తొలి ఐపీఎల్ ట్రోఫీతో బెంగుళూరులో అడుగుపెట్టిన జట్టు సభ్యులకు ఘన స్వాగతం పలుకుతూ నిర్వహించిన విక్టరీ పరేడ్ లో అపశృతి జరిగింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు అభిమానులు మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరికొందరు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన అభిమానులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అభిమానులను, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జి చేశారు. దీంతో, చిన్న స్వామి స్టేడియం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఎట్టకేలకు ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో, నిన్న అర్థరాత్రి నుంచి ఆర్సీబీ అభిమానులతో పాటు కన్నడిగులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బెంగుళూరు హోం గ్రౌండ్ చిన్న స్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టు సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలోనే గ్రౌండ్ వరకు విక్టరీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేడియం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే స్టేడియం లోపలికి ఒక్కసారిగా వెళ్లేందుకు అభిమానులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పడంతో అభిమానులు ఒకరిపై ఒకరు పడ్డారు. ఊపిరి ఆడక ఆరుగురు మృతి చెందారు.
This post was last modified on June 4, 2025 5:44 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…