Trends

హైదరాబాద్ లో కరెంటు మరణాలు.. మొన్న ఐదుగురు.. నిన్న ముగ్గురు

హైదరాబాద్‌లో విద్యుత్ తీగల కారణంగా వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడం అందరిని కలచివేస్తోంది. పాతబస్తీ బండ్లగూడలో గణేశ్‌ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే విధంగా అంబర్‌పేట్‌లో రామ్‌చరణ్‌ అనే యువకుడు విద్యుత్‌ తీగలను తొలగించే క్రమంలో షాక్‌ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. 

కేవలం రెండు రోజుల వ్యవధిలో మూడు వేర్వేరు ప్రదేశాల్లో విద్యుదాఘాత ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. ఇంతకుముందు ఆదివారం రాత్రి రామంతాపూర్‌లో జరిగిన కృష్ణాష్టమి ఉరేగింపులో రథం విద్యుత్‌ తీగలకు తగలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు కావడంతో దవాఖానకు తరలించారు. ఈ సంఘటనతో నగరం మొత్తం విషాదంలో మునిగిపోయింది. 

విద్యుత్‌ తీగలు రహదారులపై తక్కువ ఎత్తులో ఉండటం, భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి ఘటనలో రథాన్ని లాగుతున్న జీపు ఆగిపోవడంతో భక్తులు చేతులతో తోస్తూ ముందుకు తీసుకెళ్లారు. కానీ దాదాపు 50 అడుగుల దూరంలో వేలాడుతున్న విద్యుత్‌ తీగ రథానికి తగిలి షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో ఒక్కసారిగా షాక్‌ తగిలి తొమ్మిది మంది కుప్పకూలారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురిని ఆస్పత్రికి తరలించినా పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఇక నిన్న చోటు చేసుకున్న రెండు ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పాతబస్తీలో గణేశ్‌ విగ్రహం తరలింపులో విద్యుత్‌ తీగలను కర్రతో పైకెత్తే ప్రయత్నంలోనే షాక్‌ తగిలి మృతి సంభవించింది. అదే సమయంలో అంబర్‌పేట్ ఘటన కూడా సమాజంలో తీవ్ర ఆవేదన కలిగించింది. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ విద్యుదాఘాత ఘటనలపై అధికారులు అప్రమత్తమవుతున్నారు. విగ్రహాల రవాణా, ఉరేగింపుల్లో విద్యుత్‌ శాఖ, పోలీసు శాఖ, మునిసిపల్‌ శాఖ సమన్వయంతో ముందుగానే భద్రతా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

This post was last modified on August 19, 2025 11:15 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

9 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

10 hours ago