Trends

కూకట్‌పల్లిలో బాలిక హత్య.. మిస్టరీలో ఎన్నో అనుమానాలు

హైదరాబాద్ నగరాన్ని వణికించిన ఘటన కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. పదేళ్ల బాలిక సహస్రను దారుణంగా హత్య చేసిన సంఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంఘటన స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం, ఈ ఘాతుకం బయటివారు కాకుండా అదే భవనంలో నివసిస్తున్న వారిలో ఎవరో చేయి ఉండవచ్చని అనుమానాలు బలపడ్డాయి.

సంగీత్‌నగర్‌లోని G+2 భవనంలో నివసించే సహస్ర కుటుంబానికి తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసుల అంచనా. భవనం ప్రధాన ద్వారం గుండా ఇతరులు ప్రవేశించిన రికార్డు లేకపోవడం దీనికి బలమైన ఆధారం. దీంతో ఆ భవనంలో నివసిస్తున్న నలుగురిని పోలీసులు విచారణకు తీసుకెళ్లారు. అయితే ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం బయటపడలేదు.

ఈ హత్య వెనుక ఆర్థిక లావాదేవీలు లేదా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అన్న దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. అనారోగ్య కారణంగా తాయెత్తులు కట్టుకున్న మరో రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తిపై చేతబడి నెపం ఉన్నట్లు ప్రచారం జరిగినా, దానికి సరైన ఆధారాలు దొరకలేదు. ప్రస్తుతం సెల్‌ఫోన్ డేటా, వేలిముద్రలు, సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.

సహస్రపై దాదాపు 20 కత్తి గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక తెలిపింది. అందులో మెడపైనే 10 గాయాలు ఉండటం దారుణాన్ని చూపిస్తుంది. సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని వైద్యులు నిర్ధారించారు. అదే సమయంలో బాలిక కేకలు వినిపించాయని పక్కింటివారు చెప్పడంతో, హత్య పథకం ప్రకారమే జరిగిందని అధికారులు భావిస్తున్నారు.

ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సహస్ర అంత్యక్రియలు సంగారెడ్డి జిల్లా మక్తాక్యాసారంలో జరిపారు. అతి దారుణంగా ఆ చిన్నారి ప్రాణం కోల్పోవడంతో, నిందితులను త్వరగా పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అన్ని ఆధారాలను సేకరిస్తూ, త్వరలోనే నిజాన్ని బయటపెడతామని హామీ ఇస్తున్నారు.

This post was last modified on August 20, 2025 3:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

1 hour ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago