Trends

ఉక్రెయిన్ – రష్యా భేటి: అమెరికాకు వచ్చే లాభమేంటి?

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతోంది. దీనిని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మళ్లీ రంగంలోకి దిగారు. ఇటీవల వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు యూరప్ దేశాల నేతలతో చర్చించిన అనంతరం, త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌, జెలెన్‌స్కీ భేటీ జరగనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ భేటీ యుద్ధాన్ని ముగించే దిశగా ఒక కీలక ముందడుగని ఆయన అభివర్ణించారు. అమెరికా సమన్వయం వల్లే ఇది సాధ్యమైందని ట్రంప్ చెప్పడం, తన పాత్రను పెద్దది చేసి చూపించుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది.

ఇదివరకే భారత్ – పాక్ మధ్య అణు యుద్ధం జరిగే పరిస్థితి వస్తే తానే ఆపానని ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. భారత్‌ మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించింది. కానీ అంతర్జాతీయ వేదికపై ట్రంప్ తనదైన శైలిలో “నేనే ఆపాను” అన్న బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ విషయంలో కూడా అదే తరహాలో వెళ్తూ, తాను మధ్యవర్తిగా లేకపోతే ఈ యుద్ధం పెరిగిపోయేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

అసలు విషయ ఏమిటంటే, ఈ శాంతి చర్చల వెనుక అమెరికాకు కూడా లాభమే. మొదటగా, యుద్ధం ముగిస్తే యూరప్ అంతటా ఇంధన ధరల ఒత్తిడి తగ్గుతుంది. దాంతో అమెరికా శక్తివంతమైన “పీస్ మేకర్”గా గుర్తింపు పొందుతుంది. రెండవది, ఈ ఒప్పందాన్ని తన విజయంగా చూపించుకుని ట్రంప్ ప్రపంచ దేశాల ముందు రాజకీయంగా లాభపడతారు.

అదే సమయంలో అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. యూరప్‌ దేశాలను తన చుట్టూ ఉంచుకోవడం, నాటోలో అమెరికా ఆధిపత్యం కొనసాగించడం ఈ ప్రక్రియతో సులభమవుతుంది. మరోవైపు రష్యాతో నేరుగా చర్చలు జరగడం వల్ల అమెరికా అంతర్జాతీయ సమీకరణల్లో కేంద్రస్థానం దక్కించుకుంటుంది. ముఖ్యంగా పెరుగుతున్న చైనా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఈ లాభాలు అమెరికాకు మరింత అవసరం.

అలాగే గ్లోబల్ మార్కెట్ స్థిరపడితే అమెరికా బిజినెస్‌లకు పెద్ద లాభం ఉంటుంది. ప్రస్తుతం అనిశ్చితి కారణంగా చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతున్నాయి. కానీ యుద్ధం తగ్గితే, గ్లోబల్ ట్రేడ్ సులభమై, అమెరికా దిగుమతులు, ఎగుమతులు పెరుగుతాయి. ముఖ్యంగా టెక్ కంపెనీలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఫార్మా రంగాలకు విపరీతమైన లాభం చేకూరుతుంది. మొత్తానికి, పుతిన్ జెలెన్‌స్కీ భేటీ ఎప్పుడు ఎక్కడ జరుగుతుందనేది ఇంకా స్పష్టత రాకపోయినా, ట్రంప్ ఇప్పటికే దీన్ని తన విజయంగా ప్రదర్శించడం ప్రారంభించారు. ఆయన ప్రపంచం ముందు శాంతి కర్తగా నిలబడతారా? లేక మళ్లీ బిల్డప్‌ ట్యాగ్ అందుకుంటాడా అనేది హాట్ టాపిక్ గా మారుతోంది.

This post was last modified on August 19, 2025 7:54 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాధేశ్యామ్ దర్శకుడెక్కడ?

‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అలాంటి హీరోతో సినిమా తీసే…

26 minutes ago

కేసీఆర్‌ కావాల‌నే మౌనంగా ఉన్నారా?

తెలంగాణ రాష్ట్ర సేన‌.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన క‌విత వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నాయ‌కులు మౌనంగా ఉన్నారు.…

5 hours ago

దాగుడుమూతల దృశ్యానికి మోక్షం దక్కింది

మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…

6 hours ago

మనసు మారిందా వీరభద్రుడా

బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…

7 hours ago

తప్పు చేస్తే చంద్రబాబుకి ఎవరైనా ఒకటే

సొంత పార్టీ నాయ‌కుడు త‌ప్పు చేస్తే ఒక‌విధంగా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు త‌ప్పులు చేస్తే మ‌రో విధంగా మారి పోయిన…

7 hours ago

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…

9 hours ago