ప్రపంచంలోని 120 కోట్లకుపైగా క్రైస్తవులకు మతపరమైన మార్గదర్శకుడిగా నిలిచిన పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:35 గంటలకు ఆయన వాటికన్ నగరంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యుమోనియా, కిడ్నీ సంబంధిత అనారోగ్యాలతో పోప్ తీవ్రంగా బాధపడుతున్న విషయం తెలిసిందే.
ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేరిన ఆయన, 38 రోజుల చికిత్స అనంతరం ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. కానీ ఆరోగ్యం బాగుపడక, మళ్లీ సమస్యలు తలెత్తగా ఈ ఉదయం మృతి చెందారు. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గొగ్లియో. 2013లో బెనడిక్ట్ 16వ వారు రాజీనామా చేయగా, వారిని మారుస్తూ పోప్గా బాధ్యతలు స్వీకరించారు.
దక్షిణ అమెరికా నుండి పోప్ అయ్యిన తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. తన పదవికాలంలో చర్చ్ పరిపాలనలో పారదర్శకతకు పెద్దపీట వేశారు. అంతేకాక, నిరుపేదల పట్ల ప్రేమాభిమానాన్ని, మత స్నేహాన్ని విశ్వసించిన నేతగా గౌరవించబడ్డారు. ఆయనను “ప్రజల పోప్”గా పిలిచేవారు. వివిధ మతాల వ్యక్తుల పట్ల గౌరవంతో వ్యవహరించిన పోప్ ఫ్రాన్సిస్ భారతదేశ సహా పలు దేశాల్లో మతకలహాల సమయంలో శాంతికి పిలుపునిచ్చారు.
ఆయన పదవికాలంలో హిందూ, ముస్లిం, బౌద్ధ మత నాయకులతో ఆత్మీయంగా కలసి మానవత్వాన్ని ప్రోత్సహించారు. ఎన్నో సందర్భాల్లో “మానవతే మతం” అని చెప్పి ప్రపంచ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు. అత్యంత విశాలదృక్పథంతో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పోప్గా తన పాత్రను అందరినీ మమతతో హత్తుకునేలా నిర్వర్తించారు.
ఆశ్చర్యకరంగా, మరణానికి కొన్ని గంటల ముందు మాత్రమే పోప్ ఫ్రాన్సిస్ ఈస్టర్ పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులకు సందేశమిచ్చారు. అనారోగ్యం తర్వాత తొలిసారిగా అంతటి పెద్ద జన సమూహం ముందు కనిపించడం విశేషం. ఇది ఆయన భక్తులపై ఉన్న ప్రేమను తెలిపే ఘటనగా మారింది. ఆయన మృతితో కేథలిక్ సమాజం లోపల మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మానవతావాదులు, మతపరమైన నాయకులు విషాదంలో మునిగిపోయారు.
వాటికన్ అధికార ప్రతినిధి కార్డినల్ ఫారెల్ ఆయన మృతిని ధృవీకరిస్తూ, “పోప్ ఫ్రాన్సిస్ జీవితం ప్రభువుకు సేవ చేయడానికే అంకితమైంది. ఆయన సద్గుణాలు, నిబద్ధత, సహనం ఈ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తాయి” అని పేర్కొన్నారు.
This post was last modified on April 21, 2025 5:04 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…