తమిళనాడులోని కడలూరు జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ యువకుడు తన తండ్రి మరణవార్తతో మునిగిపోయిన సమయంలో, అదే సమయంలో పెళ్లి చేసుకొని అందరినీ కదిలించాడు. కవణై గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి సెల్వరాజ్ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఆయన కుమారుడు అప్పు లా విద్యార్థి, అదే కాలేజీలో చదువుతున్న విజయశాంతితో ప్రేమలో ఉన్నాడు.
ఇద్దరూ ముద్దుగా ప్రేమించుకుంటూ, జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ విషయం ఇద్దరి కుటుంబాలకూ తెలపగా, వారు అంగీకరించారు. అయితే అప్పు తండ్రి సెల్వరాజ్ ఆకస్మిక మరణంతో పరిస్థితి మారిపోయింది. తండ్రి తన పెళ్లిని చూడలేదన్న బాధతో కన్నీరు కారుస్తున్న అప్పు, తండ్రి మృతదేహం ఎదుటే పెళ్లి చేసుకోవాలని భావించాడు. తండ్రి ఆశీర్వాదంగా మిగిలిపోవాలని భావించి, విజయశాంతిని ఒప్పించి తాళి కట్టాడు.
మృతదేహం ఎదురుగానే జరిగిన ఈ వివాహం అక్కడున్న వారందరినీ కలిచివేసింది. శోకంలో ఉన్న వారు ఈ ఘట్టాన్ని చూసి కంటతడి పెట్టారు. ఎవరికీ అంత వరకు వినీ చూడని విధంగా, అంత్యక్రియల నడుమ జరిగిన పెళ్లి అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. అప్పు తండ్రి చివరి కోరిక తీరలేదన్న బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఇది బాధను పోగొట్టే మార్గంగా అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ఈ యువకుడి తండ్రి కోసం చూపిన భావోద్వేగం నెటిజన్లను కదిలిస్తోంది.
This post was last modified on April 19, 2025 2:00 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…