Trends

అలెర్ట్.. క్రోమ్ యూజర్లకు హెచ్చరిక!

ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు అనేకమంది ఆశ్రయించే గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో ప్రస్తుతానికి ప్రమాదకరమైన భద్రతా లోపాలు ఉన్నట్టు తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఐటీ విభాగానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) స్పష్టంగా హెచ్చరించింది. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లలో పాత వెర్షన్‌ క్రోమ్‌ను ఉపయోగిస్తున్నవారిపై సైబర్ ముప్పు పొంచి ఉందని వివరించింది.

ఎలా దాడి జరుగుతోంది?
CVE-2025-4664, CVE-2025-4609 అనే రెండు బగ్స్ వల్ల క్రోమ్ లోడింగ్, మోజో కాంపోనెంట్ పనితీరులో లోపాలు ఏర్పడుతున్నాయి. ఈ బగ్‌లను టార్గెట్ చేస్తూ హ్యాకర్లు ఓ మాలిషియస్ వెబ్‌సైట్‌ను యూజర్ ఓపెన్ చేస్తే, అతని కంప్యూటర్‌ను కంట్రోల్ చేసే స్థాయికి వెళ్లే ప్రమాదం ఉంది. దీంతో వ్యక్తిగత డేటా, పాస్‌వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలు వంటి సున్నితమైన సమాచారం దొంగిలించబడే అవకాశముంది.

విండోస్ వినియోగదారులలో 136.0.7103.114 కంటే పాత వెర్షన్ ఉన్నవారు, అలాగే మ్యాక్, లైనక్స్ వాడేవారు 136.0.7103.113 కంటే పాత వెర్షన్లు వాడుతున్నవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. వీరంతా వెంటనే అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది.

తక్షణమే చేయాల్సిన చర్యలు ఏమిటంటే.. బ్రౌజర్‌ను ఓపెన్ చేసి, పైభాగంలో కుడివైపు మూడు చుక్కల గుర్తుపై క్లిక్ చేయాలి. అందులో ‘Help’ ఆ తరువాత ‘About Google Chrome’ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేస్తే, క్రోమ్ తాజా వెర్షన్‌కి ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. ఇది పూర్తయిన తర్వాత బ్రౌజర్‌ను రీస్టార్ట్ చేయడం మర్చిపోకండి. ఆధునిక డిజిటల్ ప్రపంచంలో ఈ చిన్న అప్డేట్, పెద్ద నష్టాన్ని తప్పించగలదు. క్రోమ్ వాడుతున్న ప్రతి యూజర్‌కి ఇది అత్యవసర హెచ్చరిక. డేటా సురక్షితంగా ఉండాలంటే చర్య ఇప్పుడే అవసరం. 

Satya

Recent Posts

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

19 minutes ago

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

1 hour ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

1 hour ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

3 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

3 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

4 hours ago