Trends

తెలుగోడి దెబ్బకు సహనం కోల్పోయిన నెంబర్ వన్ చెస్ ప్లేయర్

ఇది నార్వే టోర్నీలో చోటుచేసుకున్న అద్భుతమైన క్షణం. ప్ర‌పంచ నంబ‌ర్‌వ‌న్ మాగ్న‌స్ కార్ల్‌స‌న్‌ను ఓడించడం అంటే సాధారణ విషయం కాదు. కానీ భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ఇది సాధించేశాడు. చెస్ ప్రపంచంలో దీన్ని ‘టర్నింగ్ పాయింట్’గా అభివర్ణించొచ్చు. ఈ విజయంతో గుకేశ్ ప్ర‌త్యక్షంగా ప్రపంచ స్థాయిలో తనను తాను నిలబెట్టుకున్నాడు.

ఆరు రౌండ్లలో కీలకంగా నిలిచిన ఈ పోరులో గుకేశ్ ఆటలో ఓ వృద్ధి స్పష్టంగా కనిపించింది. కార్ల్‌సన్ చేసిన చిన్న పొరపాటును వెంటనే గుర్తించి తన ప్రయోజనంగా మలచుకున్నాడు. ఈ ఒత్తిడిలో మాగ్న‌స్ పిడికిలితో టేబుల్‌ కొట్టడం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత గుకేశ్‌ను క్షమించమని రెండు సార్లు అడగడం కూడా కార్ల్‌సన్‌పై ఒత్తిడి ఎలా పెరిగిందో చెప్పకనే చెబుతోంది. 

నెంబర్ వన్ ప్లేయర్ ను మూడో స్థానంలో ఉన్న గుకేశ్ ఓడించడంతో వరల్డ్ వైడ్ గా ఈ పోరు హైలెట్ అయ్యింది. ఇప్పటివరకు టోర్నీలో గుకేశ్ స్థిరంగా ఆడుతున్నా, ఈ మ్యాచ్ తర్వాత అతనిపై అంతర్జాతీయంగా దృష్టి మరలింది. గతేడాది ఇదే టోర్నీలో ప్ర‌జ్ఞానంద కూడా కార్ల్‌స‌న్‌ను ఓడించిన విషయం తెలిసిందే. అంటే భారత యువత చెస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ను ఎదుర్కొనే స్థాయికి చేరిపోయిందని ఇది సూచన.

ప్రస్తుతం కార్ల్‌సన్ టాప్‌లో ఉన్నప్పటికీ ఈ ఓటమి అతనికి మానసికంగా పెద్ద ఎదురుదెబ్బే. ఇక గుకేశ్ అద్భుత ఫామ్‌లో ఉండటంతో ముందు వచ్చే మ్యాచ్‌లపై ఆసక్తి మరింత పెరిగింది. ఒకప్పుడు చెస్‌ను చూసేది కొద్దిమంది మాత్రమే అయితే, ఇప్పుడు గుకేశ్, ప్ర‌జ్ఞానంద లాంటి యువ క్రీడాకారుల విజయాలతో ఈ ఆట సామాన్య ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోతోంది అనడంలో సందేహం లేదు.

This post was last modified on June 2, 2025 2:24 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Gukesh

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

5 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

6 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

6 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

6 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

7 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

7 hours ago