ఆన్లైన్ పేమెంట్ వ్యవహారాలను మరింత సులభతరం చేయడంలో UPI (యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు ఒక ట్రాన్సాక్షన్ పూర్తయ్యేందుకు సగటున 30 సెకన్లు పట్టేది. అయితే, జూన్ 16 నుంచి ఈ వ్యవధిని సగానికి తగ్గిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై UPI డెబిట్, క్రెడిట్ ట్రాన్సాక్షన్లు కేవలం 15 సెకన్లలో పూర్తవుతాయని NPCI వెల్లడించింది.
ఈ నిర్ణయం అనుసంధాన బ్యాంకులకు API రెస్పాన్స్ టైమ్ పరిమితిని నిర్ణయించింది. ఒక పేమెంట్ ప్రారంభం నుంచి అది పూర్తయ్యే వరకు వ్యవధి 15 సెకన్లకు పరిమితం చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇది కేవలం వేగాన్ని పెంచే నిర్ణయం కాదు, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంలో కూడా కీలకమవుతుంది. ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ చేసే సమయం కూడా 75 శాతం వేగంగా మారనుంది.
ఉదాహరణకు, మీరు ఒక షాపులో QR కోడ్ స్కాన్ చేసి DBS బ్యాంక్ యాప్ ద్వారా SBI ఖాతాలోకి పేమెంట్ చేస్తే, మొత్తం ప్రక్రియ (రిక్వెస్ట్ పంపడం, NPCI ద్వారా వెళ్తుంది, DBS నుండి కన్ఫర్మేషన్ రావడం, మళ్లీ SBIకి తిరిగి వచ్చేవరకు) ఇప్పటివరకు 30 సెకన్లు పడుతుంది. కొత్త మార్గదర్శకాలతో ఇది కేవలం 15 సెకన్లలోనే పూర్తవుతుంది.
పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంక్లు లేదా యాప్లు ఒకసారి ట్రాన్సాక్షన్ ప్రారంభించాక దాని స్టేటస్ను 90 సెకన్ల వరకు చెక్ చేయవచ్చని NPCI తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. అంతేగాక, కొన్ని బ్యాంకుల అనుసంధాన వ్యవస్థలు వేగంగా స్పందించకపోవడం వల్ల తలెత్తే ఫెయిల్యూర్లను కూడా తగ్గించేందుకు ఈ మార్పులు అమలవుతాయి.
ఈ ఏడాది ఏప్రిల్లో UPI వృద్ధి రేటు సంవత్సరానికి 34% పెరిగింది. మొత్తం 17.89 బిలియన్ ట్రాన్సాక్షన్లు నమోదవగా, వీటి విలువ రూ.23.95 లక్షల కోట్లు. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22% వృద్ధి. అయితే మార్చిలో 31 రోజులు ఉండగా, ఏప్రిల్లో 30 రోజులు మాత్రమే ఉండటంతో స్వల్ప తగ్గుదల కనిపించింది.
ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ…
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…