Trends

ఛాయ్ తాగండి… బేడీల బాధ వినండి!

వరకట్న వేధింపుల కేసుతో మానసికంగా కుంగిపోయిన ఓ యువకుడు వినూత్న రీతిలో న్యాయ పోరాటం మొదలుపెట్టాడు. రాజస్థాన్‌లోని అంటా పట్టణంలో కృష్ణ కుమార్ ధాకడ్ అనే వ్యక్తి తన అత్తవారింటి వీధిలోనే ‘498ఏ టీ కేఫ్’ అనే పేరుతో టీ దుకాణం ప్రారంభించాడు. చేతులకు బేడీలు వేసుకుని టీ అమ్ముతున్న ఈ అల్లుడు, తనపై పెట్టిన కేసులు, న్యాయ వ్యవస్థలో జరిగే జాప్యం వల్ల ఎదుర్కొంటున్న బాధను చాటుతూ నిరసన చేపట్టాడు. అతడి మాటల్లోనే, “నాకు న్యాయం జరిగే వరకు ఈ టీ మరుగుతూనే ఉంటుంది” అనే నినాదం ఆకట్టుకుంటోంది.

కృష్ణ కుమార్ తన భార్య మీనాక్షి మాలవ్‌ను 2018లో వివాహం చేసుకున్నాడు. అనంతరం వారు కలిసి తేనెటీగల పెంపకం వ్యాపారం ప్రారంభించారు. మహిళలకు ఉపాధి కల్పిస్తూ, వ్యాపారాన్ని విజయవంతంగా నడిపారు. అయితే 2022లో మీనాక్షి ఇంటిని వదిలి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె కృష్ణపై ఐపీసీ 498ఏ (వరకట్న వేధింపులు) మరియు సెక్షన్ 125 (భరణం) కింద కేసులు నమోదు చేయడంతో కృష్ణ జీవితం తలకిందులైంది.

తాను మూడు సంవత్సరాలుగా న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నానని, తన వద్ద ఏమీ మిగలలేదని కృష్ణ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తన చుట్టూ పోస్టర్లు ఏర్పాటు చేసి “125 కింద ఎంత ఖర్చు పెట్టాలో చర్చిద్దాం” అని పేర్కొంటూ చాయ్ తాగే కస్టమర్లతో తన బాధను పంచుకుంటున్నాడు.

తన నిరసన మానవీయ కోణాన్ని కలిగి ఉంటుందని చెబుతున్న కృష్ణ, “నన్ను చట్టాన్ని దుర్వినియోగం చేసి ఇరికించిన ప్రాంతంలోనే టీ కొట్టు పెట్టడం ద్వారా న్యాయాన్ని కోరుతున్నాను” అని పేర్కొన్నాడు. నీమచ్‌లోని అథానా నుంచి ప్రతి కోర్టు వాయిదా కోసం 220 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నానని, కానీ వాయిదాలే తప్ప న్యాయం దొరకడం లేదని వాపోయాడు.

ఇదే సమయంలో, అతని భార్య మీనాక్షి మాలవ్ మాత్రం వేరే ఆరోపణలు చేస్తోంది. భూమి కొనేందుకు తన తండ్రిని డబ్బు అడిగాడని, తిరస్కరించడంతో తను తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆరోపించింది. విడాకులకు తాను సిద్ధమని, కానీ తన పేరిట తీసుకున్న అప్పులన్నీ తొలుత చెల్లించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ‘498ఏ టీ కేఫ్’ అనే ఈ వినూత్న నిరసన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఈ కథ వైరల్ అవుతోంది.

This post was last modified on June 14, 2025 1:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…

12 seconds ago

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…

22 minutes ago

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

2 hours ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

2 hours ago

ధైర్యం అనుమానం మధ్య ‘పెద్ది’ సందిగ్ధం

రేపు ప్రారంభం కావాల్సిన పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏప్రిల్ 8కి వాయిదా వేయడం అభిమానుల్లో ఖంగారు పుట్టిస్తోంది.…

2 hours ago

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

4 hours ago