Trends

అక్కడ రూ.1000 కోట్ల అద్దె

ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్‌ భారత్‌లో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే సంస్థ తాజాగా బెంగళూరులో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయాన్ని అద్దెకు తీసుకుంది. ఇది కేవలం సాధారణ లీజు ఒప్పందం కాదు, పదేళ్లలో యాపిల్‌ చెల్లించబోయే అద్దె మొత్తం చూసి దేశంలోని రియల్ ఎస్టేట్ రంగం సైతం ఆశ్చర్యపోతోంది. నెలకు రూ.6.3 కోట్ల అద్దెతో మొదలయ్యే ఈ ఒప్పందం, ప్రతి ఏడాది 4.5 శాతం పెరుగుతూ, మొత్తం రూ.1000 కోట్లను తాకనుంది.

ప్రాప్‌స్టాక్‌ అనే డేటా అనలిటిక్స్‌ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఒప్పందం 2025 ఏప్రిల్‌ 3 నుంచి అమలులోకి వచ్చింది. యాపిల్‌ అద్దెకు తీసుకున్న స్థలం సాంకేతిక నగరమైన బెంగళూరులోని వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ఇది సంస్థకు దక్షిణ భారత మార్కెట్‌ పైన మరింత దృష్టి పెట్టే అవకాశాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఐటీ, టెక్‌ రంగాలకు కేంద్రంగా ఉన్న ఈ నగరంలో యాపిల్‌ లాంటి గ్లోబల్‌ కంపెనీ భారీ స్థలాన్ని ఎంచుకోవడం, భారత్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులకు సూచనగా భావిస్తున్నారు.

గత ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత్‌ నుంచి అతి పెద్ద మొబైల్‌ ఫోన్ ఎగుమతిదారుగా యాపిల్‌ నిలిచింది. సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను భారత్‌లో తయారు చేసి విదేశాలకు పంపింది. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా యాపిల్‌ ఇప్పటికే ఉత్పత్తి స్థాయిని విస్తరించింది. ఇప్పుడు కార్యాలయ స్థాయిలో కూడా భారీ అడుగు వేసింది. దీంతో రాబోయే రోజుల్లో యాపిల్‌ భారత్‌ను కీలక ఉత్పత్తి కేంద్రంగా మార్చబోతుందనే అంచనాలు మరింత బలపడుతున్నాయి.

అద్దె మొత్తం మాత్రమే కాకుండా, ఈ ఒప్పందం బెంగళూరులోని రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై పెద్ద ప్రభావం చూపనుంది. అంతర్జాతీయ కంపెనీలు భారీ స్థలాలను ఎంచుకోవడానికి బెంగళూరు మళ్లీ ప్రధాన గమ్యస్థానంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. యాపిల్‌ నిర్ణయం తర్వాత మరిన్ని టెక్ కంపెనీలు కూడా ఇలాంటి పెట్టుబడులకు అడుగులు వేయవచ్చని అంచనా.

This post was last modified on August 19, 2025 6:38 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

24 minutes ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

37 minutes ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

4 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

6 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

7 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

7 hours ago