తిట్లు, బెదిరింపులు.. ఇప్పుడు నేరుగానే కాదు.. సోషల్ మీడియాలోనూ.. వస్తున్నాయి. గిట్టని వారిని తిట్టడం, బెదిరింపులకు దిగడం కోసం చాలా మంది సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటున్నారు. అయితే .. ఇలా తిట్టినా.. బెదిరింపులకు దిగినా.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వర్తించబోదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని కేసులుగా నమోదు చేయడం అంటే.. పోలీసులను తిరిగి చదువు కునేందుకు పంపించాల్సిన పరిస్థితిలో ఉన్నారని అర్ధమవుతున్నట్టేనని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఏం జరిగింది.?
సికింద్రాబాద్కు చెందిన ఓ మహిళ.. తొలి వివాహం అనంతరం భర్తతో వేరు పడ్డారు. ఈ క్రమంలో వేరే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే.. ఏమైందో ఏమో రెండో భర్తతోనూ ఆమెకు పొసగలేదు. దీంతో అతని నుంచి విడాకులు తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత.. సదరు మహిళ.. రెండో భర్తను ఉద్దేశించి.. బండ బూతులు తిడుతూ.. బెదింపులకు పాల్పడుతూ.. వాట్సాప్, ఈమెయిళ్లలో పోస్టులు పెట్టారు. దీంతో చిర్రెత్తిన సదరు రెండో భర్త పోలీసులను ఆశ్రయించాడు.
దీంతో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద సదరు మహిళ, ఆమె తండ్రి(ప్రేరేపించాడని)పై కేసులు పెట్టారు. అయితే.. ఈ కేసును కుమార్తె, తండ్రి హైకోర్టులో సవాల్ చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వారు ఉటంకించారు. సోషల్ మీడియాలో తిట్టినా.. బెదిరింపులకు గురి చేసినా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడానికి వీల్లేదన్న గత సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి.. తమపై కేసును కొట్టివేయాలని అభ్యర్థించారు. దీనిని విచారించిన కోర్టు తాజాగా తీర్పు చెప్పింది.
“ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కేవలం బహిరంగ ప్రదేశాల్లో జరిగిన ఘటనలకు వర్తిస్తుంది. అది కూడా.. సాక్షులు ఉన్నారని భావించినప్పుడు మాత్రమే నమోదు చేయాలి. సాక్షులు లేరని తెలిసినా, నాలుగు గోడల మధ్య ఘటన జరిగినా ఎస్సీ, ఎస్టీ కేసు వర్తించదు. సుప్రీంకోర్టు కూడా గతంలో ఇదే అభిప్రాయపడింది. కాబట్టి.. ఈ కేసు కొట్టేస్తున్నాం. ఈ విషయంలో పోలీసులకు పరిజ్ఞానం లేకపోవడం దారుణం. వారిని చదువుకునేందుకు పంపించేస్థాయిలో ఉన్నారు” అని కోర్టు వ్యాఖ్యానించింది.
This post was last modified on August 24, 2025 4:34 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…