ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో రాత్రివేళ రోడ్డుపై ఓ జంట చేసిన రొమాంటిక్ స్టంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అగ్రా-కాన్పూర్ నేషనల్ హైవేపై బైక్ మీద అతి వేగంగా ప్రయాణిస్తున్న ఈ జంట, ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించింది. మహిళ బైక్ ట్యాంక్పై పడుకుని ఉంది, పురుషుడు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నాడు. ఇది చూసిన ఒక వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.
ఈ ఘటన ఫిరోజాబాద్ జిల్లాలో జూన్ 26వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో జరిగినట్టు సమాచారం. ఈ వీడియోలో బైక్పై ప్రయాణిస్తున్న జంట తమ ప్రేమను రోడ్డుపై ప్రదర్శిస్తూ ప్రమాదకరంగా ప్రవర్తించడం కనిపిస్తోంది. మహిళ పూర్తిగా ట్యాంక్పై ఒళ్ళు పెట్టుకుని పడుకుని ఉండగా, పురుషుడు నడిపిస్తున్న బైక్ ఓ మామూలు రోడ్డుపై కాదు, నేషనల్ హైవేపై ఉద్ధరంగా వెళ్తోంది. ఈ వ్యవహారం చూసిన ప్రజలు భయంతో పాటు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
పబ్లిక్ ప్రదేశాల్లో ప్రేమను వ్యక్తం చేయడంపై అభ్యంతరాలు లేకపోయినా, ఇలా ప్రాణాలకు ముప్పు కలిగించే రీతిలో ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు సోషల్ మీడియాలో “ఇది ప్రేమ కాదు, పిచ్చి!”, “ఇలాంటివాళ్లు తమతో పాటు ఇంకొంతమందిని ప్రమాదంలోకి నెట్టుతున్నారు” అని స్పందించారు. కొంతమంది అయితే ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ విమర్శలు చేశారు.
ఇలాంటి ఘటనలు తరచూ వార్తల్లోకి వస్తున్నా, వాటిపై గట్టి చర్యలు లేకపోవడం వల్లే మరిన్ని స్టంట్లు, రోడ్డుపై ప్రేమ ప్రదర్శనలు పెరుగుతున్నాయని నెటిజన్లు అంటున్నారు. ఈ జంటపై పోలీసులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ, సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఈ వీడియో ఆధారంగా గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
This post was last modified on June 28, 2025 6:54 pm
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…
ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు…
పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…