రూ.500 నోట్లను 2026 మార్చి నుంచి పూర్తిగా రద్దు చేయబోతున్నారని.. ఇటీవలి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కథనం కలకలం రేపుతోంది. ఇదే విషయాన్ని వీడియో రూపంలో ప్రసారం చేసిన ఓ యూట్యూబ్ ఛానల్ “క్యాపిటల్ టీవీ” విషయాన్ని మరింత వేగంగా విస్తరించింది. దాదాపు 4.5 లక్షల మంది వీక్షించిన ఆ వీడియో వల్ల ప్రజల్లో ఆందోళన మొదలైంది.
అయితే ఈ ప్రచారానికి బ్రేక్ వేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందిస్తూ – “ఇది పూర్తిగా అవాస్తవం, ఇలాంటి నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకోలేదు” అని తేల్చిచెప్పింది. ప్రస్తుతం చలామణీలో ఉన్న రూ.500 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయనీ, వాటి ఆమోదం ఎక్కడా తగ్గబోదనీ స్పష్టం చేసింది.
ఆర్బీఐ వెబ్సైట్ లేదా ప్రముఖ మీడియా సంస్థల సమాచారం ద్వారా పరిశీలించినా, నోట్ల రద్దుపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదని స్పష్టమైంది. పీఐబీ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా ఈ విషయం తేల్చింది. ప్రజలు ఇలా వచ్చే నకిలీ కథనాలను నమ్మొద్దని, అధికారిక వేదికల నుంచే సమాచారం తెలుసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఈ మధ్య ఏటీఎంల నుంచి చిన్న డినామినేషన్ నోట్లను అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ చేసిన సర్క్యులర్ వల్లే ఈ అపోహలు మొదలయ్యాయని భావిస్తున్నారు. కానీ అది కేవలం రూ.100, రూ.200 నోట్ల లభ్యతను పెంచేందుకే, రూ.500 నోట్ల రద్దుతో సంబంధం లేదని అధికారులు తెలిపారు.
This post was last modified on June 7, 2025 4:53 pm
రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక.. వరుసగా రీమేక్ సినిమాలే చేస్తూ వచ్చాడు పవర్ స్టార్ పవన్…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరే సమయం ఆసన్నమైందా? ఇప్పటికే ఆయన…
ఏపీ సీఎం నారా చంద్రబాబు ఇంట్లో సంబరాలు జరిగాయి. శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబరాలకు నందమూరి…
అభిమానులకు పవన్ కళ్యాణ్ సినిమా అంటే సెలబ్రేషన్ కన్నా ఎక్కువ. ఓజి లాగా రికార్డులు బద్దలు కొట్టినా, హరిహర వీరమల్లు…
బుక్ మై షో ఓపెన్ చేస్తే ఒక విచిత్రం గమనించవచ్చు. దురంధర్, దురంధర్ ది రివెంజ్ రెండు సినిమాలు ట్రెండింగ్…
అదేంటి దర్శకుల్లో ఈ న్యూ ఏజ్ బ్యాచ్ ఎవరనుకుంటున్నారా. కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా సహజమైన కథా కథనాలతో నిజ…