Trends

అలెర్ట్.. క్రోమ్ యూజర్లకు హెచ్చరిక!

ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు అనేకమంది ఆశ్రయించే గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో ప్రస్తుతానికి ప్రమాదకరమైన భద్రతా లోపాలు ఉన్నట్టు తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఐటీ విభాగానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) స్పష్టంగా హెచ్చరించింది. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లలో పాత వెర్షన్‌ క్రోమ్‌ను ఉపయోగిస్తున్నవారిపై సైబర్ ముప్పు పొంచి ఉందని వివరించింది.

ఎలా దాడి జరుగుతోంది?
CVE-2025-4664, CVE-2025-4609 అనే రెండు బగ్స్ వల్ల క్రోమ్ లోడింగ్, మోజో కాంపోనెంట్ పనితీరులో లోపాలు ఏర్పడుతున్నాయి. ఈ బగ్‌లను టార్గెట్ చేస్తూ హ్యాకర్లు ఓ మాలిషియస్ వెబ్‌సైట్‌ను యూజర్ ఓపెన్ చేస్తే, అతని కంప్యూటర్‌ను కంట్రోల్ చేసే స్థాయికి వెళ్లే ప్రమాదం ఉంది. దీంతో వ్యక్తిగత డేటా, పాస్‌వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలు వంటి సున్నితమైన సమాచారం దొంగిలించబడే అవకాశముంది.

విండోస్ వినియోగదారులలో 136.0.7103.114 కంటే పాత వెర్షన్ ఉన్నవారు, అలాగే మ్యాక్, లైనక్స్ వాడేవారు 136.0.7103.113 కంటే పాత వెర్షన్లు వాడుతున్నవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. వీరంతా వెంటనే అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది.

తక్షణమే చేయాల్సిన చర్యలు ఏమిటంటే.. బ్రౌజర్‌ను ఓపెన్ చేసి, పైభాగంలో కుడివైపు మూడు చుక్కల గుర్తుపై క్లిక్ చేయాలి. అందులో ‘Help’ ఆ తరువాత ‘About Google Chrome’ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేస్తే, క్రోమ్ తాజా వెర్షన్‌కి ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. ఇది పూర్తయిన తర్వాత బ్రౌజర్‌ను రీస్టార్ట్ చేయడం మర్చిపోకండి. ఆధునిక డిజిటల్ ప్రపంచంలో ఈ చిన్న అప్డేట్, పెద్ద నష్టాన్ని తప్పించగలదు. క్రోమ్ వాడుతున్న ప్రతి యూజర్‌కి ఇది అత్యవసర హెచ్చరిక. డేటా సురక్షితంగా ఉండాలంటే చర్య ఇప్పుడే అవసరం. 

This post was last modified on May 21, 2025 11:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

52 minutes ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

1 hour ago

తమ్ముడు పవన్ కు దారిచ్చిన అన్న బాలయ్య

ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…

2 hours ago

కృతి శెట్టిని వెంటాడుతున్న వాయిదాలు

ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…

2 hours ago

ఆ ఆస్తులపై షర్మిలకు హక్కు లేదా?

రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌…

3 hours ago

వాహ్ డీసీఎం.. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్

ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…

5 hours ago