ఏపీలో గత ఖరీఫ్, ఇటీవలే ముగిసిన రబీ సీజన్లు ఎంచక్కా… ఎలాంటి ఆటంకాలు, వాతావరణ ప్రతికూలతలు లేకుండా సాఫీగా సాగిపోయాయి. ఫలితంగా అన్నదాతలు కూడా మునుపటి కంటే కూడా నాలుగు బస్తాల ధాన్యాన్ని అధికంగా పండించి సంతోషంలో మునిగిపోయారు. అటు ఖరీఫ్ సీజన్ ముగింపు, ఇటు రబీ ముగింపు సందర్భంగా అకాల వర్షాలు లేని కారణంగా ఏపీలో ధాన్యం తడిసిందన్న మాటే వినిపించలేదు. అయితే ఈ ఏడాది తొలకరి వర్షాలు ముందుగానే వస్తాయన్న వాతావరణ శాఖ సూచనతో అన్నదాతలు ఎదురుచూస్తుంటే… వారి ఆశలు అడియాశలే అవుతున్నాయి.
మే నెలాఖరు నాటికే నైరుతి రుతు పవనాలు ప్రవేశించనున్నాయని, ఫలితంగా గతేడాది కంటే కాస్తంత ముందుగానే తొలకరి వర్షాలు పడతాయని గత నెలలో వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో అప్పటికే రబీ పంట నూర్పిళ్లు, ధాన్యం అమ్మకాలు పూర్తి చేసుకున్న అన్న దాతలు ఖరీఫ్ కు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. కూటమి సర్కారు కూడా ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. తొలికలి పడిందంటే… ఖరీఫ్ సాగు మొదలెట్టేద్దామని అన్నదాతలు చూస్తుండగా… నైరుతి మాత్రం అంతకంతకూ వెనక్కెళ్లిపోతోంది. ఫలితంగా అన్నదాత అయోమయంలో పడిపోయాడు.
ఇదిలా ఉంటే… నైరుతి ఆలస్యంతో తొలకరి వర్షాలు రాకున్నా సరే… జూన్ మాసంలోనూ ఎండలు మండిపోతున్నాయి. మే నెలలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసి ఇక వేసవి చల్లబడినట్టేనన్న సూచనలు కనిపించాయి. అయితే మే మాసాంతం నుంచి జూన్ ప్రారంభం దాకా ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపంతో జనం అల్లాడిపోతున్నారు. ఇదేంటీ తొలకరి వర్షాలు వస్తాయనుకుంటే.. ఇక సూర్య భగవానుడు భగభగమంటూనే ఉన్నాడంటూ రైతాంగం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. పర్యావరణ సమతుల్యత కారణంగానే ఈ తరహాలో అనుకున్న సమయానికి వర్షాలు రాకపోవడం గానీ, ఎండలు మరింత కాలం పాటు కొనసాగడం గానీ జరుగుతూ ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.
This post was last modified on June 6, 2025 6:55 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…