Trends

ఇంకా నయం.. హనీమూన్‌కు తీసుకెళ్లి చంపలేదు!

ఉత్తర్ ప్రదేశ్‌లోని బదాయూ జిల్లాలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన కొత్తలోనే భార్య ప్రియుడితో పారిపోయింది. అయితే దీనిపై భర్త స్పందించిన తీరు సంచలనంగా మారింది. “హనీమూన్‌కు తీసుకెళ్లి రాజా రఘువంశీలా హత్య చేయలేదని బతికి బయటపడ్డాను” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఇటీవల మెఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసును మరోసారి గుర్తు చేస్తోంది.

మే 17న సునీల్ అనే యువకుడికి స్థానికంగా 20 ఏళ్ల యువతితో పెళ్లి జరిగింది. అయితే ఆమె కేవలం తొమ్మిది రోజులకే పుట్టింటికి వెళ్ళినట్టు చెప్పి, అక్కడి నుంచే ప్రియుడితో పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ ప్రారంభించిన సమయంలో ఆ యువతి స్వయంగా తన ప్రియుడితో కలిసి పోలీసుల ముందుకు వచ్చింది. తాను అతనితోనే జీవించాలనుకుంటున్నానని స్పష్టం చేసింది.

ఈ విషయాన్ని అంగీకరించిన సునీల్ మీడియాతో మాట్లాడుతూ “ఇంకా నయం.. హనీమూన్‌కు తీసుకెళ్లి చంపలేదు. నేను హనీమూన్‌కు ప్లాన్ చేసినా, ఆమె అప్పటికే పారిపోయింది. లేకపోతే మరొక రాజా రఘువంశీలా నేను కూడా హతమయ్యేవాడిని. బతికిపోయాను అనిపిస్తుంది” అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అతని స్పందనలో బాధ కన్నా ఉపశమనమే ఎక్కువగా కనిపించింది.

ఇరు కుటుంబాలు పరస్పర అంగీకారంతో విడిపోయాయి. పెళ్లి సమయంలో ఇచ్చిన నగలు, కానుకలను వెనక్కు తీసుకున్నాయి. వివాదం పెద్దగా కావడం లేదని, ఫిర్యాదు ఉపసంహరించడంతో చట్టపరంగా ఎలాంటి చర్యలు అవసరం కాలేదని బిసౌలీ పోలీసు అధికారి హరేంద్రసింగ్ తెలిపారు. ఇటీవలి కాలంలో ప్రేమ, వివాహాల నేపథ్యంలో వచ్చే మోసాలు, హత్యలు ఎక్కువవుతున్నాయి. కానీ ఈ ఘటనలో విషాదం జరగకుండానే ముగిసిన తీరు, సునీల్ స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

This post was last modified on June 18, 2025 7:29 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

1 hour ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…

2 hours ago

మహిళల వీడియోలతో చెలగాటం… ఏఎస్సై సస్పెండ్

పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…

3 hours ago

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

8 hours ago

జ‌మిలికి జై కొట్టాలా?.. కాంగ్రెస్ అంత‌ర్మ‌థ‌నం!

దేశంలో రెండు కీల‌క అంశాల‌ను తేల్చేసేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ సర్కారు సిద్ధ‌మైంది. 1) జ‌మిలి ఎన్నిక‌లు. 2) పార్ల‌మెంటు…

12 hours ago