బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూసిన భర్తకు దిమ్మ తిరిగే షాకిచ్చింది బాంబే హైకోర్టు. విడాకులు తీసుకున్న తర్వాత.. మాజీ భార్యకు ఆర్థికంగా సపోర్టు చేయాల్సిన మాజీ భర్త.. ఆమెకున్న చిన్న ఉద్యోగాల్ని సాకుగా చూపిస్తూ.. భరణం చెల్లించాల్సిన అవసరం లేదంటూ కోర్టును ఆశ్రయించిన ఉదంతంలో ఎదురుదెబ్బ తగిలింది.అసలేం జరిగిందంటే..
భార్యభర్తలు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. భార్య గౌరవప్రదమైన జీవనం కోసం ఆమెకు నెలకు రూ.15 వేలు చొప్పున భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భర్త ఆ ఆదేశాల్ని సవాలు చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా భార్య జాబ్ చేస్తుందని.. ఆర్థికంగా ఆమెకు తాను అండగా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. భార్యకు నెలకు రూ.25 వేలు జీతంగా వస్తోందని.. అదే సమయంలో భర్తకు నెలకు రూ.లక్షకు పైగా జీతం వస్తుందన్న విషయాన్ని పేర్కొంటూ.. ఉద్యోగం ఉన్నంత మాత్రాన భరణం ఇవ్వాల్సిన అవసరం లేదన్న భర్త వాదనను తప్పుపట్టింది. భర్తకు పెద్ద జీతంతో పాటు ఆర్థికంగా ఇతరత్రా బాధ్యతలు లేవన్న విషయాన్ని గుర్తించిన హైకోర్టు.. భార్య వాదనను సమర్థిస్తూ.. ఆమెకు భరణం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…