అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇప్పుడు ఓ-1 వీసా కొత్త ఆశగా మారింది. హెచ్-1బీ వీసాల విషయంలో లాటరీ, పరిమితులు, రిజెక్షన్ల భయంతో ఎందరో నిరుత్సాహపడుతుంటే… అసాధారణ ప్రతిభను గుర్తించి ఇచ్చే ఓ-1 వీసా మాత్రం రోజురోజుకూ ప్రజాదరణ పొందుతోంది. ముఖ్యంగా టెక్ రంగంలో పనిచేస్తున్నవారూ, డిజిటల్ క్రియేటర్లు, అథ్లెట్లు ఇలా వివిధ రంగాల్లో ప్రతిభావంతులు అమెరికా వెళ్లేందుకు ఈ వీసాను ఆశ్రయిస్తున్నారు. మరిన్ని అవకాశాలు, తక్కువ నిరాకరణతో ఈ వీసా పట్ల ఆసక్తి పెరుగుతోంది.
ఈ వీసా అందరికీ అందుబాటులో ఉండదు. అయితే, ప్రత్యేకత ఉన్న వారికి మాత్రం ఇది చక్కటి మార్గం. సైన్స్, టెక్నాలజీ, విద్య, వ్యాపారం, స్పోర్ట్స్, ఆర్ట్స్ రంగాల్లో అత్యున్నత ప్రతిభను ప్రదర్శించిన వారు అర్హులు. అమెరికా విదేశాంగ శాఖ నిర్ణయించిన ఎనిమిది ప్రమాణాల్లో కనీసం మూడింటిని పూర్తిచేయగలిగిన వారికే వీసా మంజూరు అవుతుంది. అవార్డులు గెలుచుకోవడం, గుర్తింపు పొందిన ప్రాజెక్టులు చేయడం, ప్రముఖ సంస్థలలో సభ్యత్వం కలిగి ఉండటం వంటి విషయాల్ని ఇందులో పరిగణించబడతాయి.
ఓ-1 వీసాలో లాటరీ ఉండదు. పైగా మొదట మూడు సంవత్సరాలకు ఇస్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి పొడిగించుకోవచ్చు. దీనివల్లే దీన్ని “లాటరీ లేని హెచ్-1బీ వీసా” అని కూడా పిలుస్తున్నారు. గత నాలుగేళ్లలో ఈ వీసా కోసం దరఖాస్తుల సంఖ్య రెట్టింపైంది. 2020లో 8,800కి పైగా వీసాలు మంజూరు కాగా, 2023 నాటికి ఈ సంఖ్య 18,900 దాటింది. భారతీయులే ఈ వీసాను మూడో అత్యధికంగా పొందుతున్నారు. ముఖ్యంగా టెక్ రంగంలో పని చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ఇప్పుడిక ఓ కొత్త సమస్య ముందుకొస్తోంది. వీసా దరఖాస్తులో సోషల్ మీడియా ఖాతాల వివరాలు తప్పనిసరి చేశారు. ఎవరైనా తమ సోషల్ మీడియా ఐడీలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తే, అది అనుమానానికి దారి తీయవచ్చు. అమెరికా అధికారులు అభ్యర్థి ఆన్లైన్ ప్రవర్తనను కూడా తీవ్రంగా పరిశీలిస్తున్నారు. గతంలో చేసిన పోస్టులు, కామెంట్లు కూడా చూస్తున్నారు. అందుకే వీసా కావాలంటే, సోషల్ మీడియా కూడా నిఖార్సైనదిగా ఉండాలి.
ఇక గూగుల్, టెస్లా, ఓపెన్ఏఐ వంటి దిగ్గజ సంస్థలు తమ కంపెనీలకు ప్రతిభావంతులను నియమించేందుకు ఓ-1 వీసా మార్గాన్ని ఉపయోగిస్తున్నాయి. హార్వర్డ్, కొలంబియా వంటి యూనివర్సిటీలలో పీహెచ్డీ విద్యార్థులు, ఫ్యాకల్టీలను కూడా ఈ వీసాతో నియమిస్తున్నారు. అమెరికాలో స్థిరపడాలన్న కలలు కంటున్నవారికి ఇది మంచి మార్గం. అయితే సోషల్ మీడియాలో బాధ్యతగా ప్రవర్తించడం ఇకపై మరింత ముఖ్యమవుతోంది.
This post was last modified on June 28, 2025 5:38 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…