Trends

ఉక్రెయిన్ – రష్యా భేటి: అమెరికాకు వచ్చే లాభమేంటి?

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతోంది. దీనిని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మళ్లీ రంగంలోకి దిగారు. ఇటీవల వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు యూరప్ దేశాల నేతలతో చర్చించిన అనంతరం, త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌, జెలెన్‌స్కీ భేటీ జరగనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ భేటీ యుద్ధాన్ని ముగించే దిశగా ఒక కీలక ముందడుగని ఆయన అభివర్ణించారు. అమెరికా సమన్వయం వల్లే ఇది సాధ్యమైందని ట్రంప్ చెప్పడం, తన పాత్రను పెద్దది చేసి చూపించుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది.

ఇదివరకే భారత్ – పాక్ మధ్య అణు యుద్ధం జరిగే పరిస్థితి వస్తే తానే ఆపానని ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. భారత్‌ మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించింది. కానీ అంతర్జాతీయ వేదికపై ట్రంప్ తనదైన శైలిలో “నేనే ఆపాను” అన్న బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ విషయంలో కూడా అదే తరహాలో వెళ్తూ, తాను మధ్యవర్తిగా లేకపోతే ఈ యుద్ధం పెరిగిపోయేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

అసలు విషయ ఏమిటంటే, ఈ శాంతి చర్చల వెనుక అమెరికాకు కూడా లాభమే. మొదటగా, యుద్ధం ముగిస్తే యూరప్ అంతటా ఇంధన ధరల ఒత్తిడి తగ్గుతుంది. దాంతో అమెరికా శక్తివంతమైన “పీస్ మేకర్”గా గుర్తింపు పొందుతుంది. రెండవది, ఈ ఒప్పందాన్ని తన విజయంగా చూపించుకుని ట్రంప్ ప్రపంచ దేశాల ముందు రాజకీయంగా లాభపడతారు.

అదే సమయంలో అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. యూరప్‌ దేశాలను తన చుట్టూ ఉంచుకోవడం, నాటోలో అమెరికా ఆధిపత్యం కొనసాగించడం ఈ ప్రక్రియతో సులభమవుతుంది. మరోవైపు రష్యాతో నేరుగా చర్చలు జరగడం వల్ల అమెరికా అంతర్జాతీయ సమీకరణల్లో కేంద్రస్థానం దక్కించుకుంటుంది. ముఖ్యంగా పెరుగుతున్న చైనా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఈ లాభాలు అమెరికాకు మరింత అవసరం.

అలాగే గ్లోబల్ మార్కెట్ స్థిరపడితే అమెరికా బిజినెస్‌లకు పెద్ద లాభం ఉంటుంది. ప్రస్తుతం అనిశ్చితి కారణంగా చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతున్నాయి. కానీ యుద్ధం తగ్గితే, గ్లోబల్ ట్రేడ్ సులభమై, అమెరికా దిగుమతులు, ఎగుమతులు పెరుగుతాయి. ముఖ్యంగా టెక్ కంపెనీలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఫార్మా రంగాలకు విపరీతమైన లాభం చేకూరుతుంది. మొత్తానికి, పుతిన్ జెలెన్‌స్కీ భేటీ ఎప్పుడు ఎక్కడ జరుగుతుందనేది ఇంకా స్పష్టత రాకపోయినా, ట్రంప్ ఇప్పటికే దీన్ని తన విజయంగా ప్రదర్శించడం ప్రారంభించారు. ఆయన ప్రపంచం ముందు శాంతి కర్తగా నిలబడతారా? లేక మళ్లీ బిల్డప్‌ ట్యాగ్ అందుకుంటాడా అనేది హాట్ టాపిక్ గా మారుతోంది.

This post was last modified on August 19, 2025 7:54 am

Share

Recent Posts

వంద కోట్ల బోణీ సులభంగా కనపడుతోంది

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ వావ్ అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్లు…

7 minutes ago

పాలు అమ్మాను… అనే పెద్దాయన చిన్న సినిమాకు పర్మిషన్ ఇవ్వలేదు

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ఎదురయ్యే చేదు అనుభవాలు అన్ని ఇన్ని కావు. ఇక మేకర్స్ అప్పుడప్పుడు ఓపెన్ గా మాట్లాడే…

53 minutes ago

3,400 లిప్‌స్టిక్‌ ముద్దులు… చివరికి రూ.5,500 జరిమానా!

ముద్దుల గుర్తులతో మెరిసిపోయిన ఓ కారు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ వీధుల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. కారు మొత్తం దాదాపు 3,400…

1 hour ago

నాకు యాక్టింగ్ నేర్పిస్తావా… ఇరుముడి పాపతో ధనుష్

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…

2 hours ago

ఏకగ్రీవాలు జరిగితే MLA టికెట్ ఇవ్వను: జగన్!

స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…

2 hours ago

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

5 hours ago