Trends

ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే టోల్ ఎందుకు చెల్లించాలి? : సుప్రీం

ట్రాఫిక్‌ జామ్‌లో గంటల తరబడి ఇరుక్కుని ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలోనూ టోల్‌ ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారని సుప్రీంకోర్టు ఎన్‌హెచ్‌ఏఐని ప్రశ్నించింది. 65 కి.మీ దూరం ప్రయాణానికి 12 గంటలు పట్టినా రూ.150 టోల్‌ వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రయాణికుల మనసులో ఉన్న సందేహాలకు ప్రతిధ్వనిలా మారాయి.

ఇటీవల కేరళ హైకోర్టు కూడా ఇదే తరహాలో ఒక తీర్పు ఇచ్చింది. త్రిస్సూర్ జిల్లాలోని పలియెక్కర టోల్‌ ప్లాజా వద్ద రోడ్డు పనుల కారణంగా పరిస్థితి దారుణంగా ఉండడంతో నెల రోజుల పాటు టోల్‌ వసూలు చేయకూడదని ఆదేశించింది. రోడ్డు పనులు సక్రమంగా జరగకపోవడం, లారీ ప్రమాదం వంటి అంశాలు టోల్‌ వసూళ్లపై ప్రశ్నలు లేవనెత్తాయి. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి ఉదాహరణలను పరిగణనలోకి తీసుకుంది.

ఎన్‌హెచ్‌ఏఐ తరఫున సొలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతా వాదిస్తూ లారీ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ ఏర్పడిందని, అది దైవఘటనగా పరిగణించాలన్నాడు. అయితే జస్టిస్ వినోద్ చంద్రన్ దీనిని తిరస్కరించారు. రోడ్డుపై గుంతల వల్లే లారీ దిగబడిందని, ఆ సమస్యలే ట్రాఫిక్‌కు మూలమని స్పష్టంగా తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో టోల్‌ వసూలు చేయడం ప్రజలకు అన్యాయం అవుతుందని వ్యాఖ్యానించారు.

ప్రయాణికులు రోడ్డు నాణ్యత కోసం, వేగవంతమైన ప్రయాణం కోసం టోల్‌ చెల్లిస్తున్నారు. కానీ అదే టోల్‌ రోడ్లపై గుంతలు, పనులు, ట్రాఫిక్ జామ్‌లు ఉంటే ఆ రుసుము వసూలు చేయడం  సరికాదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఈ అంశంపై మరింత చర్చకు దారితీస్తున్నాయి. ఈ కేసులో తుది తీర్పు ఇంకా రాలేదు. కానీ కోర్టు చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తులో టోల్‌ విధానాలను మార్చేలా ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు ప్రజలు చెల్లించే టోల్‌కు సరైన విలువ దక్కాలన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

This post was last modified on August 19, 2025 10:59 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

26 minutes ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

40 minutes ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

4 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

6 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

7 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

7 hours ago