Trends

అక్కడ రూ.1000 కోట్ల అద్దె

ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్‌ భారత్‌లో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే సంస్థ తాజాగా బెంగళూరులో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయాన్ని అద్దెకు తీసుకుంది. ఇది కేవలం సాధారణ లీజు ఒప్పందం కాదు, పదేళ్లలో యాపిల్‌ చెల్లించబోయే అద్దె మొత్తం చూసి దేశంలోని రియల్ ఎస్టేట్ రంగం సైతం ఆశ్చర్యపోతోంది. నెలకు రూ.6.3 కోట్ల అద్దెతో మొదలయ్యే ఈ ఒప్పందం, ప్రతి ఏడాది 4.5 శాతం పెరుగుతూ, మొత్తం రూ.1000 కోట్లను తాకనుంది.

ప్రాప్‌స్టాక్‌ అనే డేటా అనలిటిక్స్‌ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఒప్పందం 2025 ఏప్రిల్‌ 3 నుంచి అమలులోకి వచ్చింది. యాపిల్‌ అద్దెకు తీసుకున్న స్థలం సాంకేతిక నగరమైన బెంగళూరులోని వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ఇది సంస్థకు దక్షిణ భారత మార్కెట్‌ పైన మరింత దృష్టి పెట్టే అవకాశాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఐటీ, టెక్‌ రంగాలకు కేంద్రంగా ఉన్న ఈ నగరంలో యాపిల్‌ లాంటి గ్లోబల్‌ కంపెనీ భారీ స్థలాన్ని ఎంచుకోవడం, భారత్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులకు సూచనగా భావిస్తున్నారు.

గత ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత్‌ నుంచి అతి పెద్ద మొబైల్‌ ఫోన్ ఎగుమతిదారుగా యాపిల్‌ నిలిచింది. సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను భారత్‌లో తయారు చేసి విదేశాలకు పంపింది. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా యాపిల్‌ ఇప్పటికే ఉత్పత్తి స్థాయిని విస్తరించింది. ఇప్పుడు కార్యాలయ స్థాయిలో కూడా భారీ అడుగు వేసింది. దీంతో రాబోయే రోజుల్లో యాపిల్‌ భారత్‌ను కీలక ఉత్పత్తి కేంద్రంగా మార్చబోతుందనే అంచనాలు మరింత బలపడుతున్నాయి.

అద్దె మొత్తం మాత్రమే కాకుండా, ఈ ఒప్పందం బెంగళూరులోని రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై పెద్ద ప్రభావం చూపనుంది. అంతర్జాతీయ కంపెనీలు భారీ స్థలాలను ఎంచుకోవడానికి బెంగళూరు మళ్లీ ప్రధాన గమ్యస్థానంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. యాపిల్‌ నిర్ణయం తర్వాత మరిన్ని టెక్ కంపెనీలు కూడా ఇలాంటి పెట్టుబడులకు అడుగులు వేయవచ్చని అంచనా.

This post was last modified on August 19, 2025 6:38 am

Share

Recent Posts

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

1 hour ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

2 hours ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

3 hours ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

3 hours ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

3 hours ago

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

4 hours ago