తమిళనాడులోని కడలూరు జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ యువకుడు తన తండ్రి మరణవార్తతో మునిగిపోయిన సమయంలో, అదే సమయంలో పెళ్లి చేసుకొని అందరినీ కదిలించాడు. కవణై గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి సెల్వరాజ్ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఆయన కుమారుడు అప్పు లా విద్యార్థి, అదే కాలేజీలో చదువుతున్న విజయశాంతితో ప్రేమలో ఉన్నాడు.
ఇద్దరూ ముద్దుగా ప్రేమించుకుంటూ, జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ విషయం ఇద్దరి కుటుంబాలకూ తెలపగా, వారు అంగీకరించారు. అయితే అప్పు తండ్రి సెల్వరాజ్ ఆకస్మిక మరణంతో పరిస్థితి మారిపోయింది. తండ్రి తన పెళ్లిని చూడలేదన్న బాధతో కన్నీరు కారుస్తున్న అప్పు, తండ్రి మృతదేహం ఎదుటే పెళ్లి చేసుకోవాలని భావించాడు. తండ్రి ఆశీర్వాదంగా మిగిలిపోవాలని భావించి, విజయశాంతిని ఒప్పించి తాళి కట్టాడు.
మృతదేహం ఎదురుగానే జరిగిన ఈ వివాహం అక్కడున్న వారందరినీ కలిచివేసింది. శోకంలో ఉన్న వారు ఈ ఘట్టాన్ని చూసి కంటతడి పెట్టారు. ఎవరికీ అంత వరకు వినీ చూడని విధంగా, అంత్యక్రియల నడుమ జరిగిన పెళ్లి అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. అప్పు తండ్రి చివరి కోరిక తీరలేదన్న బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఇది బాధను పోగొట్టే మార్గంగా అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ఈ యువకుడి తండ్రి కోసం చూపిన భావోద్వేగం నెటిజన్లను కదిలిస్తోంది.
This post was last modified on April 19, 2025 2:00 pm
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…