Trends

అలెర్ట్.. క్రోమ్ యూజర్లకు హెచ్చరిక!

ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు అనేకమంది ఆశ్రయించే గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో ప్రస్తుతానికి ప్రమాదకరమైన భద్రతా లోపాలు ఉన్నట్టు తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఐటీ విభాగానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) స్పష్టంగా హెచ్చరించింది. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లలో పాత వెర్షన్‌ క్రోమ్‌ను ఉపయోగిస్తున్నవారిపై సైబర్ ముప్పు పొంచి ఉందని వివరించింది.

ఎలా దాడి జరుగుతోంది?
CVE-2025-4664, CVE-2025-4609 అనే రెండు బగ్స్ వల్ల క్రోమ్ లోడింగ్, మోజో కాంపోనెంట్ పనితీరులో లోపాలు ఏర్పడుతున్నాయి. ఈ బగ్‌లను టార్గెట్ చేస్తూ హ్యాకర్లు ఓ మాలిషియస్ వెబ్‌సైట్‌ను యూజర్ ఓపెన్ చేస్తే, అతని కంప్యూటర్‌ను కంట్రోల్ చేసే స్థాయికి వెళ్లే ప్రమాదం ఉంది. దీంతో వ్యక్తిగత డేటా, పాస్‌వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలు వంటి సున్నితమైన సమాచారం దొంగిలించబడే అవకాశముంది.

విండోస్ వినియోగదారులలో 136.0.7103.114 కంటే పాత వెర్షన్ ఉన్నవారు, అలాగే మ్యాక్, లైనక్స్ వాడేవారు 136.0.7103.113 కంటే పాత వెర్షన్లు వాడుతున్నవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. వీరంతా వెంటనే అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది.

తక్షణమే చేయాల్సిన చర్యలు ఏమిటంటే.. బ్రౌజర్‌ను ఓపెన్ చేసి, పైభాగంలో కుడివైపు మూడు చుక్కల గుర్తుపై క్లిక్ చేయాలి. అందులో ‘Help’ ఆ తరువాత ‘About Google Chrome’ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేస్తే, క్రోమ్ తాజా వెర్షన్‌కి ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. ఇది పూర్తయిన తర్వాత బ్రౌజర్‌ను రీస్టార్ట్ చేయడం మర్చిపోకండి. ఆధునిక డిజిటల్ ప్రపంచంలో ఈ చిన్న అప్డేట్, పెద్ద నష్టాన్ని తప్పించగలదు. క్రోమ్ వాడుతున్న ప్రతి యూజర్‌కి ఇది అత్యవసర హెచ్చరిక. డేటా సురక్షితంగా ఉండాలంటే చర్య ఇప్పుడే అవసరం. 

This post was last modified on May 21, 2025 11:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

6 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

14 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago