తమిళనాడులోని కడలూరు జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ యువకుడు తన తండ్రి మరణవార్తతో మునిగిపోయిన సమయంలో, అదే సమయంలో పెళ్లి చేసుకొని అందరినీ కదిలించాడు. కవణై గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి సెల్వరాజ్ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఆయన కుమారుడు అప్పు లా విద్యార్థి, అదే కాలేజీలో చదువుతున్న విజయశాంతితో ప్రేమలో ఉన్నాడు.
ఇద్దరూ ముద్దుగా ప్రేమించుకుంటూ, జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ విషయం ఇద్దరి కుటుంబాలకూ తెలపగా, వారు అంగీకరించారు. అయితే అప్పు తండ్రి సెల్వరాజ్ ఆకస్మిక మరణంతో పరిస్థితి మారిపోయింది. తండ్రి తన పెళ్లిని చూడలేదన్న బాధతో కన్నీరు కారుస్తున్న అప్పు, తండ్రి మృతదేహం ఎదుటే పెళ్లి చేసుకోవాలని భావించాడు. తండ్రి ఆశీర్వాదంగా మిగిలిపోవాలని భావించి, విజయశాంతిని ఒప్పించి తాళి కట్టాడు.
మృతదేహం ఎదురుగానే జరిగిన ఈ వివాహం అక్కడున్న వారందరినీ కలిచివేసింది. శోకంలో ఉన్న వారు ఈ ఘట్టాన్ని చూసి కంటతడి పెట్టారు. ఎవరికీ అంత వరకు వినీ చూడని విధంగా, అంత్యక్రియల నడుమ జరిగిన పెళ్లి అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. అప్పు తండ్రి చివరి కోరిక తీరలేదన్న బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఇది బాధను పోగొట్టే మార్గంగా అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ఈ యువకుడి తండ్రి కోసం చూపిన భావోద్వేగం నెటిజన్లను కదిలిస్తోంది.
This post was last modified on April 19, 2025 2:00 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…