అషుతోష్ శర్మ.. పంత్ ఆశను తగలబెట్టేశాడు

ఐపీఎల్ 4వ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ మొదట్లో ఎంత కిక్ ఇచ్చిందో సెకండ్ ఇన్నింగ్స్ మధ్యలో నుంచి చివరి వరకు అదే రేంజ్ థ్రిల్ ఇచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ సాధించిన విజయం ఆల్ టైమ్ బెస్ట్ చేసింగ్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు. మార్ష్ (72) – పూరన్ 75 (30) ధాటికి లక్నో 209 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యంతో దిగిన ఢిల్లీకి మొదట్లోనే ఊహించని షాక్ తగిలింది.

7 పరుగులకే టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ ఒక్కొక్కరు వెనుదిరిగారు. కానీ చివర్లో అషుతోష్ (66) పంత్ ఆశను తగలబెట్టేశాడు. మధ్యలో అక్షర్ (22) ట్రాక్ లోకి వచ్చినట్లు కనిపించినా వెంటనే ఔట్ అయ్యాడు. ఆ తరువాత సీనియర్ ప్లేయర్ డూప్లెసిస్ (29) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. దీంతో ఢిల్లీ ఓటమి చెందినట్లే అని అందరు అనుకున్నారు. కానీ స్టబ్స్ – అషుతోష్ శర్మ జోడి మంచి భాగస్వామ్యంతో బలాన్ని ఇచ్చింది.

కానీ వరుసగా రెండు సిక్స్ లు కొట్టిన అనంతరం స్టబ్స్(34) కూడా అవుట్ కావడం మ్యాచ్ ను మలుపు తిప్పేసింది. ఇక ఆ తరువాతే అసలు ఆట మొదలైంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి మొదటి మ్యాచ్ ఆడిన విప్ రాజ్ నిగమ్(39) లక్నో బౌలర్లకు భయం పుట్టించాడు. కానీ అతను కీలక సమయంలో అవుట్ అవ్వడంతో చివర్లో అషుతోష్(66) మ్యాచ్ ను భయం లేకుండా ఫినిష్ చేశాడు. చివర్లో 9 వికెట్లు పడ్డప్పుడు కాస్త టెన్షన్ పెట్టినప్పటి అషుతోష్ కు స్ట్రైక్ రావడంతో మ్యాచ్ ను సిక్సర్ తో ఫినిష్ చేశాడు.