ఆయన కోటీశ్వరుడి కుమారుడు. ఎండకన్నెరుగని ఫ్యామిలీ. అయితే.. ఇప్పుడు కారణాలు ఏవైనా.. కాలినడక పట్టారు. ఏకంగా.. 140 కిలో మీటర్ల దూరాన్ని పాదయాత్రగా చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనే భారత దేశ వ్యాపార దిగ్గజం ముఖేష్ కుమార్ అంబానీ తనయుడు.. అనంత్ అంబానీ. ప్రస్తుతం ఆయన గుజరాత్లోని జామ్ నగర్ నుంచి ప్రఖ్యాత కృష్ణ క్షేత్రం ద్వారకకు పాదయాత్ర చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 140 కిలో మీటర్లు కావడం గమనార్హం.
అనంత్ అంబానీ చేస్తున్న పాదయాత్రకు.. ప్రభుత్వం పలు ప్రణాళికలు చేసి.. ఆయనకు సూచనలు చేసింది. జనాలు రద్దీగా ఉన్న సమయంలో పాదయాత్ర చేయడం లేదు. కేవలం రాత్రి 11 గంటల తర్వాత.. నుంచి ఉదయం 6 వరకు మాత్రమే ఆయన పాదయాత్ర చేస్తున్నారు. దీనివల్ల అనంత్ అంబానీ వ్యక్తిగత భద్రతతోపాటు.. ఎలాంటి ట్రాఫిక్ జామ్లు లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయా వేళల్లోనే అనంత్ అంబానీ తన పాదయాత్ర చేస్తున్నారు.
కారణాలు ఏంటి?
అయితే అనంత్ అంబానీ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారన్న విషయం మాత్రం ఇప్పటికీ స్పష్టం కాలే దు. ఈ నెల 10న అనంత అంబానీ పుట్టినరోజు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఆ రోజు నాటికి ద్వారకకు చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారని అంటున్నారు. ఇక, అనంత్ అంబానీ.. వ్యాపార సామ్రాజ్యం గురించి తెలిసిందే. ప్రస్తుతం జియో సహా రిలయెన్స్కు చెందిన పలు కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వెంట వ్యక్తిగత భద్రతా సిబ్బంది మాత్రమే పాదయాత్రలో పాల్గొంటున్నారు.
This post was last modified on April 1, 2025 3:44 pm
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…