ఏపీలో గత ఖరీఫ్, ఇటీవలే ముగిసిన రబీ సీజన్లు ఎంచక్కా… ఎలాంటి ఆటంకాలు, వాతావరణ ప్రతికూలతలు లేకుండా సాఫీగా సాగిపోయాయి. ఫలితంగా అన్నదాతలు కూడా మునుపటి కంటే కూడా నాలుగు బస్తాల ధాన్యాన్ని అధికంగా పండించి సంతోషంలో మునిగిపోయారు. అటు ఖరీఫ్ సీజన్ ముగింపు, ఇటు రబీ ముగింపు సందర్భంగా అకాల వర్షాలు లేని కారణంగా ఏపీలో ధాన్యం తడిసిందన్న మాటే వినిపించలేదు. అయితే ఈ ఏడాది తొలకరి వర్షాలు ముందుగానే వస్తాయన్న వాతావరణ శాఖ సూచనతో అన్నదాతలు ఎదురుచూస్తుంటే… వారి ఆశలు అడియాశలే అవుతున్నాయి.
మే నెలాఖరు నాటికే నైరుతి రుతు పవనాలు ప్రవేశించనున్నాయని, ఫలితంగా గతేడాది కంటే కాస్తంత ముందుగానే తొలకరి వర్షాలు పడతాయని గత నెలలో వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో అప్పటికే రబీ పంట నూర్పిళ్లు, ధాన్యం అమ్మకాలు పూర్తి చేసుకున్న అన్న దాతలు ఖరీఫ్ కు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. కూటమి సర్కారు కూడా ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. తొలికలి పడిందంటే… ఖరీఫ్ సాగు మొదలెట్టేద్దామని అన్నదాతలు చూస్తుండగా… నైరుతి మాత్రం అంతకంతకూ వెనక్కెళ్లిపోతోంది. ఫలితంగా అన్నదాత అయోమయంలో పడిపోయాడు.
ఇదిలా ఉంటే… నైరుతి ఆలస్యంతో తొలకరి వర్షాలు రాకున్నా సరే… జూన్ మాసంలోనూ ఎండలు మండిపోతున్నాయి. మే నెలలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసి ఇక వేసవి చల్లబడినట్టేనన్న సూచనలు కనిపించాయి. అయితే మే మాసాంతం నుంచి జూన్ ప్రారంభం దాకా ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపంతో జనం అల్లాడిపోతున్నారు. ఇదేంటీ తొలకరి వర్షాలు వస్తాయనుకుంటే.. ఇక సూర్య భగవానుడు భగభగమంటూనే ఉన్నాడంటూ రైతాంగం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. పర్యావరణ సమతుల్యత కారణంగానే ఈ తరహాలో అనుకున్న సమయానికి వర్షాలు రాకపోవడం గానీ, ఎండలు మరింత కాలం పాటు కొనసాగడం గానీ జరుగుతూ ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.
This post was last modified on June 6, 2025 6:55 am
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…