ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ బాంకే బిహారీ ఆలయానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయ నిధుల నుంచి రూ.500 కోట్లు తీసుకొని కారిడార్ నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వివాదానికి కారణమైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. “లార్డ్ కృష్ణుడే మొదటి మధ్యవర్తి. కాబట్టి మీరు కూడా మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్య పరిష్కరించుకోవాలి,” అంటూ సూచించింది.
1862లో నిర్మించిన ఈ బాంకే బిహారీ ఆలయం ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. గతేడాది జన్మాష్టమి సందర్భంగా ఆలయంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భక్తులకు సురక్షితమైన దర్శనం కల్పించేందుకు యూపీ ప్రభుత్వం కారిడార్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఆలయం నిర్వహణ బాధ్యతలు చూసే కుటుంబాన్ని తొలగించి, నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణను తీసుకోవడం వివాదానికి దారితీసింది.
ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు వేసింది. ఆలయానికి సంబంధించిన వివాదంలో ప్రభుత్వం నేరుగా ప్రవేశించడం సరికాదని పేర్కొంది. ‘‘ఇది రెండు ప్రైవేట్ పార్టీల మధ్య వివాదం. ప్రభుత్వం ఇలాంటి వివాదాల్లోకి ప్రవేశించడం న్యాయపరంగా సరైన విధానం కాదు,’’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా కోర్టు నుంచి అనుమతి పొందడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీనికి పరిష్కారంగా, ఆలయ నిర్వహణ బాధ్యతలను ఒక తాత్కాలిక కమిటీకి అప్పగించాలని న్యాయస్థానం ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు ఒక మంచి ఉదాహరణ కూడా ఇచ్చింది. “కృష్ణుడు చరిత్రలో మొదటి మధ్యవర్తి (Mediator)!” అని చెప్పారు. పురాణాల్లో శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు, కౌరవులు పాండవుల మధ్య శాంతి కాపాడేందుకు “మధ్యవర్తిగా” చర్చలు జరిపాడు. ఇక “ఈ ఆలయ వివాదంలో కూడా, మీరు కోపంగా ఉండకుండా… ఇరు వర్గాలు (ప్రభుత్వం, ఆలయ కుటుంబం) చర్చలు జరిపి, కృష్ణుడిలా మధ్యవర్తిత్వంతో పరిష్కారం కనుక్కోవాలి,” అన్నట్లుగా సుప్రీంకోర్టు సూచించింది.
ఈ కమిటీలో రిటైర్డ్ న్యాయమూర్తులు ఉండాలని, ఆలయ సంప్రదాయ పూజా విధానాలు మాత్రం ఇప్పటివరకూ నిర్వహించిన కుటుంబానికే కొనసాగించాలని తెలిపింది. ఇలా చేస్తే వివాదం తాత్కాలికంగా సమసిపోతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కారిడార్ నిర్మాణం కోసం అవసరమైన భూములను ప్రభుత్వం చట్టప్రకారం స్వాధీనం చేసుకోవచ్చు కదా అని ప్రశ్నించింది కోర్టు. దీనిపై ప్రభుత్వం స్పందన తెలపాలని సూచిస్తూ విచారణను వాయిదా వేసింది. ఇలాంటి చర్యలతో భక్తులకు సురక్షితమైన దర్శనం కల్పిస్తూ, ఆలయ సంప్రదాయాలనూ కాపాడుకోవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది.
This post was last modified on August 4, 2025 11:32 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…