ఆలస్యమైతే అయ్యింది కానీ ఇండియన్ ప్రిమియర్ లీగ్ ఈసారి మామూలుగా జరగట్లేదు. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఉత్కంభరితంగా సాగుతోంది ప్లేఆఫ్ రేసు. లీగ్ దశలో ఇక మిగిలింది రెండు మ్యాచ్లు మాత్రమే. మామూలుగా ఈపాటికి నాలుగు ప్లేఆఫ్ బెర్తులూ ఖరారైపోయి ఉండాలి. కానీ ఇప్పటిదాకా ముంబయి తప్ప ఎవరూ ముందంజ వేయలేదు. చివరి రెండు మ్యాచ్లను బట్టే మూడు ప్లేఆఫ్ బెర్తులు ఖరారవుతాయి.
చెన్నై సూపర్ కింగ్స్ చాలా ముందుగానే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఆదివారం ఓటముల చవిచూసిన కింగ్స్ ఎలెవన్, రాజస్థాన్ రాయల్స్ కూడా ఇంటి ముఖం పట్టాయి. మిగతా నాలుగు జట్లు ప్లేఆఫ్ మీద ఆశలతో ఉన్నాయి. సోమవారం రాత్రి ఢిల్లీ, బెంగళూరు మధ్య మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్లదే రెండో ప్లేఆఫ్ బెర్తు. ఓడిన జట్టుకు కూడా ప్లేఆఫ్ ఛాన్సుంటుంది కానీ.. అక్కడ నెట్ రన్రేట్ కీలకమవుతుంది.
ఢిల్లీ వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోతే.. బెంగళూరు హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది. కాబట్టి ఈ రెండు జట్లలో ఏది గెలుస్తుందో చెప్పలేం. దక్షిణాది అభిమానులకు ఫేవరెట్ జట్టు బెంగళూరే అన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కోహ్లీ జట్టుకు భారీగా అభిమానులున్నారు. సోమవారం ఆ జట్టే గెలవాలని వారి ఆకాంక్ష. ఐతే బలాబలాల్లో చూస్తే కొంచెం బెంగళూరే తక్కువ అని చెప్పాలి. మరి ఈ రోజు బెంగళూరు ఓడిపోతే పరిస్థితి ఏంటన్న ఆందోళన అభిమానుల్ని వెంటాడుతోంది. ఐతే ఆ జట్టు ఓడినా.. మరీ ఎక్కువ తేడా లేకుండా చూసుకోవాలి.
కోల్కతాతో పోలిస్తే ఇటు బెంగళూరు, అటు ఢిల్లీల నెట్ రన్రేట్ మెరుగ్గా ఉంది. ఈ రెండు జట్లలో ఏది ఓడినా తేడా 20 పరుగులకు మించకూడదు. ప్రత్యర్థి జట్టు లక్ష్యాన్ని ఛేదిస్తున్నట్లయితే.. మ్యాచ్ను చివరి రెండు ఓవర్ల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అప్పుడు రన్రేట్ పడిపోదు. అప్పుడు కోల్కతాను వెనక్కి నెట్టి ప్లేఆఫ్ బెర్తును ఖరారు చేసుకుంటాయి. ఐతే మంగళవారం ముంబయి చేతిలో సన్రైజర్స్ ఓడిపోతే.. సోమవారం ఓడే జట్టుతో పాటు కోల్కతా కూడా రన్రేట్తో సంబంధం లేకుండా ముందుకెళ్లిపోతాయి. సన్రైజర్స్ గెలిస్తే ఆ జట్టుతో పాటు మిగతా రెండు జట్లలో రన్రేట్ ఎక్కువన్న జట్టుకే ప్లేఆఫ్ ఛాన్సుంటుంది.
This post was last modified on November 2, 2020 3:49 pm
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…