ఎప్పుడో ఊహించని ప్రాంతంలో… ఊహించని ధరతో… భారత బిస్కెట్ బ్రాండ్ ఒకటి అంతర్జాతీయంగా వార్తల్లోకి ఎక్కింది. భారతదేశంలో చిల్లర ధరకు లభించే పార్లే-జీ బిస్కెట్ల ప్యాకెట్, గాజాలో ప్రస్తుతం రూ.2,000కి పైగా అమ్ముడవుతోందంటే విశ్వసించడం కష్టం. యుద్ధ తీవ్రత, ఆహార కొరత కారణంగా అక్కడి బ్లాక్ మార్కెట్ ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి.
ఇటీవల ఒక పాలస్తీనా వ్యక్తి తన పిల్లల కోసం పార్లే-జీ టిన్ కొనుగోలు చేసిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. “నా కుమార్తె రఫీఫ్కి ఇష్టమైన బిస్కెట్లను కొనాలన్నదే నా లక్ష్యం. వాటి ధర అంత అధికంగా ఉన్నా, కాదనలేకపోయాను” అంటూ భావోద్వేగంగా తెలిపారు. పార్లే బ్రాండ్ పై ముద్ర ఉన్న ప్యాకెట్ ఫొటోతో పాటు షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అయింది.
పదార్థాల ధరలు నైరుతి గాజాలో మరింత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి మార్కెట్లో కిలో చక్కెర రూ. 4,900, వంట నూనె రూ. 4,100, ఉల్లిపాయలు రూ. 4,400కి చేరినాయి. మానవతా సహాయం తగ్గిపోయిన నేపథ్యంలో, కొన్ని వర్గాల చేతుల్లోకి సరఫరా చేరడంతో బ్లాక్ మార్కెట్ బాగా విస్తరించింది. ప్రజలు తమ ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో, చిన్న చిరుతిండ్ల కోసం వేల రూపాయలు వెచ్చించాల్సిన దుస్థితి అక్కడ నెలకొంది.
ఇజ్రాయెల్ దిగ్బంధన, హమాస్ హస్తక్షేపం, అంతర్జాతీయ మానవతా సహాయం నిలిచిపోవడం వల్ల గాజాలో చిన్న వస్తువులు కూడా లక్షలు పలికే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో, ఒక నాసిరకం బిస్కెట్ ఇప్పుడు ఓ విలాస వస్తువుగా మారిపోయింది.
This post was last modified on June 6, 2025 7:48 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…