భారత క్రికెట్ జట్టుకు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించిన డ్రీమ్ 11తో (Dream11) బీసీసీఐ ఒప్పందం రద్దయింది. ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన ఆన్లైన్ గేమింగ్ బిల్లుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి గేమింగ్ కంపెనీలతో ఒప్పందాలు ఉండబోవని ఆయన ప్రకటించారు. దీంతో ఆసియా కప్ ప్రారంభానికి కొన్ని రోజులు ముందే స్పాన్సర్ ఖాళీ కావడం చర్చనీయాంశంగా మారింది.
బీసీసీఐ సన్నిహిత వర్గాల వివరణ ప్రకారం డ్రీమ్ 11 ప్రతినిధులు ఇప్పటికే స్పెషల్ గా బోర్డును సంప్రదించారు. కొత్త చట్టం కారణంగా ఒప్పందాన్ని కొనసాగించడం సాధ్యం కాదని స్వయంగా వారే తెలియజేశారు. 2023లో మూడు సంవత్సరాల కాలానికి రూ.358 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నా ఇప్పుడు మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. అయితే చట్టపరమైన కారణాలతో స్పాన్సర్షిప్ విరమించుకున్నందుకు ఎటువంటి జరిమానా విధించకూడదనే నిబంధన ఉన్నందున డ్రీమ్ 11కు పెనాల్టీ లేకుండా బయటకు వెళ్లే అవకాశం లభించింది.
ఈ పరిణామంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం వెంటనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించనుంది. అంతేకాకుండా డ్రీమ్ 11 పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలకూ స్పాన్సర్గా ఉండటం వల్ల వాటి ఒప్పందాలు కూడా రద్దు అయ్యే అవకాశముంది. దీంతో ఐపీఎల్ జట్లూ కొత్త స్పాన్సర్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించే పరిస్థితి రావచ్చు.
మరోవైపు డ్రీమ్ 11 మాతృసంస్థ ‘డ్రీమ్ స్పోర్ట్స్’ కొత్త రంగంలోకి అడుగుపెట్టబోతోంది. ఆర్థిక సేవల విభాగంలో ‘డ్రీమ్ మనీ’ పేరుతో కొత్త యాప్ను విడుదల చేయనుంది. ప్రస్తుతం ఈ యాప్ ట్రయల్ దశలో ఉంది. ఇందులో పసిడి కొనుగోలు, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి సేవలు అందించనుందని సమాచారం. గూగుల్ ప్లే స్టోర్లో ఇప్పటికే ఈ యాప్పై వివరాలు లభిస్తున్నాయి. ఇక ఆసియా కప్తో ప్రారంభమయ్యే ఈ కొత్త దశలో బీసీసీఐ ఏ కంపెనీని స్పాన్సర్గా ఎంపిక చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on August 25, 2025 4:32 pm
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…