ఐపీఎల్లో రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు గెలిచిన జట్టు ముంబయి ఇండియన్స్. కానీ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది. తొలి మ్యాచ్లో విజయంతో సీజన్లో శుభారంభం చేసిన ఆ జట్టు.. ఆ తర్వాత గెలుపు ముఖమే చూడలేదు. వరుసగా నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో కింద ఉంటోంది. రోహిత్ శర్మ స్థానంలో గత ఏడాది కెప్టెన్గా నియమితుడై తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న హార్దిక్ పాండ్య.. జట్టును సరిగా నడిపించలేకపోయాడు.
ఈ సీజన్లో ఆ గొడవ సద్దుమణగడంతో ముంబయి గాడిన పడుతుందని అంతా అనుకున్నారు. కానీ జట్టు మరోసారి పేలవ ప్రదర్శన చేస్తోంది. హార్దిక్ ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటుతున్నప్పటికీ.. జట్టును మాత్రం గెలిపించలేకపోతున్నాడు. హార్దిక్ కెప్టెన్సీ బాగా లేకపోవడం వల్లే ముంబయి రాణించలేకపోతోందనే విమర్శలు తప్పట్లేదు.
ఈ తరహా విమర్శలు చేసేవాళ్లకు తెలుగు స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు దీటైన బదులిచ్చాడు. ఒక చర్చా కార్యక్రమంలో టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, మాజీ కోచ్ సంజయ్ బంగర్.. హార్దిక్ కెప్టెన్సీ గురించి మాట్లాడాడు. రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తుండడంతో హార్దిక్కు కెప్టెన్సీ పరంగా సరైన సలహాలు ఇచ్చేవారు కరవయ్యారని బంగర్ వ్యాఖ్యానించగా.. ఈ కామెంట్స్తో రాయుడు తీవ్రంగా విభేదించాడు. ఒక కెప్టెన్కు పక్కనుండి ఎవరూ చెవిలో చెబుతూ ఉండాల్సిన అవసరం లేదని రాయుడు అన్నాడు. గత సీజన్లో ఇలా చేసే అతణ్ని ఇబ్బంది పెట్టారన్నాడు.
రోహిత్ గొప్ప కెప్టెన్ అనడంలో సందేహం లేదని.. కానీ ఇప్పుడు ముంబయి హార్దిక్ జట్టని అతనన్నాడు. రోహిత్ కెప్టెన్గా ఉండగా ఎవరైనా సలహాలు ఇచ్చారా, అలా ఇస్తే బాగుండేదా అని అతను ప్రశ్నించాడు. మధ్యలో బంగర్ జోక్యం చేసుకుని రోహిత్ ఐదుసార్లు కప్పు గెలిచాడని, నీకు కెప్టెన్గా అనుభవం లేదు కాబట్టి ఈ విషయాలు తెలియవని కామెంట్ చేయగా.. రోహిత్ ఇప్పుడు కెప్టెన్ కాదు, సారథిగా తన శకం ముగిసిందని రాయుడు తేల్చేశాడు.
This post was last modified on April 9, 2025 2:12 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…