అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పినప్పటికీ.. ఐపీఎల్లో మెరుపులు మెరిపించి తనలో ఇంకా సత్తా తగ్గలేదని మహేంద్రసింగ్ ధోని చాటుతాడని అభిమానులు ఆశించారు. కానీ ఈసారి లీగ్లో బ్యాట్స్మన్గా ఘోర వైఫల్యం చవిచూశాడు ధోని. వేగంగా పరుగులు చేయలేక, షాట్లు ఆడలేక అతను అవస్థలు పడ్డ తీరును అందరూ చూశారు. కెప్టెన్గా కూడా ధోని ఈసారి అంత ప్రభావవంతంగా కనిపించలేదు.
చెన్నై లీగ్ బరిలో ఉండగా ప్లేఆఫ్కు చేరకపోవడం ఇదే తొలిసారి. బ్యాట్స్మన్గా, కెప్టెన్గా రెండు విధాలా ధోని విఫలమైన నేపథ్యంలో ఇక ఐపీఎల్లోనూ అతడి పనైపోయిందన్న వ్యాఖ్యానాలు వినిపించాయి. చెన్నై జట్టు వచ్చే సీజన్కు కూడా అతను కొనసాగాలనే కోరుకున్నప్పటికీ ధోని ఉంటాడా అన్న సందేహాలు కలిగాయి.
ఐతే ఇప్పుడు స్వయంగా ధోనీనే ఆటకు టాటా చెప్పే విషయంలో స్పష్టత ఇచ్చాడు. వచ్చే ఐపీఎల్లోనూ తాను ఆడబోతున్నట్లు చెప్పకనే చెప్పేశాడు. ఆదివారం ఈ సీజన్లో చెన్నై చివరి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు కామెంటేటర్ డానీ మోరిసన్.. ధోనీని ఒక ఆసక్తికర ప్రశ్న వేశాడు. పసుపు రంగు దుస్తుల్లో ఇదే చివరి మ్యాచా అని అడిగాడు. దానికి ధోనీ.. కచ్చితంగా కాదు అని సమాధానం ఇచ్చాడు. అంటే వచ్చే సీజన్లో కూడా ధోని ఉంటాడని స్పష్టం అయిపోయింది.
ఐతే తర్వాతి సీజన్కు ఇంకో ఐదు నెలలే సమయం ఉంది. కాబట్టి ఇప్పుడు తాను తప్పుకుని చెన్నై జట్టులో, అభిమానుల్లో అలజడి రేపడం ఎందుకని ధోని భావిస్తుండొచ్చు. ఈ ఐదు నెలల్లో బాగా సాధన చేసి వచ్చే సీజన్లో సత్తా చాటాలని భావిస్తుండొచ్చు. ఐతే 2021లో ధోని ఆట ఎలా ఉన్నా అతను ఐపీఎల్కు కూడా టాటా చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నట్లే.
This post was last modified on November 2, 2020 10:39 am
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…