ఇది నార్వే టోర్నీలో చోటుచేసుకున్న అద్భుతమైన క్షణం. ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ను ఓడించడం అంటే సాధారణ విషయం కాదు. కానీ భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ఇది సాధించేశాడు. చెస్ ప్రపంచంలో దీన్ని ‘టర్నింగ్ పాయింట్’గా అభివర్ణించొచ్చు. ఈ విజయంతో గుకేశ్ ప్రత్యక్షంగా ప్రపంచ స్థాయిలో తనను తాను నిలబెట్టుకున్నాడు.
ఆరు రౌండ్లలో కీలకంగా నిలిచిన ఈ పోరులో గుకేశ్ ఆటలో ఓ వృద్ధి స్పష్టంగా కనిపించింది. కార్ల్సన్ చేసిన చిన్న పొరపాటును వెంటనే గుర్తించి తన ప్రయోజనంగా మలచుకున్నాడు. ఈ ఒత్తిడిలో మాగ్నస్ పిడికిలితో టేబుల్ కొట్టడం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత గుకేశ్ను క్షమించమని రెండు సార్లు అడగడం కూడా కార్ల్సన్పై ఒత్తిడి ఎలా పెరిగిందో చెప్పకనే చెబుతోంది.
నెంబర్ వన్ ప్లేయర్ ను మూడో స్థానంలో ఉన్న గుకేశ్ ఓడించడంతో వరల్డ్ వైడ్ గా ఈ పోరు హైలెట్ అయ్యింది. ఇప్పటివరకు టోర్నీలో గుకేశ్ స్థిరంగా ఆడుతున్నా, ఈ మ్యాచ్ తర్వాత అతనిపై అంతర్జాతీయంగా దృష్టి మరలింది. గతేడాది ఇదే టోర్నీలో ప్రజ్ఞానంద కూడా కార్ల్సన్ను ఓడించిన విషయం తెలిసిందే. అంటే భారత యువత చెస్లో ప్రపంచ నంబర్వన్ను ఎదుర్కొనే స్థాయికి చేరిపోయిందని ఇది సూచన.
ప్రస్తుతం కార్ల్సన్ టాప్లో ఉన్నప్పటికీ ఈ ఓటమి అతనికి మానసికంగా పెద్ద ఎదురుదెబ్బే. ఇక గుకేశ్ అద్భుత ఫామ్లో ఉండటంతో ముందు వచ్చే మ్యాచ్లపై ఆసక్తి మరింత పెరిగింది. ఒకప్పుడు చెస్ను చూసేది కొద్దిమంది మాత్రమే అయితే, ఇప్పుడు గుకేశ్, ప్రజ్ఞానంద లాంటి యువ క్రీడాకారుల విజయాలతో ఈ ఆట సామాన్య ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోతోంది అనడంలో సందేహం లేదు.
This post was last modified on June 2, 2025 2:24 pm
తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన గులాబీ గూటిలో ఇప్పుడు ఆసక్తికరమైన ఆధిపత్య పోరు మొదలైంది. కేసీఆర్ రాజకీయ…
పరిధి.. పరిమితులు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోవటం కొంతమంది వైసీపీ నేతలకు అలవాటే. దూకుడే తమ ఆయుధం అన్నట్లుగా వ్యవహరించే తీరు…
వైసీపీ అధినేత జగన్ చేయలేనిది ఇప్పుడు అనేక విషయాల్లో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేసి గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దాదాపు 21…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా.. ఇచ్చిన మాట.. ఆరు మాసాలు కూడా తిరక్కుండానే వాస్తవంకానుంది.…
తన రాజకీయ ప్రత్యర్థి వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పార్లమెంట్లో…