇస్లామాబాద్కు ఈ విషయాన్ని చేరవేయడంతో పాక్ ప్రభుత్వం వెంటనే తమ ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా ఇలాంటి సమాచారం సింధూ నది జలాల ఒప్పంద కమిషనర్ ద్వారా పంచుకునే పద్ధతి ఉన్నప్పటికీ, ఒప్పందం నిలిపివేయబడిన తర్వాత ఇప్పుడు నేరుగా దౌత్య కార్యాలయం ద్వారా సమాచారం చేరడం విశేషం. ఈ చర్య పాక్కు మానవత్వ పరిరక్షణలో భారత్ తీసుకున్న ముందడుగుగా భావించవచ్చు.
ఇక పాకిస్థాన్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఇప్పటికే తీవ్ర నష్టాన్ని కలిగించాయి. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు 780 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. అనేక ప్రాంతాల్లో ఇళ్లు, పంటలు నాశనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో భారత్ ఇచ్చిన తాజా హెచ్చరిక పాక్ అధికారులకు సహాయపడే అవకాశముంది.
గమనించదగ్గ విషయం ఏంటంటే, ఏప్రిల్లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ సమయంలో సంబంధాలు మరింత కఠినమయ్యాయి. అయినా కూడా ఈసారి వరదల ముప్పు నేపథ్యంలో ముందుగా పాక్ను అలర్ట్ చేయడం, “భేదాభిప్రాయాలు పక్కన పెట్టి మానవ ప్రాణాలను కాపాడాలి” అనే సందేశాన్ని ఇస్తోంది.
This post was last modified on August 25, 2025 4:34 pm
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…