వివాహం కొత్తగా జరిగింది. హనీమూన్ కోసం భార్యాభర్తలు మేఘాలయకు వెళ్లారు. కానీ, అక్కడ క్షణాల్లో కబుర్లు మారిపోయాయి. ఈమె కేవలం భార్య కాదు… హంతకురాలిగా మారింది. భర్త హత్య కేసులో అసలు కుట్రదారే భార్యగా తేలిపోవడంతో, ఈ ఉదంతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.
ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ అనే జంట ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన వీరిలో… మే 23న రాజా మృతదేహం లభించగా, భార్య సోనమ్ అదృశ్యమైంది. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదై దర్యాప్తు మొదలైంది. అయితే, సోనమ్ పోలీసుల ఎదుట లొంగి ఇచ్చిన వివరాలు వారిని షాక్కు గురిచేశాయి.
తనకు మరో వ్యక్తితో సంబంధం ఉందని, భర్త అడ్డుగా మారాడన్న కారణంతోనే కిరాయి హంతకులతో రాజాను హత్య చేయించినట్టు ఆమె ఒప్పుకుంది. ఈ ఘాతుకానికి ముమ్మాటికీ ఆమెనే మాస్టర్ మైండ్ అని పోలీసులు తేల్చారు. సోనమ్ను ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో అరెస్ట్ చేయగా, హత్యలో పాల్గొన్న ముగ్గురు కిరాయి గుండాలను ఇండోర్లో అదుపులోకి తీసుకున్నారు.
ఇంతకీ ఈ హత్య ఎలా జరిగిందనే కోణంలో విచారణ కొనసాగుతోంది. రాజా హత్యకు ఉపయోగించిన ఆయుధం, హంతకులకు ఇవ్వబడిన డబ్బు, ఇతర మద్దతుదారుల వివరాలపై అధికారులు క్లారిటీ తీసుకునే పనిలో ఉన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. హనీమూన్ని అవకాశంగా మార్చుకుని జీవిత భాగస్వామిని దారుణంగా హత్య చేయించిన సోనమ్ వ్యవహారం నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రేమ పేరుతో, సంబంధాల పేరుతో జరుగుతున్న ఈ స్థాయి దారుణాలు ఈమధ్య మరింత ఎక్కువవుతున్నాయి.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…