Trends

కృష్ణుడే మొదటి మధ్యవర్తి.. ఆలయ వివాదంలో సుప్రీంకోర్టు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ బాంకే బిహారీ ఆలయానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయ నిధుల నుంచి రూ.500 కోట్లు తీసుకొని కారిడార్ నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వివాదానికి కారణమైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. “లార్డ్ కృష్ణుడే మొదటి మధ్యవర్తి. కాబట్టి మీరు కూడా మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్య పరిష్కరించుకోవాలి,” అంటూ సూచించింది.

1862లో నిర్మించిన ఈ బాంకే బిహారీ ఆలయం ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. గతేడాది జన్మాష్టమి సందర్భంగా ఆలయంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భక్తులకు సురక్షితమైన దర్శనం కల్పించేందుకు యూపీ ప్రభుత్వం కారిడార్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఆలయం నిర్వహణ బాధ్యతలు చూసే కుటుంబాన్ని తొలగించి, నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణను తీసుకోవడం వివాదానికి దారితీసింది.

ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు వేసింది. ఆలయానికి సంబంధించిన వివాదంలో ప్రభుత్వం నేరుగా ప్రవేశించడం సరికాదని పేర్కొంది. ‘‘ఇది రెండు ప్రైవేట్ పార్టీల మధ్య వివాదం. ప్రభుత్వం ఇలాంటి వివాదాల్లోకి ప్రవేశించడం న్యాయపరంగా సరైన విధానం కాదు,’’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా కోర్టు నుంచి అనుమతి పొందడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

దీనికి పరిష్కారంగా, ఆలయ నిర్వహణ బాధ్యతలను ఒక తాత్కాలిక కమిటీకి అప్పగించాలని న్యాయస్థానం ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు ఒక మంచి ఉదాహరణ కూడా ఇచ్చింది. “కృష్ణుడు చరిత్రలో మొదటి మధ్యవర్తి (Mediator)!” అని చెప్పారు. పురాణాల్లో శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు, కౌరవులు పాండవుల మధ్య శాంతి కాపాడేందుకు “మధ్యవర్తిగా” చర్చలు జరిపాడు. ఇక “ఈ ఆలయ వివాదంలో కూడా, మీరు కోపంగా ఉండకుండా… ఇరు వర్గాలు (ప్రభుత్వం, ఆలయ కుటుంబం) చర్చలు జరిపి, కృష్ణుడిలా మధ్యవర్తిత్వంతో పరిష్కారం కనుక్కోవాలి,” అన్నట్లుగా సుప్రీంకోర్టు సూచించింది.

ఈ కమిటీలో రిటైర్డ్ న్యాయమూర్తులు ఉండాలని, ఆలయ సంప్రదాయ పూజా విధానాలు మాత్రం ఇప్పటివరకూ నిర్వహించిన కుటుంబానికే కొనసాగించాలని తెలిపింది. ఇలా చేస్తే వివాదం తాత్కాలికంగా సమసిపోతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కారిడార్ నిర్మాణం కోసం అవసరమైన భూములను ప్రభుత్వం చట్టప్రకారం స్వాధీనం చేసుకోవచ్చు కదా అని ప్రశ్నించింది కోర్టు. దీనిపై ప్రభుత్వం స్పందన తెలపాలని సూచిస్తూ విచారణను వాయిదా వేసింది. ఇలాంటి చర్యలతో భక్తులకు సురక్షితమైన దర్శనం కల్పిస్తూ, ఆలయ సంప్రదాయాలనూ కాపాడుకోవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది.

This post was last modified on August 4, 2025 11:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

38 minutes ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

1 hour ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

2 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

5 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

7 hours ago