తమిళనాడులోని కడలూరు జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ యువకుడు తన తండ్రి మరణవార్తతో మునిగిపోయిన సమయంలో, అదే సమయంలో పెళ్లి చేసుకొని అందరినీ కదిలించాడు. కవణై గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి సెల్వరాజ్ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఆయన కుమారుడు అప్పు లా విద్యార్థి, అదే కాలేజీలో చదువుతున్న విజయశాంతితో ప్రేమలో ఉన్నాడు.
ఇద్దరూ ముద్దుగా ప్రేమించుకుంటూ, జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ విషయం ఇద్దరి కుటుంబాలకూ తెలపగా, వారు అంగీకరించారు. అయితే అప్పు తండ్రి సెల్వరాజ్ ఆకస్మిక మరణంతో పరిస్థితి మారిపోయింది. తండ్రి తన పెళ్లిని చూడలేదన్న బాధతో కన్నీరు కారుస్తున్న అప్పు, తండ్రి మృతదేహం ఎదుటే పెళ్లి చేసుకోవాలని భావించాడు. తండ్రి ఆశీర్వాదంగా మిగిలిపోవాలని భావించి, విజయశాంతిని ఒప్పించి తాళి కట్టాడు.
మృతదేహం ఎదురుగానే జరిగిన ఈ వివాహం అక్కడున్న వారందరినీ కలిచివేసింది. శోకంలో ఉన్న వారు ఈ ఘట్టాన్ని చూసి కంటతడి పెట్టారు. ఎవరికీ అంత వరకు వినీ చూడని విధంగా, అంత్యక్రియల నడుమ జరిగిన పెళ్లి అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. అప్పు తండ్రి చివరి కోరిక తీరలేదన్న బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఇది బాధను పోగొట్టే మార్గంగా అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ఈ యువకుడి తండ్రి కోసం చూపిన భావోద్వేగం నెటిజన్లను కదిలిస్తోంది.
This post was last modified on April 19, 2025 2:00 pm
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…
ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…