Trends

నిహారిక విడాకులపై మొదటిసారి స్పందించిన నాగబాబు

టాలీవుడ్లో ఎంతో వేడుకగా జరిగిన సెలబ్రెటీ పెళ్ళిళ్ళలో కొణిదెల నిహారిక-చైతన్యలది ఒకటి. నాగబాబు తనయురాలైన నిహారికకు, చైతన్య జొన్నలగడ్డ అనే కుర్రాడికి 2020లో ఆడంబరంగా పెళ్లి చేశాయి ఇరు కుటుంబాలు. కానీ మూడేళ్లకే వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. ఇక అప్పట్నుంచి నిహారిక సింగిల్‌గానే ఉంటోంది. నిహారికది చిన్న వయసే కావడంతో ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవాలని శ్రేయోభిలాషులు కోరుకుంటూ ఉంటారనడంలో సందేహం లేదు. 

కూతురు విడాకులు తీసుకున్నాక ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ పెద్దగా స్పందించని నాగబాబు.. తొలిసారిగా దీనిపై స్పందించారు. నిహారిక తొలి వివాహం విఫలం కావడం.. ఆమె రెండో పెళ్లి చేసుకోవడం గురించి ఆయన మాట్లాడారు. తన కూతురు పెళ్లి విషయంలో తాము పొరపాటు చేశామని నాగబాబు అభిప్రాయపడ్డారు. నిహారిక, చైతన్యలను ప్రాపర్‌గా జడ్జ్ చేయలేకపోయామని ఆయన అన్నారు. పరస్పర అంగీకారంతోనే వాళ్లిద్దరూ విడిపోయారని.. ఇప్పుడిప్పుడే నిహారిక దాన్నుంచి తేరుకుంటోందని నాగబాబు అన్నారు. 

ఏదో ఒక రోజు నిహారిక ఇంకో అబ్బాయిని కలుస్తుందని.. పెళ్లి చేసుకుంటుందని.. వారి విషయాల్లో తాను ఇన్వాల్వ్ కావాలనుకోవట్లేదని నాగబాబు స్పష్టం చేశారు. పిల్లలకు నచ్చినట్లుగా వాళ్లు జీవించాలని తాను కోరుకుంటానని ఓ ఇంటర్వ్యూలో నాగబాబు వ్యాఖ్యానించారు. విడాకుల సమయంలో కొంత కాలం నిహారిక బయట కనిపించలేదు. కానీ తర్వాత తేరుకుని ప్రొడక్షన్ మీద దృష్టిపెట్టింది. గత ఏడాది ఆమె నిర్మాణంలో తెరకెక్కిన ‘కమిటీ కుర్రాళ్ళు’ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా ఆమె ఓ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on June 23, 2025 1:28 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం… కేటీఆర్ అనుమానాలు

నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…

24 minutes ago

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

1 hour ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

4 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

6 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

6 hours ago