Trends

జ‌న‌సేన‌లోకి వైసీపీ కీల‌క‌ రెడ్డి నేత‌!

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌వ‌నాలు మారుతున్నాయి. నాయ‌కులు ఒక్కొక్క‌రుగా త‌మ దారి తాము చూసుకుంటున్నారు. మా నేత మార‌తాడ‌నే అనుకుంటున్నాం. మార‌క‌పోతే.. అప్పుడు చూస్తాను అని కొన్నాళ్ల కింద‌ట ఆన్‌లైన్ చానెల్‌తో మాట్లాడుతూ.. చెప్పిన కీల‌క నాయ‌కుడు, రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వైసీపీ ఒక‌రు ఇప్పుడు మార్పు దిశ‌గా అడుగులు వేస్తున్నారు. వైసీపీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతున్న ద‌రిమిలా.. ఆయ‌న త‌న దారి తాను చూసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన‌లోకి ఆయ‌న అడుగులు ప‌డుతున్న‌ట్టు తెలిసింది.

ఎవ‌రు? ఎక్క‌డ‌?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క‌మైన నాయ‌కుడిగా ఎదిగిన మానుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డికి సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్తానం ఉంది. తండ్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి వార‌స‌త్వంగా మానుగుంట రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 1989లో రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన మ‌హీధ‌ర్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఉండ‌గా.. వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుని మంత్రి కూడా అయ్యారు. త‌ర్వాత‌.. ఒక ద‌శ‌లో ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌క‌పోతే.. పార్టీనిఎదిరించి ఇండిపెండెంటుగా పోటీ చేశారు. ఈ క్ర‌మంలోనే 2014 వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మానుగుంట‌.. రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్య‌తిరేకిస్తూ.. ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

త‌ర్వాత‌.. 2018లో వైసీపీలో చేరారు. ఆది నుంచి టీడీపీతో విభేదించే మానుగుంట కుటుంబం.. ఆ పార్టీవైపు ఎప్పుడూ చూడ‌లేదు. 2019 ఎన్నిక‌ల్లో కందుకూరు నుంచి విజ‌యం ద‌క్కించుకున్న మానుగుంట మంత్రి పీఠంపై ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, జ‌గ‌న్ అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఇక‌, 2024 వ‌ర‌కు కూడా త‌న‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింద‌న్న ఆవేద‌న‌లోనే మానుగుంట మిగిలారు. చివ‌ర‌కు 2024 ఎన్నిక‌ల్లో మానుగుంట‌కు జ‌గ‌న్ టికెట్ కూడా ఇవ్వ‌లేదు. ఆ స‌మ‌యంలోనే పార్టీ మారాల‌ని అనుకున్నా.. మౌనంగా ఉన్నారు. ఇక‌, పార్టీ ఓడిపోయిన ద‌రిమిలా.. ఆయ‌న జ‌గ‌న్ లో మార్పు కోసం ఎదురు చూసిన‌ట్టు ప‌లు సంద‌ర్భాల్లో తెలిపారు.

అయితే.. వైసీపీ అధినేతలో మార్పు రాక‌పోగా.. నానాటికీ పార్టీ ప‌రిస్థితి దిగ‌జారుతున్న నేప‌థ్యంలో మార్పు దిశ‌గా మానుగుంట అడుగులు వేశారు. కందుకూరులో జ‌న‌సేన కార్య‌క్ర‌మాలు ఎక్కువ‌గా జ‌రుగుతుండ‌డం.. ఉమ్మ‌డి ప్ర‌కాశంలో వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, జ‌గ‌న్‌కు దగ్గ‌ర బంధువు బాలినేని శ్రీనివాస‌రెడ్డి కూడా జ‌న‌సేన‌లోనే ఉండ‌డం.. వంటి ప‌రిణామాల క్ర‌మంలో మానుగుంట ఇప్పుడు జ‌న‌సేన‌వైపు చూస్తున్నార‌ని కొన్నాళ్లుగా ప్ర‌చారం సాగుతోంది. వివాద ర‌హితుడు కావ‌డం.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం.. వంటివి ఉన్న నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా..ఆయ‌న రాక‌ను స్వాగ‌తించే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ ఉంది. జ‌న‌సేన నాయ‌కుల‌తో ప్ర‌స్తుతం మానుగుంట చ‌ర్చ‌ల్లో ఉన్నారు. వీటిని ఫైన‌ల్ చేయ‌గానే ఆయ‌న చేరిక ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

This post was last modified on April 20, 2025 12:22 pm

Share

Recent Posts

ట్రంప్ తుంట‌రి నిర్ణ‌యం… తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణ‌యాలు విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇరాన్‌పై ఒంటికాలిపై లేచిన…

1 hour ago

పులివెందులకు రమ్మంటావా… తాడేపల్లికి రమ్మంటావా

డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…

1 hour ago

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

5 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

6 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

7 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

8 hours ago