హైదరాబాద్ నగరాన్ని వణికించిన ఘటన కూకట్పల్లిలో చోటుచేసుకుంది. పదేళ్ల బాలిక సహస్రను దారుణంగా హత్య చేసిన సంఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంఘటన స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం, ఈ ఘాతుకం బయటివారు కాకుండా అదే భవనంలో నివసిస్తున్న వారిలో ఎవరో చేయి ఉండవచ్చని అనుమానాలు బలపడ్డాయి.
సంగీత్నగర్లోని G+2 భవనంలో నివసించే సహస్ర కుటుంబానికి తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసుల అంచనా. భవనం ప్రధాన ద్వారం గుండా ఇతరులు ప్రవేశించిన రికార్డు లేకపోవడం దీనికి బలమైన ఆధారం. దీంతో ఆ భవనంలో నివసిస్తున్న నలుగురిని పోలీసులు విచారణకు తీసుకెళ్లారు. అయితే ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం బయటపడలేదు.
ఈ హత్య వెనుక ఆర్థిక లావాదేవీలు లేదా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అన్న దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. అనారోగ్య కారణంగా తాయెత్తులు కట్టుకున్న మరో రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తిపై చేతబడి నెపం ఉన్నట్లు ప్రచారం జరిగినా, దానికి సరైన ఆధారాలు దొరకలేదు. ప్రస్తుతం సెల్ఫోన్ డేటా, వేలిముద్రలు, సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.
సహస్రపై దాదాపు 20 కత్తి గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక తెలిపింది. అందులో మెడపైనే 10 గాయాలు ఉండటం దారుణాన్ని చూపిస్తుంది. సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని వైద్యులు నిర్ధారించారు. అదే సమయంలో బాలిక కేకలు వినిపించాయని పక్కింటివారు చెప్పడంతో, హత్య పథకం ప్రకారమే జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సహస్ర అంత్యక్రియలు సంగారెడ్డి జిల్లా మక్తాక్యాసారంలో జరిపారు. అతి దారుణంగా ఆ చిన్నారి ప్రాణం కోల్పోవడంతో, నిందితులను త్వరగా పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అన్ని ఆధారాలను సేకరిస్తూ, త్వరలోనే నిజాన్ని బయటపెడతామని హామీ ఇస్తున్నారు.
This post was last modified on August 20, 2025 3:57 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…