ఇంటర్నెట్ బ్రౌజింగ్కు అనేకమంది ఆశ్రయించే గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ప్రస్తుతానికి ప్రమాదకరమైన భద్రతా లోపాలు ఉన్నట్టు తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఐటీ విభాగానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) స్పష్టంగా హెచ్చరించింది. ల్యాప్టాప్, డెస్క్టాప్లలో పాత వెర్షన్ క్రోమ్ను ఉపయోగిస్తున్నవారిపై సైబర్ ముప్పు పొంచి ఉందని వివరించింది.
ఎలా దాడి జరుగుతోంది?
CVE-2025-4664, CVE-2025-4609 అనే రెండు బగ్స్ వల్ల క్రోమ్ లోడింగ్, మోజో కాంపోనెంట్ పనితీరులో లోపాలు ఏర్పడుతున్నాయి. ఈ బగ్లను టార్గెట్ చేస్తూ హ్యాకర్లు ఓ మాలిషియస్ వెబ్సైట్ను యూజర్ ఓపెన్ చేస్తే, అతని కంప్యూటర్ను కంట్రోల్ చేసే స్థాయికి వెళ్లే ప్రమాదం ఉంది. దీంతో వ్యక్తిగత డేటా, పాస్వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలు వంటి సున్నితమైన సమాచారం దొంగిలించబడే అవకాశముంది.
విండోస్ వినియోగదారులలో 136.0.7103.114 కంటే పాత వెర్షన్ ఉన్నవారు, అలాగే మ్యాక్, లైనక్స్ వాడేవారు 136.0.7103.113 కంటే పాత వెర్షన్లు వాడుతున్నవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. వీరంతా వెంటనే అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది.
తక్షణమే చేయాల్సిన చర్యలు ఏమిటంటే.. బ్రౌజర్ను ఓపెన్ చేసి, పైభాగంలో కుడివైపు మూడు చుక్కల గుర్తుపై క్లిక్ చేయాలి. అందులో ‘Help’ ఆ తరువాత ‘About Google Chrome’ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేస్తే, క్రోమ్ తాజా వెర్షన్కి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఇది పూర్తయిన తర్వాత బ్రౌజర్ను రీస్టార్ట్ చేయడం మర్చిపోకండి. ఆధునిక డిజిటల్ ప్రపంచంలో ఈ చిన్న అప్డేట్, పెద్ద నష్టాన్ని తప్పించగలదు. క్రోమ్ వాడుతున్న ప్రతి యూజర్కి ఇది అత్యవసర హెచ్చరిక. డేటా సురక్షితంగా ఉండాలంటే చర్య ఇప్పుడే అవసరం.
This post was last modified on May 21, 2025 11:55 am
గత నెల మధ్యలో ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ టైంలో ఎంత హడావుడి నెలకొందో చూశాం. ప్రస్తుతం వరల్డ్ సినిమా…
లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…
బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా... జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ…
డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…