అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువుడుతున్న సంగతి తెలిసిందే. ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో భారత మూలాలు ఉన్న ముగ్గురు భారత సంతతి నేతలు గెలుపు దిశగా పరుగులు తీస్తున్నారు. వీరిలో ఒకరి విజయం తాజాగా ఖరారైంది. దీంతో.. భారతీయ అమెరికన్ల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
అమెరికా ప్రతినిధుల సభకు పోటీ చేసిన భారత సంతతికి చెందిన రాజా క్రిష్ణమూర్తి ముచ్చటగా మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. తాజా గెలుపుతో ఆయన హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 71 శాతం ఓట్లతో ఆయన తన ప్రత్యర్థి ప్రెస్టన్ నెల్సన్ పై విజయం సాధించారు. ఢిల్లీలో జన్మించిన క్రిష్ణమూర్తి తాజా ఫలితాలతో మూడోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఆయన తమిళనాడుకు చెందిన వారు.
కాలిఫోర్నియా నుంచి బరిలో దిగిన భారత సంతతికి చెందిన అమీ బిరా తన ప్రత్యర్థి కంటే దాదాపు 30 శాతం అధిక్యతలో కొనసాగుతున్నారు. ఐదోసారి చట్టసభకు వెళ్లే అవకాశం ఉందని చెబుతుననారు. మరో భారత సంతతికి చెందిన రో ఖన్నా కూడా ముచ్చటగా మూడోసారి గెలిచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆయన తన ప్రత్యర్థిపై యాభై శాతం ఓట్ల మెజార్టీతో దూసుకెళుతున్నారు. ఇలా.. భారత సంతతికి చెందిన పలువురు ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పయనిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వీరంతా డెమొక్రాటిక్ పార్టీకి చెందిన వారు కావటం గమనార్హం.
This post was last modified on November 4, 2020 11:42 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…