Political News

కోటీశ్వ‌రుడి కాలిన‌డ‌క‌.. ద్వార‌క‌కు అంబానీ త‌న‌యుడు!

ఆయ‌న కోటీశ్వ‌రుడి కుమారుడు. ఎండ‌క‌న్నెరుగ‌ని ఫ్యామిలీ. అయితే.. ఇప్పుడు కార‌ణాలు ఏవైనా.. కాలినడ‌క ప‌ట్టారు. ఏకంగా.. 140 కిలో మీట‌ర్ల దూరాన్ని పాద‌యాత్రగా చేరుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆయ‌నే భార‌త దేశ వ్యాపార దిగ్గ‌జం ముఖేష్ కుమార్ అంబానీ త‌న‌యుడు.. అనంత్ అంబానీ. ప్ర‌స్తుతం ఆయ‌న గుజ‌రాత్‌లోని జామ్ న‌గ‌ర్ నుంచి ప్ర‌ఖ్యాత కృష్ణ క్షేత్రం ద్వారకకు పాద‌యాత్ర చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల మ‌ధ్య దూరం 140 కిలో మీట‌ర్లు కావ‌డం గ‌మ‌నార్హం.

అనంత్ అంబానీ చేస్తున్న పాద‌యాత్ర‌కు.. ప్ర‌భుత్వం ప‌లు ప్ర‌ణాళిక‌లు చేసి.. ఆయ‌న‌కు సూచ‌నలు చేసింది. జ‌నాలు ర‌ద్దీగా ఉన్న స‌మ‌యంలో పాద‌యాత్ర చేయ‌డం లేదు. కేవ‌లం రాత్రి 11 గంట‌ల త‌ర్వాత‌.. నుంచి ఉద‌యం 6 వ‌ర‌కు మాత్ర‌మే ఆయ‌న పాద‌యాత్ర చేస్తున్నారు. దీనివ‌ల్ల అనంత్ అంబానీ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌తోపాటు.. ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో యూపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఆయా వేళ‌ల్లోనే అనంత్ అంబానీ త‌న పాద‌యాత్ర చేస్తున్నారు.

కార‌ణాలు ఏంటి?

అయితే అనంత్ అంబానీ ఎందుకు పాద‌యాత్ర చేస్తున్నార‌న్న విష‌యం మాత్రం ఇప్ప‌టికీ స్ప‌ష్టం కాలే దు. ఈ నెల‌ 10న అనంత అంబానీ పుట్టినరోజు ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఆ రోజు నాటికి ద్వారకకు చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్నార‌ని అంటున్నారు. ఇక‌, అనంత్ అంబానీ.. వ్యాపార సామ్రాజ్యం గురించి తెలిసిందే. ప్ర‌స్తుతం జియో స‌హా రిల‌యెన్స్‌కు చెందిన‌ ప‌లు కంపెనీల్లో డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వెంట వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బంది మాత్ర‌మే పాద‌యాత్ర‌లో పాల్గొంటున్నారు.

This post was last modified on April 1, 2025 3:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

53 minutes ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

2 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

2 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

2 hours ago

మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత

ఢిల్లీ మ‌ద్యం కేసులో త‌న‌ను నిర‌ప‌రాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత కృత‌జ్ఞ‌త‌లు…

3 hours ago

రెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానా

పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…

4 hours ago