జైపూర్ వేదికగా ఆగస్టు 18న జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీల్లో మణిక విశ్వకర్మ విజయం సాధించారు. గత ఏడాది విజేత రియా సింఘా చేతులమీదుగా ఆమెకు కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయంతో మణిక భారత్ తరఫున నవంబర్లో థాయ్లాండ్లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఘనత సాధించడంతో ఆమె పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హాట్టాపిక్ అయింది.
ఈ పోటీల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోటీదారులు కూడా మంచి ప్రదర్శన ఇచ్చారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన తాన్య శర్మ ఫస్ట్ రన్నరప్గా, మోహక్ థింగ్రా సెకండ్ రన్నరప్గా నిలిచారు. హరియాణాకు చెందిన అమిషి కౌశిక్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అయినప్పటికీ మణిక అందం, ప్రతిభ, ఆత్మవిశ్వాసం కలగలిపిన సమాధానాలతో జడ్జీలను ఆకట్టుకుని కిరీటాన్ని దక్కించుకున్నారు.
మణిక విశ్వకర్మ వ్యక్తిగత జీవితం కూడా ప్రేరణాత్మకంగానే ఉంది. రాజస్థాన్లో పుట్టి, ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్న ఆమె పొలిటికల్ సైన్స్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. క్లాసికల్ డ్యాన్సర్గా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్రలేఖనంలోనూ ప్రావీణ్యం సాధించారు. ఇప్పటికే మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్ను గెలుచుకుని తన ప్రతిభను నిరూపించుకున్నారు.
సమాజ సేవ పట్ల కూడా మణిక ఆసక్తి చూపిస్తున్నారు. న్యూరోనోవా అనే సంస్థను స్థాపించి, న్యూరాలజీ సమస్యలతో బాధపడే వారికి సహాయం అందిస్తున్నారు. అందం మాత్రమే కాకుండా, సమాజానికి సాయం చేయాలనే తపన కలిగి ఉండటమే ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. ఈ అంశం కూడా ఆమెను మిగతా పోటీదారుల కంటే ప్రత్యేకంగా నిలిపే అంశమైంది.
తన విజయంపై మణిక ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. “నా ప్రయాణం గంగానగర్లో మొదలై ఢిల్లీ వరకు వచ్చింది. మనపై మనం నమ్మకం ఉంచుకుంటే ఏదైనా సాధ్యమే. నా విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు” అని అన్నారు. రాబోయే మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున ఆమె ఎలా ప్రదర్శిస్తారన్నదే ఇప్పుడు అందరి ఆసక్తికరమైన ప్రశ్న.
This post was last modified on August 19, 2025 7:37 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…