Trends

ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ ట్విస్ట్ ఏంటంటే..

ఆలస్యమైతే అయ్యింది కానీ ఇండియన్ ప్రిమియర్ లీగ్ ఈసారి మామూలుగా జరగట్లేదు. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఉత్కంభరితంగా సాగుతోంది ప్లేఆఫ్ రేసు. లీగ్ దశలో ఇక మిగిలింది రెండు మ్యాచ్‌లు మాత్రమే. మామూలుగా ఈపాటికి నాలుగు ప్లేఆఫ్ బెర్తులూ ఖరారైపోయి ఉండాలి. కానీ ఇప్పటిదాకా ముంబయి తప్ప ఎవరూ ముందంజ వేయలేదు. చివరి రెండు మ్యాచ్‌లను బట్టే మూడు ప్లేఆఫ్ బెర్తులు ఖరారవుతాయి.

చెన్నై సూపర్ కింగ్స్ చాలా ముందుగానే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఆదివారం ఓటముల చవిచూసిన కింగ్స్ ఎలెవన్, రాజస్థాన్ రాయల్స్ కూడా ఇంటి ముఖం పట్టాయి. మిగతా నాలుగు జట్లు ప్లేఆఫ్ మీద ఆశలతో ఉన్నాయి. సోమవారం రాత్రి ఢిల్లీ, బెంగళూరు మధ్య మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వాళ్లదే రెండో ప్లేఆఫ్ బెర్తు. ఓడిన జట్టుకు కూడా ప్లేఆఫ్ ఛాన్సుంటుంది కానీ.. అక్కడ నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది.

ఢిల్లీ వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోతే.. బెంగళూరు హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది. కాబట్టి ఈ రెండు జట్లలో ఏది గెలుస్తుందో చెప్పలేం. దక్షిణాది అభిమానులకు ఫేవరెట్ జట్టు బెంగళూరే అన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కోహ్లీ జట్టుకు భారీగా అభిమానులున్నారు. సోమవారం ఆ జట్టే గెలవాలని వారి ఆకాంక్ష. ఐతే బలాబలాల్లో చూస్తే కొంచెం బెంగళూరే తక్కువ అని చెప్పాలి. మరి ఈ రోజు బెంగళూరు ఓడిపోతే పరిస్థితి ఏంటన్న ఆందోళన అభిమానుల్ని వెంటాడుతోంది. ఐతే ఆ జట్టు ఓడినా.. మరీ ఎక్కువ తేడా లేకుండా చూసుకోవాలి.

కోల్‌కతాతో పోలిస్తే ఇటు బెంగళూరు, అటు ఢిల్లీల నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. ఈ రెండు జట్లలో ఏది ఓడినా తేడా 20 పరుగులకు మించకూడదు. ప్రత్యర్థి జట్టు లక్ష్యాన్ని ఛేదిస్తున్నట్లయితే.. మ్యాచ్‌ను చివరి రెండు ఓవర్ల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అప్పుడు రన్‌రేట్ పడిపోదు. అప్పుడు కోల్‌కతాను వెనక్కి నెట్టి ప్లేఆఫ్ బెర్తును ఖరారు చేసుకుంటాయి. ఐతే మంగళవారం ముంబయి చేతిలో సన్‌రైజర్స్ ఓడిపోతే.. సోమవారం ఓడే జట్టుతో పాటు కోల్‌కతా కూడా రన్‌రేట్‌తో సంబంధం లేకుండా ముందుకెళ్లిపోతాయి. సన్‌రైజర్స్ గెలిస్తే ఆ జట్టుతో పాటు మిగతా రెండు జట్లలో రన్‌రేట్ ఎక్కువన్న జట్టుకే ప్లేఆఫ్ ఛాన్సుంటుంది.

This post was last modified on November 2, 2020 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

51 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago