ఎప్పుడో ఊహించని ప్రాంతంలో… ఊహించని ధరతో… భారత బిస్కెట్ బ్రాండ్ ఒకటి అంతర్జాతీయంగా వార్తల్లోకి ఎక్కింది. భారతదేశంలో చిల్లర ధరకు లభించే పార్లే-జీ బిస్కెట్ల ప్యాకెట్, గాజాలో ప్రస్తుతం రూ.2,000కి పైగా అమ్ముడవుతోందంటే విశ్వసించడం కష్టం. యుద్ధ తీవ్రత, ఆహార కొరత కారణంగా అక్కడి బ్లాక్ మార్కెట్ ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి.
ఇటీవల ఒక పాలస్తీనా వ్యక్తి తన పిల్లల కోసం పార్లే-జీ టిన్ కొనుగోలు చేసిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. “నా కుమార్తె రఫీఫ్కి ఇష్టమైన బిస్కెట్లను కొనాలన్నదే నా లక్ష్యం. వాటి ధర అంత అధికంగా ఉన్నా, కాదనలేకపోయాను” అంటూ భావోద్వేగంగా తెలిపారు. పార్లే బ్రాండ్ పై ముద్ర ఉన్న ప్యాకెట్ ఫొటోతో పాటు షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అయింది.
పదార్థాల ధరలు నైరుతి గాజాలో మరింత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి మార్కెట్లో కిలో చక్కెర రూ. 4,900, వంట నూనె రూ. 4,100, ఉల్లిపాయలు రూ. 4,400కి చేరినాయి. మానవతా సహాయం తగ్గిపోయిన నేపథ్యంలో, కొన్ని వర్గాల చేతుల్లోకి సరఫరా చేరడంతో బ్లాక్ మార్కెట్ బాగా విస్తరించింది. ప్రజలు తమ ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో, చిన్న చిరుతిండ్ల కోసం వేల రూపాయలు వెచ్చించాల్సిన దుస్థితి అక్కడ నెలకొంది.
ఇజ్రాయెల్ దిగ్బంధన, హమాస్ హస్తక్షేపం, అంతర్జాతీయ మానవతా సహాయం నిలిచిపోవడం వల్ల గాజాలో చిన్న వస్తువులు కూడా లక్షలు పలికే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో, ఒక నాసిరకం బిస్కెట్ ఇప్పుడు ఓ విలాస వస్తువుగా మారిపోయింది.
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…