ఎప్పుడో ఊహించని ప్రాంతంలో… ఊహించని ధరతో… భారత బిస్కెట్ బ్రాండ్ ఒకటి అంతర్జాతీయంగా వార్తల్లోకి ఎక్కింది. భారతదేశంలో చిల్లర ధరకు లభించే పార్లే-జీ బిస్కెట్ల ప్యాకెట్, గాజాలో ప్రస్తుతం రూ.2,000కి పైగా అమ్ముడవుతోందంటే విశ్వసించడం కష్టం. యుద్ధ తీవ్రత, ఆహార కొరత కారణంగా అక్కడి బ్లాక్ మార్కెట్ ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి.
ఇటీవల ఒక పాలస్తీనా వ్యక్తి తన పిల్లల కోసం పార్లే-జీ టిన్ కొనుగోలు చేసిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. “నా కుమార్తె రఫీఫ్కి ఇష్టమైన బిస్కెట్లను కొనాలన్నదే నా లక్ష్యం. వాటి ధర అంత అధికంగా ఉన్నా, కాదనలేకపోయాను” అంటూ భావోద్వేగంగా తెలిపారు. పార్లే బ్రాండ్ పై ముద్ర ఉన్న ప్యాకెట్ ఫొటోతో పాటు షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అయింది.
పదార్థాల ధరలు నైరుతి గాజాలో మరింత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి మార్కెట్లో కిలో చక్కెర రూ. 4,900, వంట నూనె రూ. 4,100, ఉల్లిపాయలు రూ. 4,400కి చేరినాయి. మానవతా సహాయం తగ్గిపోయిన నేపథ్యంలో, కొన్ని వర్గాల చేతుల్లోకి సరఫరా చేరడంతో బ్లాక్ మార్కెట్ బాగా విస్తరించింది. ప్రజలు తమ ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో, చిన్న చిరుతిండ్ల కోసం వేల రూపాయలు వెచ్చించాల్సిన దుస్థితి అక్కడ నెలకొంది.
ఇజ్రాయెల్ దిగ్బంధన, హమాస్ హస్తక్షేపం, అంతర్జాతీయ మానవతా సహాయం నిలిచిపోవడం వల్ల గాజాలో చిన్న వస్తువులు కూడా లక్షలు పలికే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో, ఒక నాసిరకం బిస్కెట్ ఇప్పుడు ఓ విలాస వస్తువుగా మారిపోయింది.
This post was last modified on June 6, 2025 7:48 pm
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…
ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య టాలీవుడ్ స్టార్లు ఒకరి తర్వాత ఒకరు గాయపడడం ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే.…