ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని పేరు ఉంది. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం మంది పిల్లలు, 30 శాతం మంది పెద్దలు ఈ ఇంజెక్షన్ భయాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఒక వినూత్న పరిష్కారం వచ్చేసింది.. అదే సూది లేని ఇంజెక్షన్. బెంగళూరులో తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో ‘ఇంటెగ్రి మెడికల్’ సంస్థ ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టింది.
ఈ పరికరాన్ని ‘ఎన్-ఫిస్’ పేరిట మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇది సూదిలేకుండా మందును శరీరంలోకి చొప్పించగలదు. ఎలాగంటే, మందును అధిక పీడనంతో చర్మం పైపైన ఉండే సూక్ష్మ రంధ్రాల గుండా లోపలికి పంపుతుంది. ఫలితంగా నొప్పి లేకుండా కండరాల్లోకి ఔషధం చొచ్చుకుపోతుంది. టీకాలు, ఇమ్యూనైజేషన్, డయాబెటిస్, పెయిన్ మేనేజ్మెంట్ తదితర చికిత్సల కోసం దీనిని వినియోగించవచ్చు.
ప్రస్తుతం దేశంలో వెయ్యికి పైగా వైద్యులు ఈ సూనీదు ఇంజెక్షన్ను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. సౌకర్యవంతమైన వినియోగంతో పాటు, భద్రతా ప్రమాణాలను కూడా ఈ పరికరం పాటిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాలను అనుసరిస్తోంది. ముఖ్యంగా బాలల కోసం టీకాలు ఇవ్వడంలో ఇది ఎంతో ఉపయోగపడనుంది.
ఇంటెగ్రి మెడికల్ సంస్థ ఇప్పటికే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తో ఈ పరికరం వినియోగంపై ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ ఈ టెక్నాలజీని విస్తరించే లక్ష్యంతో వారు ముందడుగు వేస్తున్నారు. ఆరోగ్య రంగంలో ఈ పరికరం ఒక మార్గదర్శకంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంజెక్షన్ భయాన్ని అడ్డంకిగా మార్చుకుని వైద్యాన్ని దూరంగా ఉంచుకునే వారికి, ఇప్పుడు ఇది నిజమైన వరం అని చెప్పొచ్చు. సాంకేతిక పరిజ్ఞానం ప్రజల మానసిక భయాలను కూడా తొలగించగలదని ‘ఎన్-ఫిస్’ ఉదాహరణగా నిలుస్తోంది.
This post was last modified on April 16, 2025 10:38 am
హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత ఆలస్యం అవుతున్న సినిమా. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి…
ప్రవస్థి అనే యువ సింగర్.. ఈటీవీలో వచ్చే లెజెండరీ మ్యూజిక్ ప్రోగ్రాం పాడుతా తీయగాలో తనకు జరిగిన అన్యాయంపై తీవ్ర…
పసిడి పరుగులు పెడుతోంది. క్షిపణి వేగాన్ని మించిన ధరలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని మార్కెట్…
ఏపీలో వైసీపీ పాలనలో చీపు లిక్కరును మద్యం బాబులకు అంటగట్టి.. భారీ ధరలతో వారిని దోచేసిన విషయం తెలిసిందే. అన్నీ…
ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు మంత్రులను కలుసుకుని సాగునీటి ప్రాజెక్టులు, రైలు…
నవ్యాంధ్ర రాజధానిలో పెట్టుబడులు.. పరిశ్రమలు.. మాత్రమేకాదు.. కలకాలం గుర్తుండిపోయేలా.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా దీనిని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు…