Trends

ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ ట్విస్ట్ ఏంటంటే..

ఆలస్యమైతే అయ్యింది కానీ ఇండియన్ ప్రిమియర్ లీగ్ ఈసారి మామూలుగా జరగట్లేదు. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఉత్కంభరితంగా సాగుతోంది ప్లేఆఫ్ రేసు. లీగ్ దశలో ఇక మిగిలింది రెండు మ్యాచ్‌లు మాత్రమే. మామూలుగా ఈపాటికి నాలుగు ప్లేఆఫ్ బెర్తులూ ఖరారైపోయి ఉండాలి. కానీ ఇప్పటిదాకా ముంబయి తప్ప ఎవరూ ముందంజ వేయలేదు. చివరి రెండు మ్యాచ్‌లను బట్టే మూడు ప్లేఆఫ్ బెర్తులు ఖరారవుతాయి.

చెన్నై సూపర్ కింగ్స్ చాలా ముందుగానే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఆదివారం ఓటముల చవిచూసిన కింగ్స్ ఎలెవన్, రాజస్థాన్ రాయల్స్ కూడా ఇంటి ముఖం పట్టాయి. మిగతా నాలుగు జట్లు ప్లేఆఫ్ మీద ఆశలతో ఉన్నాయి. సోమవారం రాత్రి ఢిల్లీ, బెంగళూరు మధ్య మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వాళ్లదే రెండో ప్లేఆఫ్ బెర్తు. ఓడిన జట్టుకు కూడా ప్లేఆఫ్ ఛాన్సుంటుంది కానీ.. అక్కడ నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది.

ఢిల్లీ వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోతే.. బెంగళూరు హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది. కాబట్టి ఈ రెండు జట్లలో ఏది గెలుస్తుందో చెప్పలేం. దక్షిణాది అభిమానులకు ఫేవరెట్ జట్టు బెంగళూరే అన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కోహ్లీ జట్టుకు భారీగా అభిమానులున్నారు. సోమవారం ఆ జట్టే గెలవాలని వారి ఆకాంక్ష. ఐతే బలాబలాల్లో చూస్తే కొంచెం బెంగళూరే తక్కువ అని చెప్పాలి. మరి ఈ రోజు బెంగళూరు ఓడిపోతే పరిస్థితి ఏంటన్న ఆందోళన అభిమానుల్ని వెంటాడుతోంది. ఐతే ఆ జట్టు ఓడినా.. మరీ ఎక్కువ తేడా లేకుండా చూసుకోవాలి.

కోల్‌కతాతో పోలిస్తే ఇటు బెంగళూరు, అటు ఢిల్లీల నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. ఈ రెండు జట్లలో ఏది ఓడినా తేడా 20 పరుగులకు మించకూడదు. ప్రత్యర్థి జట్టు లక్ష్యాన్ని ఛేదిస్తున్నట్లయితే.. మ్యాచ్‌ను చివరి రెండు ఓవర్ల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అప్పుడు రన్‌రేట్ పడిపోదు. అప్పుడు కోల్‌కతాను వెనక్కి నెట్టి ప్లేఆఫ్ బెర్తును ఖరారు చేసుకుంటాయి. ఐతే మంగళవారం ముంబయి చేతిలో సన్‌రైజర్స్ ఓడిపోతే.. సోమవారం ఓడే జట్టుతో పాటు కోల్‌కతా కూడా రన్‌రేట్‌తో సంబంధం లేకుండా ముందుకెళ్లిపోతాయి. సన్‌రైజర్స్ గెలిస్తే ఆ జట్టుతో పాటు మిగతా రెండు జట్లలో రన్‌రేట్ ఎక్కువన్న జట్టుకే ప్లేఆఫ్ ఛాన్సుంటుంది.

This post was last modified on November 2, 2020 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

4 minutes ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

2 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

2 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

5 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

8 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

8 hours ago