అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువుడుతున్న సంగతి తెలిసిందే. ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో భారత మూలాలు ఉన్న ముగ్గురు భారత సంతతి నేతలు గెలుపు దిశగా పరుగులు తీస్తున్నారు. వీరిలో ఒకరి విజయం తాజాగా ఖరారైంది. దీంతో.. భారతీయ అమెరికన్ల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
అమెరికా ప్రతినిధుల సభకు పోటీ చేసిన భారత సంతతికి చెందిన రాజా క్రిష్ణమూర్తి ముచ్చటగా మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. తాజా గెలుపుతో ఆయన హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 71 శాతం ఓట్లతో ఆయన తన ప్రత్యర్థి ప్రెస్టన్ నెల్సన్ పై విజయం సాధించారు. ఢిల్లీలో జన్మించిన క్రిష్ణమూర్తి తాజా ఫలితాలతో మూడోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఆయన తమిళనాడుకు చెందిన వారు.
కాలిఫోర్నియా నుంచి బరిలో దిగిన భారత సంతతికి చెందిన అమీ బిరా తన ప్రత్యర్థి కంటే దాదాపు 30 శాతం అధిక్యతలో కొనసాగుతున్నారు. ఐదోసారి చట్టసభకు వెళ్లే అవకాశం ఉందని చెబుతుననారు. మరో భారత సంతతికి చెందిన రో ఖన్నా కూడా ముచ్చటగా మూడోసారి గెలిచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆయన తన ప్రత్యర్థిపై యాభై శాతం ఓట్ల మెజార్టీతో దూసుకెళుతున్నారు. ఇలా.. భారత సంతతికి చెందిన పలువురు ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పయనిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వీరంతా డెమొక్రాటిక్ పార్టీకి చెందిన వారు కావటం గమనార్హం.
This post was last modified on November 4, 2020 11:42 pm
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…