Trends

ఇంజెక్షన్‌ల భయానికి చెక్ పెట్టిన కొత్త టెక్నాలజీ

ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని పేరు ఉంది. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం మంది పిల్లలు, 30 శాతం మంది పెద్దలు ఈ ఇంజెక్షన్ భయాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఒక వినూత్న పరిష్కారం వచ్చేసింది.. అదే సూది లేని ఇంజెక్షన్. బెంగళూరులో తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో ‘ఇంటెగ్రి మెడికల్’ సంస్థ ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టింది.

ఈ పరికరాన్ని ‘ఎన్-ఫిస్’ పేరిట మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఇది సూదిలేకుండా మందును శరీరంలోకి చొప్పించగలదు. ఎలాగంటే, మందును అధిక పీడనంతో చర్మం పైపైన ఉండే సూక్ష్మ రంధ్రాల గుండా లోపలికి పంపుతుంది. ఫలితంగా నొప్పి లేకుండా కండరాల్లోకి ఔషధం చొచ్చుకుపోతుంది. టీకాలు, ఇమ్యూనైజేషన్, డయాబెటిస్, పెయిన్ మేనేజ్‌మెంట్ తదితర చికిత్సల కోసం దీనిని వినియోగించవచ్చు.

ప్రస్తుతం దేశంలో వెయ్యికి పైగా వైద్యులు ఈ సూనీదు ఇంజెక్షన్‌ను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. సౌకర్యవంతమైన వినియోగంతో పాటు, భద్రతా ప్రమాణాలను కూడా ఈ పరికరం పాటిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాలను అనుసరిస్తోంది. ముఖ్యంగా బాలల కోసం టీకాలు ఇవ్వడంలో ఇది ఎంతో ఉపయోగపడనుంది.

ఇంటెగ్రి మెడికల్ సంస్థ ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తో ఈ పరికరం వినియోగంపై ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ ఈ టెక్నాలజీని విస్తరించే లక్ష్యంతో వారు ముందడుగు వేస్తున్నారు. ఆరోగ్య రంగంలో ఈ పరికరం ఒక మార్గదర్శకంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంజెక్షన్ భయాన్ని అడ్డంకిగా మార్చుకుని వైద్యాన్ని దూరంగా ఉంచుకునే వారికి, ఇప్పుడు ఇది నిజమైన వరం అని చెప్పొచ్చు. సాంకేతిక పరిజ్ఞానం ప్రజల మానసిక భయాలను కూడా తొలగించగలదని ‘ఎన్-ఫిస్’ ఉదాహరణగా నిలుస్తోంది.

This post was last modified on April 16, 2025 10:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…

33 minutes ago

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…

55 minutes ago

పవన్ భార్యకు కూడా చిరు అన్నయే…

​మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…

2 hours ago

‘ఉస్తాద్’కు లాస్ట్ ఛాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…

2 hours ago

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

2 hours ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

3 hours ago