Trends

జ‌న‌సేన‌లోకి వైసీపీ కీల‌క‌ రెడ్డి నేత‌!

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌వ‌నాలు మారుతున్నాయి. నాయ‌కులు ఒక్కొక్క‌రుగా త‌మ దారి తాము చూసుకుంటున్నారు. మా నేత మార‌తాడ‌నే అనుకుంటున్నాం. మార‌క‌పోతే.. అప్పుడు చూస్తాను అని కొన్నాళ్ల కింద‌ట ఆన్‌లైన్ చానెల్‌తో మాట్లాడుతూ.. చెప్పిన కీల‌క నాయ‌కుడు, రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వైసీపీ ఒక‌రు ఇప్పుడు మార్పు దిశ‌గా అడుగులు వేస్తున్నారు. వైసీపీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతున్న ద‌రిమిలా.. ఆయ‌న త‌న దారి తాను చూసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన‌లోకి ఆయ‌న అడుగులు ప‌డుతున్న‌ట్టు తెలిసింది.

ఎవ‌రు? ఎక్క‌డ‌?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క‌మైన నాయ‌కుడిగా ఎదిగిన మానుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డికి సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్తానం ఉంది. తండ్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి వార‌స‌త్వంగా మానుగుంట రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 1989లో రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన మ‌హీధ‌ర్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఉండ‌గా.. వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుని మంత్రి కూడా అయ్యారు. త‌ర్వాత‌.. ఒక ద‌శ‌లో ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌క‌పోతే.. పార్టీనిఎదిరించి ఇండిపెండెంటుగా పోటీ చేశారు. ఈ క్ర‌మంలోనే 2014 వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మానుగుంట‌.. రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్య‌తిరేకిస్తూ.. ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

త‌ర్వాత‌.. 2018లో వైసీపీలో చేరారు. ఆది నుంచి టీడీపీతో విభేదించే మానుగుంట కుటుంబం.. ఆ పార్టీవైపు ఎప్పుడూ చూడ‌లేదు. 2019 ఎన్నిక‌ల్లో కందుకూరు నుంచి విజ‌యం ద‌క్కించుకున్న మానుగుంట మంత్రి పీఠంపై ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, జ‌గ‌న్ అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఇక‌, 2024 వ‌ర‌కు కూడా త‌న‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింద‌న్న ఆవేద‌న‌లోనే మానుగుంట మిగిలారు. చివ‌ర‌కు 2024 ఎన్నిక‌ల్లో మానుగుంట‌కు జ‌గ‌న్ టికెట్ కూడా ఇవ్వ‌లేదు. ఆ స‌మ‌యంలోనే పార్టీ మారాల‌ని అనుకున్నా.. మౌనంగా ఉన్నారు. ఇక‌, పార్టీ ఓడిపోయిన ద‌రిమిలా.. ఆయ‌న జ‌గ‌న్ లో మార్పు కోసం ఎదురు చూసిన‌ట్టు ప‌లు సంద‌ర్భాల్లో తెలిపారు.

అయితే.. వైసీపీ అధినేతలో మార్పు రాక‌పోగా.. నానాటికీ పార్టీ ప‌రిస్థితి దిగ‌జారుతున్న నేప‌థ్యంలో మార్పు దిశ‌గా మానుగుంట అడుగులు వేశారు. కందుకూరులో జ‌న‌సేన కార్య‌క్ర‌మాలు ఎక్కువ‌గా జ‌రుగుతుండ‌డం.. ఉమ్మ‌డి ప్ర‌కాశంలో వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, జ‌గ‌న్‌కు దగ్గ‌ర బంధువు బాలినేని శ్రీనివాస‌రెడ్డి కూడా జ‌న‌సేన‌లోనే ఉండ‌డం.. వంటి ప‌రిణామాల క్ర‌మంలో మానుగుంట ఇప్పుడు జ‌న‌సేన‌వైపు చూస్తున్నార‌ని కొన్నాళ్లుగా ప్ర‌చారం సాగుతోంది. వివాద ర‌హితుడు కావ‌డం.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం.. వంటివి ఉన్న నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా..ఆయ‌న రాక‌ను స్వాగ‌తించే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ ఉంది. జ‌న‌సేన నాయ‌కుల‌తో ప్ర‌స్తుతం మానుగుంట చ‌ర్చ‌ల్లో ఉన్నారు. వీటిని ఫైన‌ల్ చేయ‌గానే ఆయ‌న చేరిక ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

This post was last modified on April 20, 2025 12:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

24 minutes ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

38 minutes ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

4 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

6 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

7 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

7 hours ago