ఆయన కోటీశ్వరుడి కుమారుడు. ఎండకన్నెరుగని ఫ్యామిలీ. అయితే.. ఇప్పుడు కారణాలు ఏవైనా.. కాలినడక పట్టారు. ఏకంగా.. 140 కిలో మీటర్ల దూరాన్ని పాదయాత్రగా చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనే భారత దేశ వ్యాపార దిగ్గజం ముఖేష్ కుమార్ అంబానీ తనయుడు.. అనంత్ అంబానీ. ప్రస్తుతం ఆయన గుజరాత్లోని జామ్ నగర్ నుంచి ప్రఖ్యాత కృష్ణ క్షేత్రం ద్వారకకు పాదయాత్ర చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 140 కిలో మీటర్లు కావడం గమనార్హం.
అనంత్ అంబానీ చేస్తున్న పాదయాత్రకు.. ప్రభుత్వం పలు ప్రణాళికలు చేసి.. ఆయనకు సూచనలు చేసింది. జనాలు రద్దీగా ఉన్న సమయంలో పాదయాత్ర చేయడం లేదు. కేవలం రాత్రి 11 గంటల తర్వాత.. నుంచి ఉదయం 6 వరకు మాత్రమే ఆయన పాదయాత్ర చేస్తున్నారు. దీనివల్ల అనంత్ అంబానీ వ్యక్తిగత భద్రతతోపాటు.. ఎలాంటి ట్రాఫిక్ జామ్లు లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయా వేళల్లోనే అనంత్ అంబానీ తన పాదయాత్ర చేస్తున్నారు.
కారణాలు ఏంటి?
అయితే అనంత్ అంబానీ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారన్న విషయం మాత్రం ఇప్పటికీ స్పష్టం కాలే దు. ఈ నెల 10న అనంత అంబానీ పుట్టినరోజు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఆ రోజు నాటికి ద్వారకకు చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారని అంటున్నారు. ఇక, అనంత్ అంబానీ.. వ్యాపార సామ్రాజ్యం గురించి తెలిసిందే. ప్రస్తుతం జియో సహా రిలయెన్స్కు చెందిన పలు కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వెంట వ్యక్తిగత భద్రతా సిబ్బంది మాత్రమే పాదయాత్రలో పాల్గొంటున్నారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…