Trends

మార్కెట్ పతనం.. భారత సంపన్నులు ఎంత కోల్పోయారు?

ఒక్క రోజు మార్కెట్ పతనంతో ప్రపంచ కుబేరులకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావం స్టాక్ మార్కెట్లను హడలెత్తించింది. దాంతో పాటు దేశీయంగా కూడా మార్కెట్లు నేలచూపులు చూశాయి. దీంతో భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లు తమ సంపదలో భారీగా కోల్పోయారు. ప్రముఖ ఆర్థిక పత్రిక ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ ప్రకారం.. కేవలం ఒక్క రోజులోనే భారత కుబేరులు రూ.86,000 కోట్లకు పైగా కోల్పోయినట్లు వెల్లడించింది.

భారత ధనవంతుల్లో టాప్‌లో ఉన్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఒక్కరోజులోనే $3.6 బిలియన్లు కోల్పోయారు. గౌతమ్ అదానీ సంపదలో $3 బిలియన్ల తగ్గుదల చోటు చేసుకోగా, సావిత్రి జిందాల్ ఫ్యామిలీ $2.2 బిలియన్లు, శివ్ నాడార్ $1.5 బిలియన్లకు పైగా కోల్పోయారు. సోమవారం జరిగిన ఈ మార్కెట్ పతనంతో, ఒకే రోజు నాలుగు టాప్ ఇండియన్ బిలియనీర్లు కలిపి దాదాపు $10.3 బిలియన్ల సంపదను పోగొట్టుకోవాల్సి వచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2,200 పాయింట్లకు పైగా పడిపోవడం, నిఫ్టీ 700 పాయింట్లు కోల్పోవడం దీనికి ప్రధాన కారణాలు.

అయితే ట్రంప్ టారిఫ్‌ వల్ల మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు, వాణిజ్య ఉద్రిక్తతలతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండటంతో అమ్మకాలు పెరిగాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో కార్పొరేట్ లాభాలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే సమయంలో, రేట్ల పెంపు భయాలు కూడా మార్కెట్‌లో ఒత్తిడిని పెంచినట్లు కనిపిస్తోంది.

ఇక ఈ ప్రభావం కేవలం భారత బిలియనీర్లకే పరిమితం కాలేదు. ప్రపంచ ధనవంతుల్లోనూ నష్టాలు మామూలుగా లేవు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఒక్కరోజులో $130 బిలియన్లు కోల్పోయి తన సంపదను $302 బిలియన్లకు తగ్గించుకున్నారు. జెఫ్ బెజోస్ $45 బిలియన్లు, మార్క్ జూకర్‌బర్గ్ $28 బిలియన్లు, బెర్నార్డ్ ఆర్నాల్ట్ $18 బిలియన్లు కోల్పోయారు. బిల్ గేట్స్ సంపద కూడా $3.3 బిలియన్లు తగ్గిపోయింది. ఇదిలా ఉంటే.. పెట్టుబడిదారుల వాపులు కొనసాగుతుండగా, మార్కెట్లు మళ్లీ ఎప్పుడు కోలుకుంటాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది.

This post was last modified on April 8, 2025 11:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

1 hour ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago